NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థినుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. క్యాంటీన్లో భోజనం పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమని సూచించారు.