• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

సౌతాఫ్రికాపై కోహ్లీ సూపర్ రికార్డ్

సౌతాఫ్రికాపై వన్డేల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డును కలిగి ఉన్నాడు. ఆ జట్టుపై 29 ఇన్నింగ్స్‌ల్లో 65.39 సగటుతో 1,504 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, ఈనెల 30న తొలి వన్డే జరగబోయే JSCA స్టేడియంలోనూ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 384 రన్స్ బాదాడు. ఈ స్టేడియంలో కోహ్లీ ఆడిన చివరి మ్యాచ్‌లో కూడా 123 పరుగుల సెంచరీతో అదరగొట్టాడు.

November 28, 2025 / 08:09 PM IST

ఆయుష్ మాత్రే అజేయ శతకం

సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో CSK యువ ఆటగాడు ఆయుష్ మాత్రే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు కేవలం 49 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 110 పరుగులు (53 బంతుల్లో) చేశాడు. దీంతో 193 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.5 ఓవర్లలోనే ఛేదించింది.

November 28, 2025 / 06:15 PM IST

HYDకు మెస్సీ.. సీఎం రేవంత్ ట్వీట్

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘GOAT Tour to India 2025’లో భాగంగా DEC 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, మెస్సీకి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అతడికి ఆతిథ్యం ఇవ్వడానికి HYD సిద్ధంగా ఉందని చెప్పారు. మెస్సీ లాంటి లెజెండ్‌ను మన గడ్డపై చూడటం ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కల అని ‘X’లో ట్వీట్ చేశారు.

November 28, 2025 / 04:58 PM IST

మార్పులు లేకుండా బరిలోకి కంగారూలు

యాషెస్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ టెస్టులో కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని ప్యాట్ కమిన్స్, హెజెల్‌వుడ్‌కు ఈ మ్యాచ్‌కు కూడా విశ్రాంతినిచ్చారు.

November 28, 2025 / 03:22 PM IST

బాధ్యతగా ఆడాల్సింది ప్లేయర్లే: అశ్విన్

కోచ్‌ గంభీర్‌‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌‌లు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందిస్తూ… ఓటమికి కేవలం కోచ్‌ను మాత్రమే నిందించడం సరికాదని చెప్పాడు. జట్టులోని ఒక్క ఆటగాడు కూడా బాధ్యతగా ఆడలేదని అన్నాడు. జట్టులోని అందరికీ జవాబుదారీతనం ఉండాలని తెలిపాడు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, దాన్ని సరిదిద్దుకోవాలని సూచించాడు.

November 28, 2025 / 03:08 PM IST

కోచ్ గంభీర్‌కు గవాస్కర్ మద్దతు

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం గవాస్కర్, గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. కోచ్ ఆటగాళ్లు ఏ విధంగా ఆడాలో మాత్రమే చెప్పగలడు కానీ, మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని తెలిపాడు. గంభీర్ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిందని గుర్తుచేశాడు.

November 28, 2025 / 02:55 PM IST

పృథ్వీ షా విధ్వంసం

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీల్లో బ్యాట్‌తో రాణించిన అతను ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదరగొడుతున్నాడు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న పృథ్వీ షా HYDతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. IPL వేలంకు ముందు పృథ్వీ ఫామ్‌లోకి రావడంతో, ఆక్షన్‌లో మంచి ధర పలికే అవకాశం ఉంది.

November 28, 2025 / 02:17 PM IST

లంకతో T20 సిరీస్.. షెడ్యూల్ ఇదే

భారత మహిళల జట్టు వచ్చే నెలలో సొంతగడ్డపై శ్రీలంకతో 5 మ్యాచుల T20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు BCCI సిరీస్ షెడ్యూల్ ప్రకటించింది. విశాఖ వేదికగా తొలి T20 డిసెంబర్ 21న, రెండో మ్యాచ్ 23న జరగనున్నాయి. అలాగే తిరువనంతపురంలో చివరి 3 T20లు 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి. కాగా వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా ఈ సిరీస్‌తోనే తొలిసారిగా మైదానంలో దిగబోతోంది.

November 28, 2025 / 01:59 PM IST

ఆసియా కప్‌కు జట్టు ప్రకటించిన BCCI

U19 మెన్స్ ఆసియా కప్ 2025 కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టును ఆయుష్ మాత్రే నడిపించనున్నాడు.భారత జట్టు: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్

November 28, 2025 / 12:54 PM IST

బవుమా ఖాతాలో చరిత్ర ఎరుగని రికార్డ్

టెంబా బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా భారత్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బవుమా ఓటమి లేకుండా 10+ విజయాలు అందుకున్న తొలి, ఏకైక కెప్టెన్‌గా అవతరించాడు. అతని సారథ్యంలో సఫారీలు ఆడిన 12 టెస్టుల్లో 11 గెలవగా.. 1 డ్రా అయింది. అటు ఓటమి లేకుండా అత్యధిక టెస్టుల్లో గెలిచిన రెండో కెప్టెన్‌గా ENG దిగ్గజం మైక్ బ్రియర్లీ(15కు 10) కొనసాగుడుతున్నాడు.

November 28, 2025 / 12:49 PM IST

‘ఆలీసా హేలీని అందుకే తీసుకోలేకపోయాం’

WPL వేలంలో 6 టైమ్ T20I వరల్డ్ ఛాంపియన్, ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీని ఎవరూ తీసుకోకపోవడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో నలుగురు విదేశీ ప్లేయర్లకే ఛాన్స్ ఉండటంతో జట్టు కూర్పులో భాగంగా ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యమిచ్చామని UPవారియర్స్, DC పేర్కొన్నాయి. బలమైన టాపార్డర్, ఆఫ్ స్పిన్నర్‌గా జార్జియా వోల్, కీపర్‌గా రీచా ఉండటంతో హేలీని తీసుకోలేకపోయామని RCB తెలిపింది.

November 28, 2025 / 11:10 AM IST

స్మృతి మంధాన పెళ్లిపై కీలక అప్‌డేట్

తండ్రికి గుండెపోటు, వేరే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్స్ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే మంధానతో ముచ్చల్ వివాహం జరగనున్నట్లు అతని తల్లి అమిత స్పష్టంచేశారు. ఆమెను ఆహ్వానించేందుకు తాను ఏర్పాట్లు కూడా చేశానని, అనుకోని పరిస్థితులతో ఇద్దరూ ఇప్పుడు బాధలో ఉన్నారని తెలిపారు.

November 28, 2025 / 10:45 AM IST

2వ టెస్టుకు కమిన్స్ దూరం.. జట్టు ఇదే

ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో వీరి సేవలు లేకుండానే గబ్బా టెస్టు జట్టును ఆసీస్ ప్రకటించింది. ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్(C), ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్‌లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్

November 28, 2025 / 10:18 AM IST

‘స్మృతి మేలు కోరి నేనే పెళ్లి ఆపేశా’

స్మృతి మంధాన పెళ్లి ఆగిపోగా.. మేరీ డికోస్టా అనే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘స్మృతి మేలు కోరి నేనే చాట్స్ పోస్ట్ చేసి పెళ్లి ఆగిపోయేలా చేశా. నేను ఎలాంటి తప్పు కానీ, ఇతరులకు అన్యాయం కానీ చేయలేదు. నన్ను ఎవరూ టార్గెట్ చేయొద్దు’ అని మేరీ డికోస్టా పేరుతో ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.

November 28, 2025 / 07:01 AM IST

నేటి నుంచి హాకీ ప్రపంచ కప్

తమిళనాడులోని చెన్నై, మదురై వేదికగా ఇవాళ జూనియర్(U21) హాకీ ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా తలపడనున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం 2016లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడిన భారత యువ జట్టు మరోసారి కప్ గెలిచేందుకు సిద్ధమైంది. ఇవాళ మొత్తం 8 మ్యాచులు జరగనుండగా.. భారత్ 8:30PMకు తన తొలి మ్యాచులో చిలీతో తలపడనుంది.

November 28, 2025 / 06:44 AM IST