KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఇవాళ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఖండించారు. దశాబ్దాల పాటు బిల్లును అమలు చేయలేక ఇప్పుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 33% రిజర్వేషన్ చట్టం ఆమోదం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. జనగణన, డిలిమిటేషన్ అనంతరం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు.