KDP: పులివెందులలో ఓ కాలేజీ విద్యార్థి వి. భరత్ అండర్ -19 రాష్ట్రస్థాయి కడప జిల్లా బేస్ బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎ. నారాయణరెడ్డి భరత్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శశిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ ఎంపిక కళాశాల యాజమాన్యానికి ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
ఢిల్లీ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్, ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు, వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగనుంది.
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. తొలి టెస్టులో సునాయాస విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. జోరు మీదున్న భారత జట్టుకు వెస్టిండీస్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.
టీమిండియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా(70), డిక్లెర్క్(84) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి, రాణా చెరో 2, అమన్, చరణి, దీప్తి తలో వికెట్ తీసుకున్నారు.
బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలాన్ని ఈ ఏడాది నవంబర్ 25 లేదా 29న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.15 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఈ నేపథ్యంలో, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని బీసీసీఐ వెల్లడించింది. రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నవంబర్ 5 వరకు గడువు విధించింది.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత బ్యాటర్ రిచా ఘోష్ 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. దీంతో వన్డేల్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. అలాగే, స్నేహాతో 8వ వికెట్కు 88 రన్స్ జోడించి, ఈ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం జాబితాలో 4వ స్థానంలో నిలిచింది.
మహిళల వన్డే ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, రిచా ఘోష్(94) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకుంది. SA బౌలర్లలో ట్రయాన్ 3, మ్లాబా 2, మారిజాన్ 2 వికెట్లు తీశారు. SA టార్గెట్: 252.
మహిళల వన్డే ప్రపంచ కప్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడుతున్నారు. 26 ఓవర్లలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు ప్రతీక(37), స్మృతి(23) స్వల్ప పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. హర్మన్ప్రీత్(9), హర్లీన్(13), రోడ్రిగ్స్(0), దీప్తి(4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
VSP: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖలో భారత్, సౌతాఫ్రికా గురువారం మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ ఓడీ టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ స్మృతి మంధాన (23) తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ, ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగులు (982 పరుగులు, 17 ఇన్నింగ్స్లలో) చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రెండో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 343 మ్యాచ్లు ఆడిన హర్మన్, NZ ప్లేయర్ సుజీ బేట్స్ (350) తర్వాత స్థానంలో నిలిచింది.
KMR: గాంధారి మండలం లోని పెట్ సంగెం గ్రామంలోని ZPHS పాఠశాల క్రీడా మైదానంలో నేడు ఎస్జీఫ్ పాఠశాల విదార్థులకు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలాలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయికి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికాతో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 4:00 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఎలాంటి ఓవర్ల నష్టం లేకుండా పూర్తి ఓవర్లు (50 ఓవర్లు) మ్యాచ్ జరగనుంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికాతో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఎలాంటి ఓవర్ల నష్టం లేకుండా పూర్తి ఓవర్లు (50 ఓవర్లు) మ్యాచ్ జరగనుంది.