స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి కొత్త ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన వీరిద్దరి పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం నిర్వహించాలని వారు భావిస్తున్నారట.
ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు చెస్ ప్లేయర్గా మధ్యప్రదేశ్కు చెందిన సర్వజ్ఞ సింగ్ నిలిచాడు. 3 సంవత్సరాల 7 నెలల, 20 రోజుల వయసున్న సర్వజ్ఞ.. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం అత్యంత పిన్నవయసు చెస్ ప్లేయర్గా గుర్తింపు దక్కించుకున్నాడు. మొత్తం ఫిడే ర్యాంకింగ్స్లో 1,572 స్థానంలో ఉన్నాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య రేపు జరగనున్న రెండో వన్డే సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ టీమిండియా తరఫున T20 ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో తాను ఇంకా బడిలో చదువుకుంటున్నట్లు బవుమా తెలిపాడు. రోహిత్, కోహ్లీలకు క్రికెట్లో అపారమైన అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు దిగ్గజాల వల్ల ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నాడు.
స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా SMATలో బరోడా తరఫున బరిలోకి దిగాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి పాండ్యా ఇవాళ మైదానంలో అడుగుపెట్టాడు. పంజాబ్తో జరిగిన ఈ మ్యాచ్లో అతడు 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77* రన్స్ చేసి బరోడాకు విజయాన్ని అందించాడు. అలాగే, బౌలింగ్లో ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో SAతో T20 సిరీస్లో పాండ్యా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ T20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అతడు ఆడిన 16 ఇన్నింగ్స్ల్లోనే 3 సెంచరీలు సాధించడం విశేషం. IPLలో 35 బంతుల్లో, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో 32 బంతుల్లో, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 59 బంతుల్లో శతకాలు బాదాడు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే, త్వరలోనే అతడికి భారత్ సీనియర్ జట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 19 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగాల్తో జరిగిన గత మ్యాచ్లోనూ అభిషేక్ 148 పరుగుల భారీ శతకం సాధించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 60 బంతుల్లోనే 107* పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. 178 స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ లోహరుకాతో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పి బీహార్కు భారీ స్కోరు అందించాడు.
TG: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఇవాళ పంజాబ్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ కావడంతో మైదానం ఫ్యాన్స్తో నిండిపోయింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాను చూసేందుకు అభిమానులు భారీగా తరలొచ్చినట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. వెస్టిండిస్, కివీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 52 పరుగులు చేసి కేన్ ఔటయ్యాడు. ఈ క్రమంలో విండీస్పై టెస్టుల్లో 1000 రన్స్ పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా కేన్(1022) రికార్డుకెక్కాడు. కేన్కు ముందు రాస్ టేలర్(1136) ఈ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్ అవ్వడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘నేనే కోచ్గా ఉంటే ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించేవాడిని’ అని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రస్తుత కోచ్ గంభీర్ను తాను అస్సలు వెనకేసుకురానని స్పష్టం చేశారు. జట్టు ఓడినప్పుడు కోచ్గా బాధ్యత స్వీకరించాల్సిందేనని గంభీర్కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే IPL-2026 మినీ వేలానికి స్టార్ ప్లేయర్స్ షాక్ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈసారి తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు. గతేడాది పంజాబ్ తరఫున ఆడి దారుణంగా ఫెయిల్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మ్యాక్సీనే కాదు, మరికొందరు స్టార్స్ కూడా వివిధ కారణాలతో ఈ సీజన్కు దూరంగా ఉంటున్నారు.
ఇటాలియన్ టెన్నిస్ క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశాడు. అనారోగ్య కారణాలతో రోమ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్ పెడరేషన్ ధ్రువీకరించింది. 1933లో ట్యూనిస్లో ఆయన జన్మించాడు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా, తల్లి రష్యన్ జాతీయురాలు.
భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే రేపు రాయ్పూర్లో జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన జోష్లో ఉన్న టీమిండియా.. ఇది కూడా కొట్టి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. రాయ్పూర్లో మనకు మంచి రికార్డ్ ఉంది. పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. గ్రౌండ్ పెద్దది కాబట్టి బౌండరీలు కొట్టడం కాస్త కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
జెమిమా రోడ్రిగ్స్ వన్డే ప్రపంచకప్ సెమీస్లో ఆసీస్పై అజేయ సెంచరీతో భారత్ను ఫైనల్కు చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ అనంతరం తన వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేసినట్లు జెమిమా తాజాగా వెల్లడించింది. ఆసీస్తో తను ఆడిన ఇన్నింగ్స్ను ప్రశంసిస్తూ వందల సంఖ్యలో మెసేజ్లు రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది.