NTR: కాకినాడ రూరల్కు చెందిన సూర్య నారాయణమూర్తి, వారి కుటుంబ సభ్యులు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అన్నదాన పథకానికి రూ.1,01,116 డీడీని విరాళంగా ఇచ్చారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు నిరంతర అన్నప్రసాద వితరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించారు.