IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ BCCIపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. IPL-2026 షెడ్యూల్, ఆ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్ల మధ్య తగినంత విరామం లేకపోవడం దారుణమని మండిపడ్డాడు. BCCI కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిందని, ఆటగాళ్ల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నాడు. ప్లేయర్లకు వారి కుటుంబాలతో గడిపే సమయం ఇవ్వాలని.. కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా(గాడిదల్లా) చూడటం ఆపాలన్నాడు.
రాజస్థాన్తో మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చిన మయాంక్ యాదవ్పై నెటిజన్ల ట్రోలింగ్ను ఇయాన్ బిషప్ ఖండించారు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని, మళ్లీ 150 కి.మీల వేగంతో బౌలింగ్ చేయడమే ఒక అద్భుతమని అన్నారు. ఆ కుర్రాడిపై విమర్శలు చేయడం దారుణమని, అతని కంట్రోల్ కాలక్రమేణా వస్తుందని, ప్రస్తుతం అతని ఫిట్నెస్ కోసం ప్రార్థించాలని బిషప్ పేర్కొన్నారు.
లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంలో బౌలర్ నాండ్రీ బర్గర్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాళ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బర్గర్కు 10 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధిస్తూ ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అలాగే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చింది.
మరికాసేపట్లో ముంబై వేదికగా CSK, MI జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ధోనీ ఆడనున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. దీంతో ఎంతో కాలంగా ధోనీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే CSK కీలక ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయపడగా.. అతడి స్థానంలో ధోనీ వస్తాడని ‘థలా’ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ విజయంపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. తమ జట్టు బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి బౌలర్లు తమ జట్టులో ఉండటం అదృష్టం అని పేర్కొన్నాడు.
LSGతో జరిగిన మ్యాచ్లో RR ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రి, తన భార్య రివాబాకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్లో తాను అద్భుతాలు చేస్తానని ఆమె చెప్పినట్లు జడ్డూ వెల్లడించాడు. అలాగే, పూరన్ను ఔట్ చేసిన తర్వాత చేసుకున్న ‘పాకెట్’ సంబరాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనే అని చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికీ టీవీలో కార్టూన్స్ చూస్తానని తెలిపాడు. ప్రతి మ్యాచ్కు ముందు ఇలా కార్టూన్లు చూసే అలవాటు ఉందన్నాడు. దీంతో చాలా రిలాక్స్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇలా ఆడాలి.. అలా ఆడాలని బుర్ర బద్దలు కొట్టుకోనని, మ్యాచ్లోకి దిగితే తన దృష్టి అంతా గేమ్ పైనే ఉంటుందని వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ సహచరుడు, 2008 అండర్-19 ప్రపంచకప్ సభ్యుడు అజితేష్ అర్గల్ అంపైర్ అవతారం ఎత్తాడు. IPL 2026లో భాగంగా LSG, RR జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో డెబ్యూ చేశాడు. ప్రపంచకప్ తర్వాత అతడిని పంజాబ్ కింగ్స్ తీసుకున్నప్పటికీ ఒక్క IPL మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, జనవరి 22న GT, UP మధ్య జరిగిన WPL 2026లోనూ అర్గల్ అంపైర్గా వ్యవహరించాడు.
BCCI సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ జట్టుకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. గతేడాది అతడిని కలిసినప్పుడు ‘నన్ను క్షమించు’ అని అడిగినట్లు పేర్కొన్నాడు. కావాలని తాము నిర్ణయం తీసుకోలేదని.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్రౌండర్లను తీసుకోవాలని భావించినట్లు వెల్లడించాడు.
ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో రెండో రోజు భారత్కు మూడు రజతాలు, ఒక కాంస్యం వరించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ పురుషుల ఈవెంట్లో రోహిత్ కన్యన్ భారత్కు తొలి రజతం అందించాడు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సెజల్ కాంబ్లే రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాజ్చంద్ర, అభినవ్ దేశ్వాల్ రజతం, కాంస్యం సాధించారు.
సౌతాఫ్రికా మహిళలతో మూడో T20లోనూ భారత్ చిత్తుగా ఓడింది. 193 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ లారా(115), లూస్(56*) రాణించడంతో.. 5 T20ల సిరీస్లో భారత్పై ప్రొటీస్ వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు ఉండగానే సిరీస్ సౌతాఫ్రికా సొంతమైంది. ఈ మ్యాచ్లో ఒకే ఓవర్ వేసిన షెఫాలీ(9 రన్స్) మినహా తమ బౌలర్లందరూ 30కి పైగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
సిరీస్ డిసైడర్ మూడో T20లో సౌతాఫ్రికా వికెట్లు పడగొట్టేందుకు భారత మహిళా జట్టు చెమటోడుస్తుంది. ప్రొటీస్ కెప్టెన్ లారా 76*, లూస్ 39* ధాటిగా ఆడుతుండటంతో.. ఒక్క వికెట్ అయినా పడదా? అన్నట్లుగా తన అమ్మాయిలు ప్రయత్నిస్తున్నారు. 11 ఓవర్ల ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 128 కాగా.. విజయం కోసం 54 బంతుల్లో 66 రన్స్ చేయాలి. ఇందులోనూ ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది.
సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న మూడో T20లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. స్మృతి 37, షెఫాలీ 64, కెప్టెన్ కౌర్ 66 పరుగులతో రాణించడంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మ్లాబా 2, డిక్లెర్క్ ఓ వికెట్ తీశారు. SA విజయ లక్ష్యం 193. కాగా ఇప్పటికే తొలి 2 T20లూ ఓడిన భారత్.. ఇందులో గెలవకుంటే 5 మ్యాచ్ల సిరీస్ చేజారుతుంది.
IPL 2026: రాజస్థాన్ చేతిలో లక్నో తమ సొంత మైదానంలోనే చిత్తుగా ఓడింది. RR విసిరిన 160 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(55) అర్థసెంచరీతో రాణించగా.. పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3, బర్గర్, బ్రిజేష్ శర్మ చెరో 2, జడేజా, బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
IPL 2026: రాజస్థాన్తో మ్యాచ్లో లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు తడబడటంతో 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ యాదవ్(1), దిశ్వేష్(1) ఉండగా.. విజయం కోసం 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్, బర్గర్ చెరో 2.. జడేజా, బిష్ణోయ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.