ASR: ఓటరు జాబితాలో పెండింగ్లో ఉన్న ఎలెక్టోరల్ మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా SIRను వేగవంతం చేయాలని సూచించారు.