టీమిండియా కొత్త ఏడాదిని న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్కు భారత్ త్వరలోనే తమ జట్టును ప్రకటించనుంది. అయితే, ఈ సిరీస్కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ స్టేడియంలోనే గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి వరకు స్టేడియంలో ఎంతో చురుగ్గా ఉన్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఢాకా క్యాపిటల్స్, రాజ్షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.
బాలీవుడ్ ‘కండలవీరుడు’ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ బర్త్ డే పార్టీలో దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి పాల్గొని సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, ధోనీలను ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు SM వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో అరుదైన రికార్డు సాధించాడు. 2025 క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గిల్ 7 సెంచరీలతో 1,764 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్(1,760) రెండో స్థానంలో, ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్(1,598) మూడో స్థానంలో నిలిచాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి పిచ్పై మ్యాచ్ నిర్వహించినందుకు ఆస్ట్రేలియాను కచ్చితంగా తప్పుపట్టాలని అన్నాడు. ‘భారత్లో ఇలా వికెట్లు పడితే అందరూ విమర్శలు గుప్పిస్తారు.. మరి ఇప్పుడు మెల్బోర్న్ పిచ్పై ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నించాడు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు GATE 2023/24/25 స్కోర్ గలవారు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంగ్లండ్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఓడింది. కంగారూలను నడిపించిన 9 యాషెస్ టెస్టుల్లో స్మిత్కు ఇదే తొలి ఓటమి. అలాగే స్వదేశంలో స్మిత్ సారథ్యం వహించిన టెస్టుల్లో ఆసీస్ ఓడటం ఇది మూడో సారి. సౌతాఫ్రికా చేతిలో స్మిత్ సేన 2 మ్యాచులు ఓడింది.
బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. పేసర్లకు అనుకూలమైన మెల్బొర్న్ పిచ్పై 32.2 ఓవర్లలోనే 175 రన్స్ లక్ష్యాన్ని ఛేదించి మరోసారి తన బజ్బాల్ మార్క్ చూపించింది. యాషెస్ సిరీస్ కోల్పోయినా.. ఈ విజయంతో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. కాగా 2011 సిడ్నీ టెస్టు తర్వాత ఆస్ట్రేలియాలో ENGకు ఇదే తొలి గెలుపు. ఈ క్రమంలో ఆ జట్టు వరుసగా 18 టెస్టులు ఓడింది.
బాక్సింగ్ డే టెస్ట్: 175 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ENG నిలకడగా రాణిస్తోంది. తొలి 3 ఇన్నింగ్స్ల్లో బ్యాటర్లకు ఏ మాత్రం సహకరించని పిచ్పై 18 ఓవర్లలోనే 111/2 స్కోర్ చేసి.. విజయానికి 64 రన్స్ దూరంలో ఉంది. ఈ లక్ష్యాన్ని ENG ఛేదిస్తే.. ఇది యాషెస్లో సారథిగా స్మిత్కు తొలి ఓటమి అవుతుంది. అతని కెప్టెన్సీలో ఇప్పటివరకు 8 యాషెస్ టెస్టులాడిన AUS ఒక్కటీ ఓడలేదు.
AUS కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాషెస్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 3553 పరుగులు చేసి.. ఆలన్ బోర్డర్(3548 AUS)ను అధిగమించాడు. కాగా యాషెస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా డాన్ బ్రాడ్మన్(5028 AUS), జాక్ హాబ్స్(3636 ENG) తొలి 2 స్థానాల్లో ఉన్నారు. 5వ టెస్టులో స్మిత్ మరో 93 రన్స్ చేస్తే రెండో స్థానానికి ఎగబాకుతాడు.
బాక్సింగ్ డే టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటయ్యింది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో హెడ్(46) మినహా ఎవరూ రాణించలేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులే చేసిన ఇంగ్లండ్.. విజయం కోసం 175 చేయాలి. టెస్టుల్లో స్వల్ప టార్గెట్ అనిపించినా 150 రన్స్ కూడా కష్టమే అనేలా పిచ్ ఉంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన స్టోక్స్ సేన పుంజుకుంటుందేమో చూడాలి.
బాక్సింగ్ డే టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటైంది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో హెడ్(46) మినహా ఎవరూ రాణించలేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులే చేసిన ఇంగ్లండ్.. విజయం కోసం 175 చేయాలి. టెస్టుల్లో ఇది స్వల్ప టార్గెట్ అనిపించినా 150 రన్స్ కూడా కష్టమనేలా పిచ్ ఉంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన స్టోక్స్ సేన పుంజుకుంటుందేమో చూడాలి.
AUS vs ENG బాక్సింగ్ డే టెస్టులో బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. మెల్బోర్న్ MCG పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో తొలి 4 సెషన్లలోనే 26 వికెట్లు పడ్డాయి. 4/0 స్కోరుతో 2వ రోజు ఆట ప్రారంభించిన కంగారూలు.. లంచ్ సమయానికి 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 140 రన్స్ ఆధిక్యంలో ఉంది. నిన్న తొలి సెషన్లో 4, రెండో సెషన్లో 6 వికెట్లు పడగా.. 3వ సెషన్లో 10 వికెట్లు పడ్డాయి.
ఆల్రౌండర్ దీప్తిశర్మ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. WT20ల్లో అత్యధికంగా 151 వికెట్లు తీసి.. మెగాన్ షట్ సరసన అగ్రస్థానంలో నిలిచింది. దీప్తి మరో వికెట్ తీస్తే ఈ రికార్డు పూర్తిగా తనదవుతుంది. అటు మహిళల క్రికెట్(3 ఫార్మాట్లు)లో అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్గానూ దీప్తి(333) నిలిచింది. 23 వికెట్లు తీస్తే ఝులన్ గోస్వామి(355)ని అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తుంది.