సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరిగిన 2వ వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ టీమిండియాకు పరాజయం తప్పలేదు. కోహ్లీ సెంచరీ చేసిన వన్డేల్లో భారత్ ఓడటం చాలా అరుదు. గతంలో ఇలా AUS చేతిలో 3, NZ 2, ENG, WI చేతిలో ఓ సారి భారత్ ఓడింది. చివరిసారిగా 2019లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా తాజాగా 8వ సారి రాయ్పూర్ వన్డేలో ఓటమి చవిచూసింది.
ఆల్రౌండర్గా IPLలో మెరిపించిన ఆండ్రీ రస్సెల్ లీగ్ నుంచి రిటైర్ కావడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో రిటైర్మెంట్కి గల కారణాన్ని రస్సెల్ స్వయంగా తెలిపాడు. “ఉసెన్ బోల్ట్, ABD తమ ఆటలో రాణిస్తున్నప్పటికీ రిటైర్ అవడంతో అంతా ‘ఎందుకు?’ అని ప్రశ్నించారు. నేను కూడా అందరూ ‘ఎందుకు?’ అని అనేటప్పుడే టాప్ ప్లేయర్గా రిటైర్ అవ్వాలని అనుకున్నా” అని...
HYDలో హార్దిక్ ఫాలోయింగ్ దెబ్బకు ఏకంగా SMAT బరోడా vs గుజరాత్ మ్యాచ్ వేదికను ఉప్పల్కు మార్చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్ జింఖానా మైదానంలో జరగాల్సి ఉంది. అయితే DEC 2న బరోడా vs పుదుచ్చేరి మ్యాచ్లో హార్దిక్ కోసం ఓ అభిమాని గ్రౌండ్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేదికను మార్చారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతున్న గబ్బా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. దీంతో ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిన స్టోక్స్ సేన ఈ మ్యాచ్లో గెలిచి లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. అటు పింక్ బాల్ టెస్టుల్లో ఆరితేరిన ఆసీస్ తొలి టెస్ట్ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉంది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఇవాళ గబ్బా(బ్రిస్బేన్) వేదికగా 2వ టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ పింక్ బాల్ టెస్టులోనూ కంగారూలను స్మిత్ నడిపించనున్నాడు. అటు తొలి మ్యాచులో ఆడిన స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ రెండో టెస్టులో గెలిచి లెక్క సమం చేయాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్ ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా దీటుగా బదులిస్తోంది. భారత బౌలర్లు సఫారీలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 44 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 319/5గా ఉంది.దక్షిణాఫ్రికా విజయానికి 36 బంతుల్లో 40 పరుగులు అవసరం.
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే ఉత్కంఠగా మారుతోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 37 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 253/3గా ఉంది. బ్రెవిస్ (29), మాథ్యూ బ్రిట్జ్కే (46) పరుగులతో ఉన్నారు.
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్ (79*) మాథ్యూ (13*) ఉన్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ చెరో వికెట్ తీశారు.
టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మోహిత్ 2013లో అంతర్జాతీయ అరంగేంట్రం చేశాడు. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి భారత జెర్సీ ధరించడం, IPLలో ఆడటం వరకు తనకు సపోర్ట్గా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ జెర్సీని ఆవిష్కరించాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (C), గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (102) సూపర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేశాడు. అలాగే, వన్డేల్లో అత్యధికంగా 13 వేర్వేరు సందర్భాల్లో వరుసగా మూడు, అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించాడు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (66*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు.
రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 42 ఓవర్లకు 295 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్ (29*), జడేజా (2*) ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కాగా, తొలి వన్డేలో సైతం కింగ్ కోహ్లీ (135) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ నుంచి వరుసగా రెండో సెంచరీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.