ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ మ.3:30 గంటలకు జరిగే ఈ వేలంలో మొత్తం 277 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల వరల్డ్ కప్లో అదరగొట్టిన దీప్తీశర్మ, రేణుకా సింగ్, సోఫీ డివైన్, సోఫీ ఎక్లెస్టోన్, అలీసా హేలీ, అమెలియా కెర్, మెగ్ లానింగ్, లారా వోల్వార్డ్ కోసం తీవ్ర పోటీ ఉండనుంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్వాష్ అయినప్పటికీ కోచ్ గంభీర్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని BCCI వర్గాలు తెలిపారు. T20 వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో ఇప్పట్లో ఎలాంటి మార్పులు ఉండవని, గంభీర్ పదవీ కాలం 2027 ప్రపంచకప్ వరకు ఉందని పేర్కొన్నాయి. వైట్వాష్, భవిష్యత్ ప్రణాళికలపై BCCI టీమ్ సెలెక్టర్లతో చర్చించనుందని వెల్లడించాయి.
టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తనను తప్పించాలన్న వాదనలపై గంభీర్ స్పందించాడు. ‘దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది BCCI. కొందరు NZ సిరీస్ ఓటమిపైనే మాట్లాడుతున్నారు కానీ నా కోచింగ్లోనే ENGలో యువ జట్టు రాణించింది. CT 2025, ఆసియా కప్ గెలిచాం. కోచ్గా తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినదే మళ్లీ చెప్తున్నా.. నేను కాదు, భారత క్రికెట్ ముఖ్యం’ అని అన్నాడు.
గౌహతి టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడన్ మార్క్రమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచులో అత్యధిక క్యాచులు పట్టిన ఫీల్డర్గా అవతరించాడు. గౌహతిలో 9 క్యాచులు పట్టి అజింక్య రహనే(8 vs SL 2015) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ లిస్టులో గ్రెగ్ చాపెల్, యజుర్వింద్ర సింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ హేడెన్, కేఎల్ రాహుల్ 7 క్యాచులతో మూడో స్థానంలో ఉన్నారు.
మహిళల అంధుల క్రికెట్ ప్రపంచకప్ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
భారత్కు అరుదైన అవకాశం దక్కింది. 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ ఖరారైంది. గ్లాస్గోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో ఢిల్లీ తర్వాత భారత్లో ఈ క్రీడలు జరగడం ఇది రెండోసారి. 2030 నాటికి ఈ గేమ్స్ మొదలై వందేళ్లు పూర్తవుతుండటం విశేషం. ఇందులో మొత్తం 15 – 17 క్రీడల్లో పోటీలు ఉంటాయని IOA తెలిపింది.
దేశవాళీ T20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-C గ్రూపులో భాగంగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. ఉర్విల్ 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. 12.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 183 పరుగుల చేసి విజయం సాధించింది.
దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్ట్లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో 25 ఏళ్ల తర్వాత భారత్పై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నెట్టింది. అయితే ఈ టెస్ట్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్, రిషబ్ పంత్ కెప్టెన్సీ, దక్షిణాఫ్రికాను తేలికగా తీసుకోవడం, గంభీర్ కోచింగ్ అని తెలిపారు.
హోమ్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు WTC పాయింట్స్ టేబుల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. గౌహతి టెస్ట్ ఓటమితో 4 నుంచి 5వ స్థానానికి దిగింది. పాయింట్స్ % కూడా 54.16 నుంచి 48.15కు పడిపోయింది. ఈ విజయంతో సౌతాఫ్రికా(75) 3 నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా(100) టాప్లో ఉండగా.. శ్రీలంక(66.67), పాకిస్థాన్(50) వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలాశ్ ముచ్చల్ను మంధాన ఇన్స్టాలో అన్ఫాలో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి రద్దయిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
★ భారత టెస్ట్ చరిత్రలోనే భారీ ఓటమి(408 రన్స్)★ గత 66 ఏళ్లలో 7 టెస్టుల వ్యవధిలో 5 ఓడటం ఇదే తొలిసారి★ 1996 తర్వాత హోమ్ సిరీస్లో ఒక్కరూ సెంచరీ చేయకపోవడం ఇదే ప్రథమం★ హోమ్ సిరీస్లో భారత్ ఒక్కసారీ 250 రన్స్ దాటకపోవడం ఇదే తొలిసారి★ 2000 తర్వాత స్వదేశంలో వైట్వాష్ అవడం ఇది మూడో సారి(SA, NZ, SA చేతిలో).. 13 నెలల వ్యవధిలో రెండో సారి.
స్వదేశంలో గతేడాది నూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్వాష్ అయిన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలో 2-0 క్లీన్ స్వీప్ అయింది. తాజా సిరీస్ తొలి టెస్ట్ను 30 రన్స్తో, రెండో మ్యాచ్ను 405 పరుగులతో కోల్పోయింది. కోల్కతాలో బౌలర్లు రాణించినా.. గౌహతిలో అందరూ చేతులెత్తేశారు. 2001 తర్వాత భారత్లో సఫారీలు టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయింది. గౌహతి టెస్ట్లో 408 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 27/2 స్కోర్తో ఐదో రోజు ఆట ప్రారంభించి 140 పరుగులకే ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి భారత్ 90/5 పరుగులు చేసింది. జట్టు విజయానికి ఇంకా 459 రన్స్ కావాల్సి ఉంది. సుదర్శన్(14*), జడేజా(23*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), కుల్దీప్ (5), జురెల్ (2), పంత్ (13) తేలిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు.
ప్రస్తుత నవంబర్ నెల భారత మహిళా క్రీడాకారిణులకు చాలా స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఈ నెల 2న క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అలాగే 23న అంధుల క్రికెట్ టీమ్ అరంగేట్ర T20 ప్రపంచకప్ విన్నర్గా నిలవగా.. 24న కబడ్డీ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఏడాది ఆరంభంలోనూ(ఫిబ్రవరి 2) భారత మహిళా క్రికెటర్లు U19 T20 వరల్డ్ కప్ నెగ్గారు.