శ్రీకాకుళం: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణ చర్యలు మరింత బలోపేతం కావాలని పోలీసులకు సూచించారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వారిని పట్టుకొని కోర్టులో హాజరుపరచాలన్నారు.