లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో RR 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు జైస్వాల్ (22), సూర్యవంశీ (8) విఫలం కాగా, జురెల్ డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పరాగ్ (20), హెట్మెయిర్(22), జడేజా(43*) ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు సాధించలేకపోయారు. LSG బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.