VZM: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె. పట్టాభిరామ్ రాజాం మున్సిపాలిటీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో శుభ్రత నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజాం డంపింగ్ యార్డులో రూ 1.62కోట్ల వ్యయంతో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.