ATP: జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్లతో విస్తృత నిఘా చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జనసాంద్రత గల ప్రాంతాలు, పట్టణ కేంద్రాలు, సున్నితమైన ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తిస్తూ నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.