KRNL: జనగణన-2027 దేశ అభివృద్ధికి కీలకమని ఇవాళ ఆదోని మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ తెలిపారు. ప్రజలు నిజమైన వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాలని కోరారు. జనగణన రెండు దశల్లో నిర్వహించి ఇంటింటికి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.