KRNL: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేల ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ఏదైనా పని కోసం బయటికి వస్తే ఉదయం 10 గంటల్లోగా ముగించుకొని వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి రావాలని సూచించారు.