అన్నమయ్య: రాయచోటి పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న పూజారి వీరేంద్రకు ప్రభుత్వం తరపున రూ.3,06,500 విలువైన LOC పత్రాన్ని మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం అందజేశారు. వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న పూజారి కుటుంబం అభ్యర్థన మేరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించి ఈ సహాయం అందించారు. వీరేంద్ర కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.