2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ పేసర్ లసిత్ మలింగను తమ జట్టుకు కన్సల్టెంట్ పేస్ బౌలింగ్ కోచ్గా నియమించింది. భారత్తో పాటు సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో మలింగ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని SLC భావిస్తోంది. కాగా 2014 WC విజేతగా నిలిచిన అనంతరం.. గత 4 ఎడిషన్లలో లంక నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది.
శ్రీలంకతో 5వ T20లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 T20ల సిరీస్లో లంక క్లీన్ స్వీప్ అయ్యింది. 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు తరఫున హాసిని(65), ఇమేషా(50) అర్ధసెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అరుంధతి రెడ్డి (27*) అమన్జ్యోత్ (21), హర్లీన్ (13), కమలినీ (12) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు తీశారు.
శ్రీలంక మహిళలతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా తడబడుతోంది. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ (28*), దీప్తిశర్మ(6*) క్రీజులో ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్న షెఫాలీ వర్మ(5) ఈ మ్యాచ్లో నిరాశపర్చింది. కమలినీ(12) LBWగా వెనుదిరిగింది. హర్లీన్ 13, రిచాఘోష్ 5 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమరి, కవిష, నిమష, రష్మిక తలో వికెట్ తీశారు.
భారత యువ బ్యాటర్ షెఫాలి వర్మ శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో అదరగొడుతుంది. చివరి టీ20లో షెఫాలి మరో 75 పరుగులు చేస్తే మహిళల Iటీ20 సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఈ సిరీస్లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది.
ICC టీ20 ర్యాంకింగ్స్లో భారత మహిళల స్టార్ బ్యాటర్ షెఫాలి వర్మ నాలుగు స్థానాలు ఎగబాకింది. తాజాగా ఆరో ర్యాంక్కు చేరుకుంది. స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతోంది. రిచా ఘోష్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్లో నిలిచింది. బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. శ్రీచరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి 52వ స్థానంలో నిలిచింది.
తన దృష్టిలో వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’ అని మాజీ క్రికెటర్ అశ్విన్ వెల్లడించాడు. అతడు జట్టుకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సాధించడంలో వరుణ్ కీలకపాత్ర పోషించబోతున్నాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా అతడు టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అని అశ్విన్ పేర్కొన్నాడు. నిజానికి అతడో ఆర్కిటెక్ట్ అని కితాబిచ్చాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా తమ ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ – 2025’ను ప్రకటించింది. ఈ జట్టులో భారత్, ఆస్ట్రేలియా నుంచి నలుగురు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమాను ఎంపిక చేశారు.జట్టు: KL రాహుల్, హెడ్, రూట్, గిల్, బవుమా(C), క్యారీ(wk), స్టోక్స్, స్టార్క్, బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, జడేజా
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఆమె మరో 62 పరుగులు చేస్తే, 2025లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె అన్ని ఫార్మాట్లలో కలిపి 1,703 పరుగులు చేసింది. ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ఆమె 62 పరుగులు చేస్తే.. గిల్(1,764 పరుగులు) రికార్డును అధిగమిస్తుంది.
ఆరెంజ్ క్యాప్: గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 759 పరుగులు చేసి ఈ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా(23 ఏళ్లు) రికార్డు సృష్టించాడు.పర్పుల్ క్యాప్: GT బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్ల్లో మొత్తం 25 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఈ అవార్డు అందుకున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్లో బరిలోకి దిగడం ఖాయమైంది. జనవరి 6న రైల్వేస్తో జరగబోయే మ్యాచ్లో కోహ్లీ ఆడుతున్నట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటికే ఈ టోర్నీలో కోహ్లీ 131, 77 పరుగులతో చెలరేగాడు. దీంతో తర్వాతి మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
HCA రిజిస్టర్డ్ క్రికెటర్ ఎం.రామ్ చరణ్ మార్కట్టాపై BCCI నిషేధం విధించింది. అతడిపై రెండేళ్ల నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. బీసీసీఐ ఆధ్వర్యంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి బ్యాన్ చేసింది. BCCI ఆదేశాల మేరకు 2027 DEC 28 వరకు నిషేధం విధిస్తున్నట్లు HCA తెలిపింది. క్రికెట్లో క్రమశిక్షణ, పారదర్శకత కోసం చర్యలు తీసుకున్నామని HCA స్పష్టం చేసింది.
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి కోనేరు హంపికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఆటపై హంపికి ఉన్న అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు.
యాషెస్ నాలుగో టెస్టుకు వేదికైన మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిచ్కు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇచ్చాడు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధిస్తున్నట్లు ప్రకటించాడు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారిందని, కేవలం రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడిపోయి మ్యాచ్ ముగిసిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు.
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక సూచనలు చేశాడు. గంభీర్ ముందుగా దేశవాళీ క్రికెట్లో ఏదైనా రంజీ జట్టుకు కోచ్గా వ్యవహరించాలని పనేసర్ సూచించాడు. అలా చేయడం వల్ల జట్టు ఎంపికపై అతడికి పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నాడు. వైట్-బాల్ క్రికెట్లో గంభీర్ కోచింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం దారుణంగా ఉందన్నాడు.