PLD: కోటప్పకొండలో జూన్ 1 నుంచి 5 వరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కరపత్రాలను నేతలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగ సమస్యలపై యువత పోరాడాలని రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. యువత హక్కులు, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో మేధావులతో లోతైన చర్చలు ఉంటాయన్నారు. యువకులు భారీగా తరలిరావాలని కోరారు.