BPT: బాపట్లలో రోడ్డు భద్రతా నిబంధనలపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. డీటీసీ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలన్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అధికారులు పరిశీలించారు.