AKP: నర్సీపట్నం ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాల అధ్యాపక సిబ్బంది కాలేజీలో నూతన అడ్మిషన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. శనివారం మున్సిపాలిటీ బీసీ కాలనీలో నూతన విద్యార్థినీలకు అడ్మిషన్లపై అవగాహన కల్పించారు. తమ కళాశాలలో సాధించిన ఉత్తీర్ణత శాతం వివరించారు. కాలేజీలో ఉన్న సౌకర్యాలను పేర్కొంటూ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు.