ఏలూరు పడమర వీధిలో ఆదివారం ప్రజల సౌకర్యార్థం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రీజినల్ జోనల్ ఆర్టీసీ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం పలువురికి మజ్జిగను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజా సేవలో జనసేన పార్టీ ముందుంటుందని జనసైనికులను అభినందించారు.