ఆసియా కప్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో యూఏఈ ఓటమిపై కోచ్ రాజ్పుత్ స్పందించాడు. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ఆయన ప్రశంసించాడు. యూఏఈ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్లాస్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. ఇది వారికి ఒక కొత్త అనుభవమని పేర్కొన్నాడు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపాడు.
ఆస్ట్రేలియా-A జట్టు, భారత్-A జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. భారత్ పర్యటనలో భాగంగా మొదటి టెస్టు సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు, రెండో టెస్టు సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు లక్నో వేదికగా జరుగుతాయి. అలాగే, 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఈనెల 30న, రెండో వన్డే అక్టోబర్ 3న, మూడో వన్డే అక్టోబర్ 5న జరుగుతాయి. ఈ టోర్నీ కోసం భారత-A టెస్టు జట్టును ఇప్పటికే ప్రకటించారు.
సెర్బియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులకు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ మద్దతు పలికారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే జకోవిచ్ గ్రీస్కు మకాం మారుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రీక్ గోల్డెన్ వీసాకు అతడు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అతడు ఉన్నట్టుండి ఆసుపత్రి వద్ద కన్పించడంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే హిట్మ్యాన్ తాజా పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రైనింగ్ సెషన్కు సంబంధించిన ఫొటోను రోహిత్ షేర్ చేశాడు. దీంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టినట్లు అయింది.
యూఏఈతో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సందర్భంగా జట్టు ట్రైనర్ ఆడ్రియన్కు కృతజ్ఞతలు తెలిపాడు. తన బౌలింగ్తోపాటు ఫిట్నెస్పై ఆడ్రియన్తో కలిసి పనిచేసినట్లు చెప్పాడు. అది బాగా కలిసొచ్చిందని.. తొలి మ్యాచ్లో అంతా అనుకున్నట్లుగానే సాగిందని పేర్కొన్నాడు.
దులీప్ ట్రోఫీలో తుది సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం బెంగళూరులో సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఇవాళ్టి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెంట్రల్కు రజత్ పాటీదార్ నాయకత్వం వహిస్తుండగా.. సౌత్ను మహ్మద్ అజహరుద్దీన్ నడిపించనున్నాడు. సౌత్ జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఐదుగురు ఉన్నారు.
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో ముగ్గురు భారత అమ్మాయిలు సెమీస్కు దూసుకెళ్లారు. దీంతో 3 మెడల్స్ ఖరారయ్యాయి. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఒల్టినోయ్ సొటింబొవ(UZB)పై నుపుర్ షెరాన్ 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్కు చేరింది. అలాగే మమజొనోవా(UZB)పై జేస్మీన్ 5-0తో.. ఎమిలియా(POL)పై పూజ 3-2తో గెలిచి సెమీస్కు అర్హత సాధించారు.
టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘అందుకు కారణం అతను తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు టోన్ సెట్ చేస్తాడు. మేం 200 పరుగులు చేయాల్సి ఉన్నా.. 50 పరుగులు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నా అతని అప్రోచ్ మాత్రం మారదు. పాక్తో మ్యాచ్ కోసం మా టీమ్ ఎదురు చూస్తుంది’ అని అన్నాడు.
ఆసియా కప్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. 58 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలో ఛేదించి, టీ20లలో వేగవంతమైన విజయాన్ని నమోదు చేసింది. మిగిలిన ఓవర్ల పరంగా ఇది భారత్ అత్యంత వేగవంతమైన విజయం. ఈ రికార్డును అంతకుముందు 2021లో స్కాట్లాండ్పై (13.3 ఓవర్లు మిగిలి ఉండగా గెలిచింది) సాధించిన విజయం ఉండేది.
ఆసియా కప్లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. వారి ధాటికి UAE జట్టు కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబే 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. అలాగే, బుమ్రా, అక్షర్ పటేల్, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. UAE బ్యాటర్లలో అలీషన్ (22), ముహమ్మద్ వసీం (19) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసియా కప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో యూఏఈ జట్టు 11 ఓవర్లలో కేవలం 51 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. ఇక బుమ్రా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
ఆసియా కప్లో భాగంగా గ్రూప్-Aలో తొలి మ్యాచ్ భారత్, యూఏఈ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియాతో జరిగిన ఏకైక T20 మ్యాచ్లో యూఏఈ ఓడిపోయింది. దీంతో టోర్నీలో ఫేవరెట్గా ఉన్న భారత్కు యూఏఈ ఏ మేరకు పోటీ ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, గిల్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన వీరిద్దరు U-14 నుంచే ఓపెనర్లుగా కలిసి ఆడుతున్నారు. అభిషేక్ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచితే, మరోవైపు గిల్ మాత్రం ప్రశాంతంగా.. క్లాసికల్ స్ట్రోక్స్తో పరుగులు సాధిస్తాడు. వీళ్ళిద్దరూ యువరాజ్ దగ్గర బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.
టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రోహిత్ భయ్యా బ్యాటింగ్ చేసే తీరు నిజంగా చాలా ప్రత్యేకమైనది. బంతి ఎంత వేగంగా వచ్చినా, బౌలర్ ఎంత స్పీడ్తో బౌలింగ్ చేసినా అది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపదు. చాలా సులువుగా షాట్లు కొట్టేస్తాడు’ అని రింకూ అన్నాడు.