AKP: ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. పెదరామభద్రపురంలో సోమవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి పీఎండీఎస్ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలను పూతదశలో కలయదున్నితే భూమి సారవంతం అవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు.