WPL-2026 మెగా వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ హెన్రీని రూ.1.30 కోట్లకు ఢిల్లీ తీసుకుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ నడిన్ డ్ క్లెర్క్ రూ.65 లక్షలకు RCBలోకి తీసుకున్నారు. కిరణ్ నవ్గిరే కోసం RTM కార్డు ఉపయోగించి రూ.60 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. భారత ప్లేయర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
WPL-2026 మెగా వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి కోసం ఢిల్లీ, యూపీ పోటీపడ్డాయి. చివరకు రూ.1.30 కోట్లతో ఢిల్లీ దక్కించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ను యూపీ వారియర్స్ రూ.1.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది. భారతి ఫుల్మాలిని RTM కార్డు ఉపయోగించి రూ.70 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.
WPL-2026 మెగా వేలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రపంచకప్ క్వీన్ దీప్తి శర్మ కోసం హైడ్రామా నడిచింది. ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ పోటీ పడగా.. ‘RTM’ కార్డ్ ఉపయోగించి యూపీ రూ.3.20 కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది. ఈ ధరతో WPLలో ఇప్పటివరకు రెండో అత్యధిక ధర కలిగిన ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మంధానను RCB రూ.3.4 కోట్లకు దక్కించుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9న ప్రారంభంకానుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో ఈ మ్యాచ్లు జరగనున్నాయని వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
WPL-2026 మెగా వేలంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.గత మూడు సీజన్లలోనూ ఆమె ముంబైకే ఆడింది. భారత పేసర్ రేణుకా సింగ్ను రూ.60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీ బేస్ ధర రూ.50 లక్షలు కాగా ఆమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. అయితే, సౌతాఫ్రికా అలవోకగా 489 పరుగులు చేసిన చోట టీమిండియా అతి కష్టం మీద 201 పరుగులు చేసింది. గౌహతి టెస్టులో సఫారీ ప్లేయర్లు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. కానీ, మన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో టెస్టు క్రికెట్లో భాగస్వామ్యాలు ఎంత ముఖ్యమో ఈ టెస్ట్ ఫలితాలు చెప్తున్నాయి.
WPL-2026 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ భారీ ధరకు అమ్ముడుపోయింది. యూపీ వారియర్స్ ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించి రూ.3.20 కోట్లకు బిడ్ వేసింది. ఢిల్లీ అంత ధరకు తీసుకోవడానికి నిరాకరించడంతో యూపీ రూ.3.20 కోట్లతో తిరిగి దీప్తి శర్మను దక్కించుకుంది. అలాగే, న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ను గుజరాత్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలం ప్రారంభమైంది. WPL తొలి మెగా ఆక్షన్ను మల్లికా సాగర్ నిర్వహించనున్నారు. గతంలోనూ ఈమె WPL వేలానికి ఆక్షనీర్గా చేశారు. కాగా, ఈ వేలంలో మొత్తం 277 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా దీప్తీశర్మ, లారా వోల్వార్డ్, రేణుకా సింగ్, సోఫీ డివైన్, సోఫీ ఎక్లెస్టోన్, అలీసా హేలీ కోసం పోటీ ఉండనుంది.
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వివాహం వాయిదా పడింది. అయితే, మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ సైతం ఛాతీలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్యతో అతడు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు.. ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల ఇలా జరిగిందని తేల్చారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు.
టీమిండియా సాగిలపడితే చూడాలని అనుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. కోచ్ తన వ్యాఖ్యలను పరిశీలించుకోవాలని అన్నాడు. కోచ్తో సరిగా మాట్లాడే అవకాశమే రాలేదని చెప్పాడు. తన వ్యాఖ్యలపై ఏదో ఒక సందర్భంలో అతడికి మాట్లాడే అవకాశం లభిస్తుందని వెల్లడించాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్టులో రికార్డు స్థాయిలో తొలి రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ పిచ్కు ICC ‘వెరీ గుడ్’ అని రేటింగ్ ఇచ్చింది. ఇదే అత్యుత్తమ రేటింగ్ కావడం గమనార్హం.
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్బాష్ లీగ్కు దూరమైంది. ఈ విషయాన్ని బ్రిస్బేన్ హీట్ జట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి మద్దతుగా ఉండేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ మ.3:30 గంటలకు జరిగే ఈ వేలంలో మొత్తం 277 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల వరల్డ్ కప్లో అదరగొట్టిన దీప్తీశర్మ, రేణుకా సింగ్, సోఫీ డివైన్, సోఫీ ఎక్లెస్టోన్, అలీసా హేలీ, అమెలియా కెర్, మెగ్ లానింగ్, లారా వోల్వార్డ్ కోసం తీవ్ర పోటీ ఉండనుంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్వాష్ అయినప్పటికీ కోచ్ గంభీర్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని BCCI వర్గాలు తెలిపారు. T20 వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో ఇప్పట్లో ఎలాంటి మార్పులు ఉండవని, గంభీర్ పదవీ కాలం 2027 ప్రపంచకప్ వరకు ఉందని పేర్కొన్నాయి. వైట్వాష్, భవిష్యత్ ప్రణాళికలపై BCCI టీమ్ సెలెక్టర్లతో చర్చించనుందని వెల్లడించాయి.