భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో ఇద్దరు సైనికులు సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయపడ్డారు. ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికుల్లో ఒకరు 25 ఏళ్ల చిన్నరాజ్ అని తెలుస్తోంది.