2026 T20 వరల్డ్కప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై ఏ జట్టు అయినా గెలవాలంటే, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిని కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. బుమ్రా కంటే ముందు ఈ ఇద్దరినీ ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రత్యర్థి జట్లు నేర్చుకోవాలని సూచించాడు. వారిలో ఒకరు బ్యాట్తో, మరొకరు బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరని వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలనెలా తనకు భరణం, కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న రూ.4లక్షలు సరిపోవడం లేదని షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షమీకి, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని తెలిపింది.
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ కోసం మెగా వేలం ఈ నెలాఖరులో జరగనుంది. ఇప్పటికే ప్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. అయితే, యూపీ వారియర్స్ ఒక్క ప్లేయర్ను మాత్రమే అట్టిపెట్టుకుని, రూ.14.5 కోట్ల భారీ పర్స్ వాల్యూతో వేలంలోకి దిగనుంది. కాగా, GG-రూ.9cr, RCB-రూ.6.15cr, MI-రూ.5.75cr, DC-రూ.5.7cr పర్స్ వాల్యూను కలిగి ఉన్నాయి.
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని.. పాకిస్తాన్తో సిరీస్లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్ అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన రెండో వన్డేలో భారీ శతకం(123*) సాధించాడు. దీంతో వన్డే కెరీర్లో 22 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్గా అత్యధిక శతకాలు సాధించిన కుమార సంగక్కర(23) తరువాత స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న RCB జట్టు ప్రస్తుతం అమ్మకానికి ఉంది. 2026 మార్చి నాటికి ఆ జట్టుకు కొత్త ఓనర్స్ రానున్నారు. ఈ క్రమంలో RCB పేరు అదే కొనసాగిస్తారా? లేదా మారుస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా, 2008లో విజయ్ మాల్యా RCBకి ఆ పేరు పెట్టాడు. అయితే, ఒకవేళ పేరు మార్చితే ఏ పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక రెస్టారెంట్లో అయ్యర్తో ఓ అభిమాని ఫొటో తీసుకోగా, అందులో అయ్యర్ పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. శ్రేయస్ గాయం నుంచి ఇంత త్వరగా కోలుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ముగ్గురు మహారాష్ట్ర ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. ఈ సందర్భంగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వారికి రూ. 2.25 కోట్ల భారీ నగదు బహుమతిని అందజేశారు. అలాగే, క్రీడాకారిణులను శాలువాలతో సత్కరించి, వారి అద్భుత ప్రదర్శనను కొనియాడారు.
భారత్-‘A’తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా-‘A’ 221 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ 134 పరుగుల భారీ శతకంతో రాణించగా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 3 వికెట్లు తీయగా, ఆకాష్ దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో భారత్కు 34 పరుగుల ఆధిక్యం లభించింది.
T20ల్లో శుభ్మన్ గిల్ స్ట్రైక్రేట్పై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను చాలా నెమ్మదిగా ఆడుతున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గిల్కు మద్దతుగా నిలిచాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన పిచ్పై కూడా గిల్ పరుగులు చేశాడని పఠాన్ గుర్తుచేశాడు. టీ20ల్లో గిల్ను తప్పకుండా ఆడించాలని పఠాన్ వ్యాఖ్యానించాడు.
మహమ్మద్ షమీ రంజీల్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతను భారత్ జట్టులోకి తిరిగి రావడం కష్టమేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. షమీ ఖచ్చితంగా టీమిండియాలోకి తిరిగి వస్తాడని తెలిపాడు. సెలక్టర్లు అతడికి మరో అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఉత్తప్ప(28), చిప్లి(24), కార్తీక్(17) రాణించడంతో నిర్ణీత 6 ఓవర్లలో 86 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 3 ఓవర్లు ముగిసేసరికి 41/1 పరుగుల వద్ద ఉండగా, వర్షం అంతరాయం కలిగించింది. దీంతో D/L పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సౌతాఫ్రికా జాతీయ జట్టు ఈ నెల 14 నుంచి డిసెంబర్ 19 వరకు భారత్లో పర్యటించనుంది. షెడ్యూల్..★Tests: ఈ నెల 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్★ ODIs: ఈ నెల 30న తొలి వన్డే, డిసెంబర్ 3న రెండో వన్డే, 6న మూడో వన్డే★ T20s: డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో 5 టీ20 మ్యాచ్లు
వరల్డ్ కప్లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.
AP: వరల్డ్ కప్లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.
T20ల్లో బుమ్రా, అర్ష్దీప్ కలిసి ఆడితే భారత్కి విజయం పక్కా అని గణాంకాలు చెబుతున్నాయి. ఇద్దరూ కలిసి ఆడిన 12 మ్యాచుల్లోనూ టీమిండియానే గెలిచింది. అలాగే ఈ 12 మ్యాచుల్లో బుమ్రా 20, అర్ష్దీప్ 23 వికెట్లు పడగొట్టారు. దీంతో టెస్టుల్లో అశ్విన్-జడేజా మాదిరి టీ20ల్లో ఈ జోడీ రాణిస్తోందని.. కీలక మ్యాచుల్లో వీరిని తప్పక ఆడించాలని ఫ్యాన్స్ అంటున్నారు.