దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో 214 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆచితూచి ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి 81-4 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ (0), సూర్యకుమార్ (5) నిరాశపర్చారు. అభిషేక్ శర్మ (17), అక్షర్ (21) పరుగులు చేశారు. తిలక్ వర్మ (32*), హార్దిక్ (4*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్ అర్ష్దీప్సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 11వ ఓవర్లో ఏకంగా ఏడు వైడ్లు వేశాడు. ఓవర్ పూర్తి చేసేందుకు 13 బంతులు తీసుకున్నాడు. టీ20ల్లో ఒక ఓవర్లో అత్యధిక బంతులు వేసినవారి జాబితాలో అఫ్గానిస్థాన్కు చెందిన నవీన్ ఉల్ హక్ (13), దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగలా (12) ఉన్నారు.
సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 214 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి 2 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. గిల్ డకౌట్ అవ్వగా, రెండు సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ(17)ను యాన్సెన్ అద్భుతమైన బంతికి పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సూర్య(3) కూడా ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్ 32/3.
వైట్బాల్ క్రికెట్లో శుభ్మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో 2 బంతుల్లోనే ఔటైన గిల్, రెండో T20లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్ను కాదని ఓపెనర్గా గిల్కు చోటు కల్పించగా, అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో, గిల్ను తప్పించి, శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు టీమిండియా ముందు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, టీ20ల్లో భారత్ ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక స్కోరు 209 పరుగులు(ఆస్ట్రేలియాపై) మాత్రమే. దీంతో, ఈ రోజు మ్యాచ్లో గెలిచి టీమిండియా ఈ రికార్డును తిరగరాస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే, భారీగా మంచు పడుతుండటం, టీమిండియాకు బ్యాటింగ్లో అనుకూలంగా మారే అవకాశం ఉంది.
రెండో టీ20లో టీమిండియాపై సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ ఒక వికెట్ తీశారు. అయితే, ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఏకంగా 16 వైడ్లు వేయడం గమనార్హం. టీమిండియా టార్గెట్ 214.
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి 147/2 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, ఆ ఓవర్లో అతడు ఏకంగా 7 వైడ్లు వేశాడు.
రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. డికాక్(62*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 17 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. డికాక్తో కలిసి మార్క్రమ్ (14*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.
న్యూ చండీగఢ్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, యువరాజ్, హర్మన్ కూడా పాల్గొన్నారు.
భారత్-సౌతాఫ్రికా రెండో T20 న్యూ చండీగఢ్లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా, ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ మొదటి దశ టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 6:45 గంటల నుంచి మొదలుకానుంది. టికెట్ల కోసం అభిమానులు ICC అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు. టికెట్ ధరలు రూ.100 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్లో ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, ఢిల్లీ, చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ICC తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో జో రూట్(ENG) అగ్రస్థానంలో నిలిచాడు. విలియమ్సన్(NZ) రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ స్మిత్(AUS) మూడో స్థానం దక్కించుకున్నాడు. ‘ఫాబ్-4’ (టెస్టుల్లో కోహ్లీ రిటైర్)గా పేరు పొందిన ఈ క్రికెటర్లు ర్యాంకింగ్స్లో టాప్లో నిలవడం విశేషం. అయితే, టాప్-10లో భారత్ నుంచి జైస్వాల్(8వ) మాత్రమే స్థానం దక్కించుకున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీకి బీసీసీఐ భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ప్రస్తుతం ‘A+’ కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లను ‘A’ కేటగిరీకి మార్చనున్నట్లు సమాచారం. ఈ జోడీ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దీంతో వారి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గనుంది.
అబుదాబి వేదికగా ఈనెల 16 నుంచి IPL వేలం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్గా రూ.27 కోట్లతో రిషభ్ పంత్ ఉన్నాడు. ప్రస్తుతం జరగనున్న వేలంలో ఈ రికార్డు బద్దలవుతుందా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఇది మినీ వేలం కావడంతో, ఫ్రాంచైజీల వద్ద తక్కువ ‘పర్స్ వాల్యూ’ ఉండటం వల్ల ఈ రికార్డు బ్రేక్ కావడం కష్టమే అని చెప్పవచ్చు.
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు BCCI భారీ ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ‘A+’ కేటగిరీలో అతడికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. దీంతో, ఏడాదికి రూ.7Cr వేతనం అందుకోనున్నాడు. ఈనెల 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్లేయర్ల కాంట్రాక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అతను ‘A’ కేటగిరీలో ఉన్నాడు.