IND vs SA టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ముత్తుసామి అద్భుత ప్రదర్శన చేశాడు. 2019లో అరంగేట్రం చేసిన తర్వాత దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత తొలి టెస్ట్ సెంచరీ (109) చేశాడు. అలాగే ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు దిగి సెంచరీ చేసిన SA ప్లేయర్గా నిలిచాడు. గతంలో 2019లో డికాక్ శతకం బాదాడు. అలాగే భారత్, పాక్, బంగ్లాలో 50+ స్కోర్లు చేసిన నాలుగో SA ఆటగాడిగానూ ఘనత సాధించాడు.
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఆమె తండ్రి గుండెపోటుకు గురవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇవాళ జరగాల్సిన వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే వివాహం ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ దక్షిణాఫ్రికా ఆధిపత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో 247/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 6 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9/0 స్కోరుతో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు.
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 489 పరుగులకు SA ఆలౌటైంది. ముత్తుసామి(109), యాన్సెన్ (93) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా, బుమ్రా, సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.
టీమిండియా అంధుల మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది భారత జట్టుకు మహిళా విభాగంలో తొలి ప్రపంచ కప్ కావడం విశేషం.
గౌహతి టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. 247/6 స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా.. లంచ్ బ్రేక్ సమయానికి 428/7 చేసింది. క్రీజులో ముత్తుస్వామి(107), యాన్సెన్(51) పాతుకుపోయారు. ఈ రోజు ఆటలో వికెట్లు తీసేందుకు IND చెమటోడ్చినా ఫలితం దక్కట్లేదు. ఇలాగే కొనసాగితే మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరీస్లో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలో ఉంది.
గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా బ్యాటర్ ముత్తుస్వామి(101*) సెంచరీ చేశాడు. ఇది అతనికి తొలి సెంచరీ కాగా.. ప్రొటీస్ 7 వికెట్లు కోల్పోయి 418 రన్స్ చేసింది. మరో బ్యాటర్ యాన్సెన్(49*) హఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ జోడీ ఇప్పటికే 85 బంతుల్లో 84 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పగా.. బవుమా సేన భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
ఇంగ్లండ్ యువ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రేయసి ఇసాబెల్లా గ్రేస్ సైమండ్స్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో తొలిసారిగా కలిశారు. థియేటర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న ఇసాబెల్లా కొన్నాళ్లుగా సామ్తో పాటు మ్యాచులకు హాజరవుతూ కనిపించింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సామ్ ఇన్స్టాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్రేలియా ఓపెన్ 2025 విజేతగా నిలిచాడు. యూషీ తనకా(జపాన్)పై మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 21-15, 21-11తో విజయం సాధించాడు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న మూడో భారత బ్యాడ్మింటన్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఇండియా ఓపెన్-2022, కెనడా ఓపెన్-2023 తర్వాత అతనికిది మూడో సూపర్ 500 టైటిల్.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్పై గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా భారీ మొత్తంలో నష్టపోయింది. మ్యాచ్ 2 రోజుల్లోనే ముగియడంతో 3, 4 రోజుల కోసం ఉంచిన టికెట్ల ఆదాయం కోల్పోయింది. ఈ క్రమంలో ఆసీస్ $3 మిలియన్లు(₹17.35Cr) నష్టపోయినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా తొలి 2 రోజుల్లో ఆట చూసేందుకు లక్ష మందికిపైగా హాజరయ్యారు.
సౌతాఫ్రికాతో గౌహతి టెస్టు రెండో రోజు ఆటలో ఎట్టేకేలకు టీమిండియా ఓ వికెట్ తీసింది. తొలి సెషన్లో సౌతాఫ్రికా వికెట్ పడకుండా రాణించి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఈ క్రమంలో రెండో సెషన్లో వెరెయిన్(45)ను జడేజా పెవిలియన్ చేర్చారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుస్వామి(68), యాన్సెన్(1) ఉన్నారు. సౌతాఫ్రికా స్కోర్ 335/7.
గౌహతి టెస్టు రెండో రోజు ఆటను 247/6 స్కోర్తో ప్రారంభించిన SA బ్యాటర్లు ముత్తుస్వామి(56), వెరెయిన్(38) క్రీజులో నిలదొక్కుకున్నారు. దీంతో టీ బ్రేక్ సమయానికి ప్రొటీస్ 316 రన్స్ చేసింది. రెండో రోజు దాదాపు 30 ఓవర్లు వేసిన IND వికెట్ కోసం చెమటోడుస్తోంది. ఇలాగే కొనసాగితే SA భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తొలి టెస్ట్ ఓడిన INDకి సిరీస్లో ఇది డూ ఆర్ డై టెస్ట్.
బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ తైజుల్ ఇస్లాం భారీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(249) తీసిన ప్లేయర్గా షకిబ్ అల్ హసన్(246)ను అధిగమించాడు. 209 వికెట్లతో మెహిదీ మిరాజ్ 3వ స్థానంలో ఉన్నాడు. కాగా ఐర్లాండ్తో జరుగుతున్న టెస్టులో తైజుల్ మరో వికెట్ తీస్తే.. బంగ్లా తరఫున 250 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక బౌలర్గా నిలుస్తాడు.
దేశ విభజన సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన మిల్ఖా సింగ్.. పేదరికం, ఆకలి వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. సైన్యంలో చేరిన తర్వాతే ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం పట్టుదలతో సాధన చేసి ‘ఫ్లయింగ్ సిఖ్’గా పేరుగాంచారు. 1960 ఒలింపిక్స్లో పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయినా, భారతదేశ క్రీడా చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచారు.