వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఆసీస్.. రెండో సెషన్లో పుంజుకుంది. దీంతో టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వెబ్స్టర్ (55), కారె (22) ఉన్నారు.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పలువురు నెటిజన్లు ‘అరెస్ట్ కోహ్లీ’ అనే హ్యాష్ట్యాగ్ను ‘X’లో ట్రెండ్ చేస్తున్నారు. తొక్కిసలాటలో 11 మంది మరణిస్తే, కోహ్లీ తన కుటుంబంతో లండన్కు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కప్ మీద ఉన్న ప్రేమ ఫ్యాన్స్ పట్ల లేదని మండిపడుతున్నారు. మరోవైపు, ‘వి స్టాండ్ విత్ కోహ్లీ’ అంటూ పలువురు అతడికి మద్దతుగా నిలు...
NLG: నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో 47వ TG రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం 2వ రోజు వివిధ జిల్లాల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. రెండో రోజు బాలికల విభాగం నుంచి 12మ్యాచులు, బాలుర విభాగం నుంచి 12మ్యాచ్లు నిర్వహించినట్లు TG రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు.
ప్రకాశం: సీఎస్ పురంలో మండలం కాపు నాయుడ్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలను గురువారం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల సెక్రటరీ& కరస్పాండెంట్ కదిరి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టెంకాయ కొట్టి ఎడ్ల పందాలను ప్రారంభించారు.
IPL కప్ను ముద్దాడాలన్న RCB 18 ఏళ్ల కల నెరవేరింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్తో జరిగిన ఫైనల్లో బెంగళూరు సంచలన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. RCB బౌలర్ల ధాటికి కుప్పకూలింది. దీంతో IPL చరిత్రలో తొలిసారి RCB టైటిల్ గెలిచింది.
IPL 2025 ఫైనల్లో RCBకి బిగ్ షాక్ తగిలింది. 10.5 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్ (16), మయాంక్ అగర్వాల్ (24), రజత్ పటీదార్ (26) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో కోహ్లీ (28*), లివింగ్స్టోన్ (1*) ఉన్నారు. దీంతో 11 ఓవర్లకు RCB స్కోర్ 97/3గా ఉంది.
IPL 2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు RCB, పంజాబ్ సిద్ధమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. పవర్ ప్లేలో కోహ్లీ ఔట్ కాకపోతే 250 పరుగుల లక్ష్యాన్నైనా అతడు చేజ్ చేసేస్తాడని హెచ్చరించాడు.
IPL 2025లో భాగంగా RCB, పంజాబ్ మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పంజాబ్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్-2 వర్షం కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది.
IPL క్వాలిఫయర్-2లో MIపై PBKS గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ను రాజమౌళి మెచ్చుకున్నారు. గతంలో DC, KKRలను ఫైనల్కు తీసుకెళ్లినా.. అవి అతడిని వదిలేశాయన్నారు. ఓవైపు PBKSను ఫైనల్కు చేర్చిన శ్రేయస్, మరోవైపు RCB తరపున పరుగుల వరద పారిస్తున్న కోహ్లి ట్రోఫీ గెలిచేందుకు అర్హులన్నారు. ఫైనల్లో ఎవరు ఓడినా హార్ట్ బ్రేకింగ్ అవుతుందని జక్కన్న ‘X’లో పోస్ట్ చేశారు.
PBKSతో జరిగిన క్వాలిఫైర్-2 మ్యాచ్లో MI ఓటమిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘ముంబై జట్టులో బుమ్రా, సూర్య, రోహిత్, హార్దిక్, శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ గెలువలేకపోయారు. చాలా వరకు T20 జట్లలో ఇలాంటి మ్యాచ్ విన్నర్లు ఉండరు. దీనిపై MI లోతుగా పరిశీలిస్తుంది’ అని పేర్కొన్నాడు.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి అవమానం జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నెం. 18ని మరొకరికి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత- A జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించాడు. దీంతో విరాట్ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లేనని BCCIని టార్గెట్ చేస్తున్నారు.
IPLలో GT ఆటగాడు సాయి సుదర్శన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్లో 750 పరుగులకు పైగా సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో సుదర్శన్ మొత్తం 759 పరుగులు చేశాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ లిస్ట్లో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ(973) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత గిల్(890), బట్లర్(863), డేవిడ్ వార్నర్(848) ఉన్నారు.
TG: సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ దాబాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి, ఓపియం స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు కాంస్యం దక్కింది. పురుషుల 20 కి.మీ నడకలో సెర్విన్ సెబాస్టియన్ (1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లు) కాంస్యం సాధించాడు. చైనాకు చెందిన వాంగ్ జావోజావో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు) స్వర్ణ పతకం అందుకున్నాడు. జపాన్కు చెందిన కెంటో యోషికావా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు.