కడప: రాజుపాలెం మండలం వెల్లాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంజీవరాయ స్వామి, చెన్నకేశవ స్వామి, భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రతిరోజు వివిధ అలంకరణలతో స్వామి వారి ఊరేగింపు చేయనున్నారు. ఇక్కడికి, శ్రీరామచంద్రుడు సీతమ్మతో అరణ్యవాసంలో భాగంగా వచ్చినట్లు ప్రతీతి.