సత్యసాయి: అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పల్లె రఘునాథ్ రెడ్డి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.