అన్నమయ్య: పీలేరులో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ఆదివారం భారీ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీనాధపురం, రాజీవ్ నగర్ కాలనీల్లో వేకువజామున జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 450 ఇళ్లు, 1200 మంది, 214 వాహనాలను పరిశీలించారు. పత్రాలు లేని 64 బైకులు, 5 ఆటోలు, ఒక కారుపై చర్యలు తీసుకున్నారు. 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.