WPL వేలంలో 6 టైమ్ T20I వరల్డ్ ఛాంపియన్, ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీని ఎవరూ తీసుకోకపోవడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో నలుగురు విదేశీ ప్లేయర్లకే ఛాన్స్ ఉండటంతో జట్టు కూర్పులో భాగంగా ఆల్రౌండర్లకే ప్రాధాన్యమిచ్చామని UPవారియర్స్, DC పేర్కొన్నాయి. బలమైన టాపార్డర్, ఆఫ్ స్పిన్నర్గా జార్జియా వోల్, కీపర్గా రీచా ఉండటంతో హేలీని తీసుకోలేకపోయామని RCB తెలిపింది.
తండ్రికి గుండెపోటు, వేరే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్స్ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే మంధానతో ముచ్చల్ వివాహం జరగనున్నట్లు అతని తల్లి అమిత స్పష్టంచేశారు. ఆమెను ఆహ్వానించేందుకు తాను ఏర్పాట్లు కూడా చేశానని, అనుకోని పరిస్థితులతో ఇద్దరూ ఇప్పుడు బాధలో ఉన్నారని తెలిపారు.
ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్వుడ్తో పాటు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో వీరి సేవలు లేకుండానే గబ్బా టెస్టు జట్టును ఆసీస్ ప్రకటించింది. ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్(C), ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
స్మృతి మంధాన పెళ్లి ఆగిపోగా.. మేరీ డికోస్టా అనే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్ స్క్రీన్షాట్స్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘స్మృతి మేలు కోరి నేనే చాట్స్ పోస్ట్ చేసి పెళ్లి ఆగిపోయేలా చేశా. నేను ఎలాంటి తప్పు కానీ, ఇతరులకు అన్యాయం కానీ చేయలేదు. నన్ను ఎవరూ టార్గెట్ చేయొద్దు’ అని మేరీ డికోస్టా పేరుతో ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.
తమిళనాడులోని చెన్నై, మదురై వేదికగా ఇవాళ జూనియర్(U21) హాకీ ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా తలపడనున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం 2016లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడిన భారత యువ జట్టు మరోసారి కప్ గెలిచేందుకు సిద్ధమైంది. ఇవాళ మొత్తం 8 మ్యాచులు జరగనుండగా.. భారత్ 8:30PMకు తన తొలి మ్యాచులో చిలీతో తలపడనుంది.
WPL-2026 మెగా వేలంలో భారత ఆల్రౌండర్ శిఖా పాండే కోసం RCB, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు రూ.2.40 కోట్లతో ఆమెను యూపీ దక్కించుకుంది. సంజీవన్ సంజనను రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకున్నారు. పుజా వస్త్రాకర్కు రూ.85 లక్షలకు RCB కొనుగోలు చేసింది. తానియా భాటియాను రూ.30 లక్షలకు, లక్కీ హమిల్టన్ను రూ.10 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో భారత స్టార్ ఓపెనర్ ప్రతికా రావల్కు బిగ్ షాక్ తగిలింది. ఈ వేలంలో ఆమె అమ్ముడుపోలేదు. ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ప్రతికాపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయమైంది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాట్ అయ్యింది. దీంతో భారత ప్లేయర్ల ఆట తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనందుకు క్షమించాలని అభిమానులకు కోరాడు. ‘భారత్కు ప్రాతినిధ్యం వహించడం మాకు గొప్ప గౌరవం.. బలంగా, మెరుగ్గా తిరిగి రావడానికి కష్టపడతాం’ అని వెల్లడించాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో పలువురు అన్క్యాప్డ్ బ్యాటర్లకు నిరాశ ఎదురైంది. ప్రణవి చంద్ర, వింద్రా దినేశ్, దిశా కసత్, అరుషి గోయెల్, డెవినా ఫెరిన్ అన్సోల్డ్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్తో పాటు ప్రియా మిశ్రా, అమండా-జాడే వెల్లింగ్టన్, సైకా ఇషాన్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
WPL-2026 మెగా వేలంలో కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్పాట్ తగిలింది. RCBతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ ఆమెను రూ.1.1 కోట్లకు దక్కించుకుంది. అలాగే, తెలుగమ్మాయి జి.త్రిషకు నిరాశ ఎదురైంది. ఆమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సైతం అన్సోల్డ్ అయ్యింది.
WPL మెగా వేలంలో భారత బౌలర్ క్రాంతి గౌడ్ తిరిగి యూపీకి ఆడనుంది. RTM కార్డు ఉపయోగించి రూ.50 లక్షలకు యూపీ జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ లారెన్ బెల్ను రూ.90 లక్షలకు RCB కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ను రూ.60 లక్షలకు ముంబైకి దక్కించుకుంది. భారత బౌలర్ టిటాస్ సాధును రూ.30 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.