ఆసియా కప్లో UAEపై పాకిస్థాన్ టీమ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4కు అర్హత దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. జమాన్(50), అఫ్రీది(29*) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన UAE 105 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో అఫ్రీది, అబ్రార్, రౌఫ్లు తలో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
పాక్ ఓపెనర్ సాయిమ్ అయూబ్ ఆసియా కప్లో వరుసగా 3 మ్యాచుల్లో డకౌటై చెత్త రికార్డు సృష్టించాడు. ఒమన్, భారత్.. తాజాగా UAEతో మ్యాచ్లో ‘0’ పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ టోర్నీకి ముందు పాక్ మాజీ క్రికెటర్లు ‘బుమ్రా బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్సర్లు’ కొట్టగలడని అతన్ని ఆకాశానికెత్తారు. ఇప్పుడు భారత అభిమానులు ‘ముందు ఒక్క పరుగు చేసి చూపించు’ అంటూ ట్రోల్ చేస్తున్...
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 102 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 292 పరుగులు చేసింది. అనంతరం 293 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 190 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఈ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆసియా కప్ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తీసుకుంది. ఫలితంగా, ఇవాళ యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా కొనసాగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. ఈ వివాదం కారణంగా ఒక గంట ఆలస్యంగా రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఆసియా కప్ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తీసుకుంది. ఫలితంగా, యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా కొనసాగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్.. షేక్ హ్యాండ్ వివాదం కారణంగా గంట ఆలస్యంగా రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఆసియా కప్లో భాగంగా భారత్తో జరిగిన షేక్ హ్యాండ్ వివాదంపై మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో పాకిస్తాన్ ఈరోజు రాత్రి యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించింది. అంతేకాకుండా ఆసియా కప్ నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ స్మృతి మంధాన(117) సూపర్ సెంచరీతో అదరగొట్టింది. దీప్తీ శర్మ 40 పరుగులతో రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టిగా.. ఆష్లీ గార్డనర్ 2 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియా టార్గెట్: 293 పరుగులు.
లక్నోలో భారత్-A, ఆస్ట్రేలియా-A మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. AUS-A తమ తొలి ఇన్నింగ్స్ను 532/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116/1 పరుగులతో నిలిచింది. అభిమన్య ఈశ్వరన్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో జగదీశన్ (50), సాయి సుదర్శన్ (20) ఉన్నారు. IND-A ఇంకా 416 పరుగుల వెనుకబడి ఉంది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సత్తా చాటాడు. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఈ పోటీల్లో నీరజ్ ఫైనల్ రౌండ్కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతడు 84.85 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నేరుగా ఫైనల్స్లోకి అడుగుపెట్టాడు. ఈ పోటీల ఫైనల్స్ రేపు జరగనున్నాయి.
టీమిండియా మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆమె కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ ఇన్నింగ్స్లో 91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔట్ అయింది. టీమిండియా తరఫున వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
ICC తాజాగా విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్లో టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, జట్టు, ఆల్రౌండర్ల విభాగాల్లో టాప్ ర్యాంకింగ్లను దక్కించుకుంది. 271 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 జట్టుగా భారత్ నిలవగా, బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ల జాబితాలో హర్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.
భారత్- పాక్ జట్ల మధ్య ‘షేక్హ్యాండ్’ వివాదం వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘రాజకీయాలు – క్రీడలు’ అంశాలను వేర్వేరుగా చూడాలని పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది విమర్శించాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్పందించాడు. ‘క్రీడలు, రాజకీయాలు వేర్వేరు కాదు. వారు తీసుకునే స్టాండ్ అలా ఉంటే ఏం చేయలేం. ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్కు రాలేదు...
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ముల్లన్పూర్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన చేసిన హర్మన్ సేన రెండో పోరులో సత్తాచాటి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది.
ఆసియాకప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో ‘షేక్హ్యాండ్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు మరోసారి ఎదురుపడ్డారు. దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా పాక్ జట్టు అక్కడకు వచ్చింది. అయితే, ఇరు జట్ల మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదని సమాచారం.
ఆసియాకప్లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్గాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, తస్కిన్ 2 వికెట్లు చొప్పను పడగొట్టారు.