సౌతాఫ్రికాతో జరిగిన మహిళల ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం 98 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గ్రూప్ టాపర్గా లీగ్ దశను ముగించింది. 7 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ అలానా కింగ్కు ‘MOM’ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో ‘రో-కో’ జోడీ 168 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అరుదైన ఘనతలు సాధించింది. వన్డేల్లో 100కు పైగా భాగస్వామ్యాలు నమోదు చేయడం వారికి ఇది 19వ సారి. దీంతో సచిన్-గంగూలీ(26), దిల్షాన్-సంగక్కర (20) తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే, వన్డేల్లో అత్యధిక 150+ భాగస్వామ్యాలు(12) నమోదు చేసిన సచిన్-ద్రవిడ్ జోడీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
మహిళల వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సంచలనం సృష్టించింది. ఆమె కేవలం 7 ఓవర్లలో 29 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. WWC చరిత్రలో ఒకే మ్యాచ్లో 7 వికెట్ల తీసిన తొలి బౌలర్గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్లో తలపడనుంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సంచలనం సృష్టించింది. ఆమె కేవలం 7 ఓవర్లలో 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. WWC చరిత్రలో ఒకే మ్యాచ్లో 7 వికెట్ల తీసిన తొలి బౌలర్గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్లో తలపడనుంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సంచలనం సృష్టించింది. ఆమె కేవలం 7 ఓవర్లలో 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. WWC చరిత్రలో ఒకే మ్యాచ్లో 7 వికెట్ల తీసిన తొలి బౌలర్గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్లో తలపడనుంది.
AUSతో మ్యాచ్ తర్వాత రోహిత్, కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఆసీస్ గడ్డపై ఆడుతానో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఆడటం మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తాను’ అని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ స్పందిస్తూ.. ‘రోహిత్తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. మేము ఇద్దరం ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాం’ అని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికీ, రెండో వన్డేలో 73 పరుగులతో రాణించాడు. ఇక చివరి వన్డేలో సూపర్ సెంచరీ(121*) సాధించి జట్టును గెలిపించాడు. దీంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది.
రిటైర్మెంట్పై వస్తున్న విమర్శలకు హిట్మ్యాన్ రోహిత్ (121*), కింగ్ కోహ్లీ (74*) ధీటైన జవాబిచ్చారు. ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో ఈ జోడీ అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఇన్నింగ్స్తో తమలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి.. విమర్శకుల నోళ్లను మూయించారు. అలాగే, 2027 WC రేస్లో తాము ఉన్నామనే స్పష్టమైన సందేశాన్ని పంపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ(121*), కింగ్ కోహ్లీ (74*) దుమ్మురేపారు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 168 పరుగులు జోడించి, జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు బౌలింగ్లో హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కేవలం 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సూపర్ సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మకు ఇది 33వ సెంచరీ కావడం విశేషం.
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (14,234 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్తో జరుగుతున్న మ్యాచ్లో 29 పరుగులు పూర్తి చేయడం ద్వారా అతడు ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యంత వేగంగా(76 ఇన్నింగ్స్లలో) 3000 పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ స్టీవ్ స్మిత్ (79 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్లలో వరుసగా డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ‘కింగ్ కోహ్లీ’ ఈ మ్యాచ్లో తన బ్యాట్తోనే జవాబిచ్చాడు. కేవలం 56 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్లలో వరుసగా డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ‘కింగ్ కోహ్లీ’ ఈ మ్యాచ్లో తన బ్యాట్తోనే జవాబిచ్చాడు. కేవలం 56 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ ఓ క్యాచ్ అందుకోవడం ద్వారా వన్డేల్లో 100 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరుఫున ఈ ఘనత సాధించిన 6వ ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ(163), అజారుద్దీన్(156), సచిన్(140), ద్రావిడ్(124), రైనా(102) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.