ATP: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాప్తాడు పరిధిలో సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పించారు.