ADB: ఇటీవల కురిసిన వర్షానికి పలువురి ఇల్లు కూలిపోవడంతో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ హామీ ఇచ్చారు. మంగళవారం నార్నూర్ మండలం పుసిగూడలో పర్యటించారు. బాధితుల ఇళ్లను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు.