WPLలో ఇప్పటివరకు 3 సీజన్లు జరిగాయి. హర్మన్ నేతృత్వంలో MI 2 సార్లు(2023, 25) ట్రోఫీ అందుకోగా.. స్మృతి సారథ్యంలో RCB ఓ సారి(2024) టోర్నీ విజేతగా నిలిచింది. ఈ సీజన్లలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరినా టైటిల్ను ముద్దాడలేకపోయింది. ఇక అత్యధిక రన్స్ (స్కీవర్ బ్రంట్- 1027), అత్యధిక వికెట్ల(హేలీ మాథ్యూస్- 41) రికార్డ్ MI ప్లేయర్ల పేరిటనే ఉంది.
న్యూజిలాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల T20 సిరీస్లో తొలి 3 మ్యాచ్లకు తిలక్ వర్మ దూరమైనట్లు BCCI ప్రకటించింది. ఫిట్గా ఉంటే మిగతా 2 మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అయితే నిన్న తిలక్కు సర్జరీ జరిగిందని, ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. కాగా ఈ నెల 21నుంచి IND vs NZ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా మహారాష్ట్ర, గోవా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 249/7 తో రాణించింది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 131 బంతుల్లో అద్భుత సెంచరీ (134*)తో అదరగొట్టాడు. దీంతో రెండు దశాబ్దాలుగా ఛేదించలేని ప్రపంచ రికార్డును తిరగరాశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ఓకే ఓవర్లో వరుసగా 6,4,6,4,6,4తో రాణించాడు. మొత్తంగా 20 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే మయాంక్ బౌలింగ్లో లెగ్ బిఫోర్గా వెనుదిరగడంతో సర్పరాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి’ అని SMలో పోస్టు పెట్టాడు. తాజాగా ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కొందరు మాజీ ఆటగాళ్లు పనిగట్టుకొని కోహ్లీని విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు పెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లోనూ ఆసీస్ 5వికెట్లతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తాజాగా దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం. తొలి ఇన్నింగ్స్లో మరో 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులు ఇవ్వాల్సింది’ అని అన్నాడు.
బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్లో ఇంగ్లండ్ దూకుడుగా రాణిస్తోంది. 2022 జూన్లో ప్రారంభమైన ఈ ‘బజ్బాల్’ ఆటతో ఇప్పటివరకు 46 టెస్టులు ఆడిన ENG.. 26 మ్యాచుల్లో గెలవగా, 8 డ్రా అయ్యాయి. అయితే భారత్-ఆస్ట్రేలియా ముందు ఈ ఆట పనిచేయట్లేదు. ఈ 2 జట్లపై ఆడిన 21 టెస్టుల్లో 7 మాత్రమే గెలవగా 2 డ్రా అయ్యాయి. ఇతర జట్లపై ENG విన్నింగ్ పర్సంటేజ్ 76 కాగా.. IND-AUSపై 33.3 మాత్రమే.
న్యూజిలాండ్తో T20 సిరీస్కు తిలక్ వర్మ దూరం కానున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్లో రాణిస్తున్న అతను పొట్ట వద్ద గాయంతో బాధపడుతున్నాడని, దీంతో గిల్ను జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. T20 వరల్డ్ కప్ ముంగిట తిలక్ గాయం టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఈ నెల 21 నుంచి 5 T20ల IND vs NZ సిరీస్ జరగనుంది.
నేషనల్ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్పై వేటు పడింది. ఫరీదాబాద్లో 17 ఏళ్ల జూనియర్ మహిళా షూటర్పై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని సీరియస్గా తీసుకున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI), అంకుష్ను సస్పెండ్ చేసింది. అతని కేసు నమోదు కాగా, విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పిస్తున్నట్లు NRAI వెల్లడించింది.
ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసింది. 2011లో సిడ్నీ వేదికగా యాషెస్ 5వ టెస్టులో అరంగేట్రం చేసిన అతను.. అదే మైదానంలో యాషెస్ 5వ టెస్టులోనే ఇవాళ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ తరఫున 88 టెస్టులు, 40 వన్డేలు, 9 T20లు ఆడిన ఖవాజా.. 18 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలతో మొత్తం 8024 రన్స్ చేశాడు.
యాషెస్ 5వ టెస్టులో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఇప్పటికే ఆసీస్ సొంతమైన సిరీస్ 4-1తో ముగిసింది. 2వ ఇన్నింగ్స్లో ENG 342 రన్స్ చేయగా.. 160 పరుగుల లక్ష్యాన్ని AUS 31.2 ఓవర్లలోనే ఛేదించింది. ENG తరఫున రూట్(160), బెథెల్(154).. AUS తరఫున హెడ్(163), స్టీవ్ స్మిత్(138) సెంచరీలతో మెరిశారు. స్కోర్స్: ENG 384 & 342 ; AUS 567 & 161/5
యాషెస్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర లిఖించింది. ఒకే ఇన్నింగ్స్లో అత్యధికంగా 7 50+ రన్స్ భాగస్వామ్యాలు నెలకొల్పిన జట్టుగా నిలిచింది. 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఈ ఘనత సాధించంది. దీంతో 134 ఏళ్ల క్రితం 1892లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్ నమోదు చేసిన 6 50+ పరుగుల భాగస్వామ్యాల రికార్డు బ్రేక్ అయింది.
దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ను యువ భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 393/7 పరుగులు చేసింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (127), ఆరోన్ జార్జి (118) సెంచరీలు చేశారు. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది.
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. తాజాగా గత జ్ఞాపకాలను బ్రాడ్ గుర్తుచేసుకున్నాడు. తనకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ తనలో కసిని రగిల్చిందని తెలిపాడు. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో తెలిసేలా చేసిందన్నాడు. తనను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లిందని చెప్పుకొచ్చాడు.