NTR: విజయవాడలో సంచలనం రేపిన ఉగ్ర లింకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందికి రిమాండ్ను మే 4 వరకు పొడిగించారు. అదే కేసులో సంబంధం ఉన్న మైనర్కు సంబంధించిన కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ విజయవాడలోని సీజేఎం కోర్టు వెల్లడించింది. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.