ఆరెంజ్ క్యాప్: గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 759 పరుగులు చేసి ఈ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా(23 ఏళ్లు) రికార్డు సృష్టించాడు.పర్పుల్ క్యాప్: GT బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్ల్లో మొత్తం 25 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఈ అవార్డు అందుకున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్లో బరిలోకి దిగడం ఖాయమైంది. జనవరి 6న రైల్వేస్తో జరగబోయే మ్యాచ్లో కోహ్లీ ఆడుతున్నట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటికే ఈ టోర్నీలో కోహ్లీ 131, 77 పరుగులతో చెలరేగాడు. దీంతో తర్వాతి మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
HCA రిజిస్టర్డ్ క్రికెటర్ ఎం.రామ్ చరణ్ మార్కట్టాపై BCCI నిషేధం విధించింది. అతడిపై రెండేళ్ల నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. బీసీసీఐ ఆధ్వర్యంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి బ్యాన్ చేసింది. BCCI ఆదేశాల మేరకు 2027 DEC 28 వరకు నిషేధం విధిస్తున్నట్లు HCA తెలిపింది. క్రికెట్లో క్రమశిక్షణ, పారదర్శకత కోసం చర్యలు తీసుకున్నామని HCA స్పష్టం చేసింది.
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి కోనేరు హంపికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఆటపై హంపికి ఉన్న అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు.
యాషెస్ నాలుగో టెస్టుకు వేదికైన మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిచ్కు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇచ్చాడు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధిస్తున్నట్లు ప్రకటించాడు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారిందని, కేవలం రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడిపోయి మ్యాచ్ ముగిసిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు.
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక సూచనలు చేశాడు. గంభీర్ ముందుగా దేశవాళీ క్రికెట్లో ఏదైనా రంజీ జట్టుకు కోచ్గా వ్యవహరించాలని పనేసర్ సూచించాడు. అలా చేయడం వల్ల జట్టు ఎంపికపై అతడికి పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నాడు. వైట్-బాల్ క్రికెట్లో గంభీర్ కోచింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం దారుణంగా ఉందన్నాడు.
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డగ్ బ్రేస్వెల్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్ని రోజులుగా అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ కెరీర్లో కివీస్ తరఫున 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు తీయడంతోపాటు 568 పరుగులు చేశాడు.
ప్రెసిడెంట్స్ కప్ డిపార్ట్మెంటల్ టోర్నీలో సూయి నార్తర్న్ గ్యాస్ జట్టు తరపున ఆడిన షాన్ మసూద్ రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్తానీ ఫస్ట్ క్లాస్ క్రిెకెట్లో శరవేగంగా డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్గా ఘనత సాధించాడు. 177 బంతుల్లోనే అతను డబుల్ సెంచరీ చేశాడు. గతంలో ఇంజమాబుల్ హక్(188 బంతుల్లో) రికార్డును మసూద్ బ్రేక్ చేశాడు.
ICC T20 ప్రపంచకప్ 2026కు ఇటీవల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రింకూ సింగ్ కోసం శుభ్మన్ గిల్ను బలి పశువు చేశారని ప్రచారం జరుగుతుంది. రింకూను రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో ఎంపిక చేశారని నెట్టింట ప్రచారం అవుతుంది. రింకూకు కాబోయే సతీమణి, సమాజ్వాద్ పార్టీ MP ప్రియా సరోజ్ చక్రం తిప్పిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హ్యూగ్ మోరిస్(62) కన్నుముశాడు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మోరిస్ నిన్న మృతిచెందాడు. సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్ కౌంటీ జట్టు ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా.. సీఈవో గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఈ సిరీస్కు జస్పీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరంగా కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల దృష్ట్యా ఇరువురిని న్యూజిలాండ్ సిరీస్కు దూరంగా ఉంచి.. T20 ప్రపంచకప్ నాటికి పూర్తిగా అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తిరువనంతపురంలో జరిగిన 4వ T20లో శ్రీలంకపై భారత్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 191/5 స్కోరుకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో చమరి(52) పరుగులతో రాణించగా.. భారత్ తరఫున వైష్ణవి, అరుంధతి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత ఓపెనర్లు స్మృతి 80, షెఫాలీ 79 పరుగులతో రాణించగా.. చివర్లో రిచా( 16 బంతుల్లో 40*) రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. దీంతో భారత్ తరఫున మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచింది. ఓవరాల్గా మహిళా క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కింది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అదరగొడుతోంది. గత రెండు మ్యాచ్ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో మెరిసిన ఆమె, తాజాగా నాలుగో టీ20లోనూ ఆ జోరును కొనసాగించింది. కేవలం 30 బంతుల్లోనే అర్ధ శతకాన్ని బాదిన షఫాలీ, ఈ సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.