హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 149 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.
టీమిండియా ఆసియా కప్ను కైవసం చేసుకోవడంలోనూ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఏడు మ్యాచుల్లో ఏకంగా 200 స్ట్రైక్రేట్తో 314 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించే అభిషేక్ టీమిండియాకు కీలక బ్యాటర్గా.. ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అభిషేక్ ఓ 6 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 60 నుంచి 80 పరుగులు చేసేస్తాడని బౌలర్లు బెంబేలెత్తుతున్నారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ 17వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా ఈ ‘షో’లో భాగంగా క్రికెట్కు సంబంధించి ఓ ప్రశ్న కంటెస్టెంట్కు ఎదురైంది. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో ఎవరి క్యాచ్ పట్టి.. ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు? అని రూ.7.50 లక్షల ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో రాణించిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో మిగిలిన మూడు మ్యాచుల్లో అభిషేక్.. 163 పరుగులు చేశాడు.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా టాస్ ఓడింది. దీనిపై స్టార్ పేసర్ బుమ్రా సరదాగా స్పందించాడు. మళ్లీ ఓడిపోయావా? అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను బుమ్రా ఆటపట్టించాడు. దీంతో సూర్య నవ్వుతూ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నట్లు చేతితో సైగ చేసి చూపించాడు.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా-Aతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ జురెల్ (127*) సెంచరీతో చెలరేగాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో ధ్రువ్ 132* పరుగులు సాధించాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 382-7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టీమిండియా ఇన్నింగ్స్లో 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. కాగా, ఐదు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత 17 ఏళ్లలో ఆస్ట్రేలియాలో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోలేదు.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో టీమిండియా ఇన్నింగ్స్లో 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ 52 రన్స్ చేసింది. కాగా 5 టీ20ల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత 17 ఏళ్లలో ఆస్ట్రేలియాలో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోలేదు.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. అయితే, భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. మైదానంలో పిచ్ ప్రాంతంలో మాత్రమే సిబ్బంది కవర్లు కప్పారు. అయితే, గ్రౌండ్లో డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉండటంతో వర్షం నిలిచిన కాసేపటికే మైదానాన్ని సిద్ధం చేసే ఛాన్స్ ఉంది. దీంతో వర్షం తగ్గుతుందేమో అని ప్రేక్షకులు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు.
మాజీ క్రికెటర్ పుజారా టీమిండియాకు చాలాకాలం కీలక బ్యాటర్గా ఉన్నాడు. టీ20ల్లో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయిన అతడు.. IPLలో KKR తరఫున ఆడాడు. అయితే, 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన IPL ప్రాక్టీస్ మ్యాచ్లో పుజారా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సౌతాఫ్రికాలోనే KKR యజమాని షారుఖ్ ఖాన్ అతడికి వైద్యం చేయించాడు. అనంతరం పూర్తిగా కోలుకున్న పుజారా ఐదు సీజన్ల పాటు IPLలో ఆడాడు.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా చివరి టీ20లో తలపడుతోంది. అయితే, స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం పడుతోంది. అక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను స్టేడియం అధికారులు అప్రమత్తం చేశారు. ప్రేక్షకులు బహిరంగ ప్రదేశాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ ఆగిపోయింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో 4.5 ఓవర్ల తర్వాత ఆటను నిలిపివేశారు. ఆట నిలిపి వేసే సమయానికి భారత్ స్కోర్ 52/0గా ఉంది. అభిషేక్ (23*), గిల్ (29*) పరుగులతో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో 5వ T20 మ్యాచ్లో టీమిండియా తిలక్కి బదులు రింకూ సింగ్తో బరిలోకి దిగింది. ఈ సిరీస్లో తిలక్(0, 29, 5) రాణించకపోవడంతోనే అతణ్ని మ్యాచ్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్కి ఇది కీలక మ్యాచ్. అలాగే రింకూకు కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రోహిత్, కోహ్లీ క్రికెట్ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘RO-KO కెరీర్ చివరి దశలో ఉంది. ఆట కంటే ఎవరూ గొప్ప కాదని తెలుసుకుని కొంత బాధ్యత తీసుకోవాలి. ఆటకు ఒకరి తర్వాత మరొకరు వస్తుంటారు, ఎవరి స్థానమూ శాశ్వతం కాదు’ అని తెలిపారు. జట్టు ప్రయోజనాల కోసం సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
పాకిస్థాన్తో 2వ వన్డేలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ సెంచరీ(123)తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. డీకాక్కి ఇది 20వ MOTM అవార్డ్ కాగా.. మరొక్కటి అందుకుంటే MS ధోనీ(21) రికార్డు సమం చేస్తాడు. అత్యధిక MOTMలు అందుకున్న వికెట్ కీపర్ల లిస్టులో కుమార సంగక్కర(29-SL), ఆడమ్ గిల్క్రిస్ట్(28-AUS) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.