IPL రిటెన్షన్ గడువు నిన్నటితో ముగియడంతో ఆయా ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్టులు విడుదల చేశాయి. అనంతరం ఏ టీమ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందంటే.. ముంబై తన ఖాతాలో ₹2.75Cr, చెన్నై ₹43.4Cr, బెంగళూరు ₹16.4Cr, హైదరాబాద్ ₹25.5Cr, ఢిల్లీ ₹21.8Cr, గుజరాత్ ₹12.9Cr, కోల్కతాCr, లక్నో ₹22.95Cr, పంజాబ్ ₹11.5Cr, రాజస్థాన్ ₹16.05Cr కలిగి ఉంది.
కోల్కతా టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. SA బ్యాటర్లలో కెప్టెన్ బవుమా(55*) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ టెస్ట్లో విజయం కోసం భారత్ టార్గెట్ 124 రన్స్.
వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. నిన్న తన కొడుకు అహాన్ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో అర్థంకావట్లేదు. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం’ అంటూ ఇన్స్టాలో రితిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ హెల్త్పై BCCI అప్డేట్ ఇచ్చింది. మెడ నొప్పితో బాధపడుతున్న అతను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ క్రమంలో అతను తొలి టెస్టుకు దూరమైనట్లు ప్రకటించింది.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ హెల్త్పై BCCI అప్డేట్ ఇచ్చింది. మెడ నొప్పితో బాధపడుతున్న అతను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ క్రమంలో అతను తొలి టెస్టుకు దూరమైనట్లు ప్రకటించింది.
కోల్కతా టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 93/7 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ముగించిన సౌతాఫ్రికా 63 రన్స్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బవుమా(29*), బాష్(1) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159, భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తొలి టెస్ట్ ఈ రోజే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టీ20 టోర్నీలో ఆసక్తికర పోరుకు వేళైంది. జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత్-ఎ జట్టు ఇవాళ పాకిస్తాన్ షహీన్స్ జట్టుతో తలపడనుంది. కళ్లన్నీ వైభవ్ సూర్యవంశీ పైనే. భారత్ తొలి మ్యాచ్లో అతడు UAEపై చెలరేగిపోయాడు. సిక్స్లో మోత మోగించిన వైభవ్.. 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయరు.
కోల్కతా టెస్టులో మెడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ICUలో చేరినట్లుగా తెలుస్తోంది. డగౌట్కి చేరిన తర్వాత నొప్పి తీవ్రంగా ఉండటంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెడకు సర్వైకల్ కాలర్తో స్ట్రెచర్పై తీసుకెళ్లడంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.