రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే ఉత్కంఠగా మారుతోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 37 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 253/3గా ఉంది. బ్రెవిస్ (29), మాథ్యూ బ్రిట్జ్కే (46) పరుగులతో ఉన్నారు.
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్ (79*) మాథ్యూ (13*) ఉన్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ చెరో వికెట్ తీశారు.
టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మోహిత్ 2013లో అంతర్జాతీయ అరంగేంట్రం చేశాడు. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి భారత జెర్సీ ధరించడం, IPLలో ఆడటం వరకు తనకు సపోర్ట్గా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ జెర్సీని ఆవిష్కరించాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (C), గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (102) సూపర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేశాడు. అలాగే, వన్డేల్లో అత్యధికంగా 13 వేర్వేరు సందర్భాల్లో వరుసగా మూడు, అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించాడు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (66*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 42 ఓవర్లకు 295 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్ (29*), జడేజా (2*) ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కాగా, తొలి వన్డేలో సైతం కింగ్ కోహ్లీ (135) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ నుంచి వరుసగా రెండో సెంచరీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో రుతురాజ్ మొదటిసారి సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) నిరాశపర్చినా.. విరాట్ కోహ్లీ (64*), రుతురాజ్ గైక్వాడ్(87*) అర్ధశతకాలు పూర్తి చేసి శతకాల దిశగా దూసుకెళ్తున్నారు. 30 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ (51*), విరాట్ కోహ్లీ (50*) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో 24.3 ఓవర్లకు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), జైస్వాల్ (22) రన్స్ చేశారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నాంద్రే బర్గర్ బౌలింగ్లో డికాక్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (14) వెనుదిరిగాడు. యాన్సన్ బౌలింగ్లో బాష్కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 66 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (13*), రుతురాజ్ (4*) పరుగులతో ఉన్నారు.
TG: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ, సీఎం రేవంత్ ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాట్లను మెస్సీ ‘గోట్’ బృందం పరిశీలించింది. మెస్సీ జెర్సీ నెం.10ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ బృందంలో ‘గోట్ ‘చీఫ్ ప్యాట్రన్ పార్వతిరెడ్డి, చీఫ్ ప్రమోటర్ శతద్రు, మెస్సీ సలహాదారు క్రిస్టోఫర్ ఫ్లానెరీ, పర్సనల్ మేనేజర్ పాబ్లో నెగ్రే ఉన్నారు.
టీమిండియాకు టాస్ అస్సలు కలిసిరావట్లేదు. వన్డేల్లో వరుసగా 20వ సారి టాస్ ఓడిపోయి మనోళ్లు చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే.. రోహిత్, విరాట్, జైశ్వాల్, గైక్వాడ్, రాహుల్, జడేజా, సుందర్, కుల్దీప్, అర్ష్దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ జట్టులో ఉన్నారు. టాస్ పోయినా మ్యాచ్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.