VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల ప్రధాన కార్యక్రమానికి ఈ నెల 27న ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, భారతరత్న సచిన్ టెండూల్కర్ విశిష్ట అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సుమారు 25 వేల మంది విద్యార్థుల సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.