పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. దీంతో ఆతిథ్య జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి 15 మ్యాచుల్లో ఒక్కటీ గెలవని ఇంగ్లీష్ టీమ్ ఈ టెస్టులో ఎలా అయినా గెలవాలనే పట్టు మీదుంది. అటు యాషెస్లో ఓటమి ఎరుగని స్మిత్ నాయకత్వంలో కంగారూల జట్టు బలంగా కనిపిస్తోంది.
మరికాసేపట్లో ప్రతిష్ఠాత్మక యాషెస్ తొలి టెస్ట్ జరగనుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇంగ్లంట్ బ్యాటర్లకు సవాలే. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి 15 మ్యాచుల్లో వాళ్లు ఒక్కటీ గెలవలేదు. 13 AUS గెలవగా, 2 డ్రా అయ్యాయి. 1882 నుంచి జరుగుతున్న ఈ టోర్నీ చరిత్రలో ఇరుజట్లు ఇప్పటివరకు 361 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో AUS 152, ENG 112 నెగ్గాయి. 97 టెస్టులు డ్రాగా ముగిశాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్లో టీమిండియా-A, బంగ్లా-A జట్లు తలపడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ బలంగా కనిపిస్తుండగా.. బంగ్లా మాత్రం బౌలింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దీంతో బంగ్లాకు ఈ పోరు కొంత సవాలే. కాగా రేపు పాక్, లంక మధ్య రెండో సెమీస్ జరగనుంది.
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈనెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు నడవనుంది. ఈ శుభ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పాకిస్తాన్లో జరుగుతున్న T20 ట్రై సిరీస్లో శ్రీలంకకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 162/8 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో 47 పరుగులు, బౌలింగ్లో 1 వికెట్ తీసిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ‘MOM’గా నిలిచాడు.
గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో స్టార్ బాక్సర్ తెలుగమ్మాయి నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో మెరిసింది. 51 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5-0తో గెలుపొందింది. అలాగే, మినాక్షి హూడా(48 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు), అరుంధతి(70 కిలోలు), నూపుర్ శెఓరన్(80+ కిలోలు) స్వర్ణాలు సాధించారు.
ఐపీఎల్పై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL ప్రపంచంలోనే అగ్రగామి క్రికెట్ లీగ్ అని.. మారుతున్న కాలానికి అనుగుణంగా లీగ్లో మార్పులు చేయాలని అన్నాడు. IPLలో వేలం ప్రక్రియను తొలగించి ఏడాది పొడవునా ఆటగాళ్లను ట్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని తెలిపాడు. IPLను రెండు నెలల నుంచి ఆరు నెలల టోర్నీగా మార్చాలని సూచించాడు.
దక్షిణాఫ్రికాతో శనివారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు అందుబాటులో ఉండేందుకు గిల్ చివరి ప్రయత్నంగా శుక్రవారం ఫిట్నెస్ పరీక్ష చేయించుకోనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. ఆ పరీక్షలో అతడు పాస్ అయితే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. కాగా, మెడ నొప్పి కారణంగా తొలి టెస్టు ఆట మధ్యలోనే గిల్ మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.
ప్రతిష్ఠాత్మక యాషెస్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ ఇప్పటికీ ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్(1928-48) పేరిటనే ఉంది. ఇంగ్లండ్పై 37 టెస్టులు ఆడిన ఆయన ఏకంగా 19 సెంచరీలు చేశాడు. 12 సెంచరీలతో ఆ రికార్డుకు చేరువగా స్టీవ్ స్మిత్.. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జాక్ హాబ్స్(1908-30) సరసన రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా(AUS-10) మూడో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసోంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొనున్నారు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. రెండో మ్యాచ్ ఈనెల 22 నుంచి గౌహతిలో జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు గంభీర్ కామాఖ్య ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంగ్లండ్తో రేపటి నుంచి జరిగే యాషెస్ తొలి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ తరఫున జేక్ వెదర్లాండ్, బ్రెండన్ డాగెట్ అరంగేట్రం చేయనున్నారు.ఆసీస్ జట్టు: స్మిత్(C), ఖవాజా, వెదర్లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, డాగెట్, బోలాండ్
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుండగా.. వచ్చే ఏడాది మార్చ్ 15 నుంచి టోర్నీ ప్రారంభమవుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో ఈ సారి ఒక్కో జట్లు 16 లీగ్ మ్యాచులు ఆడుతుంది. అలాగే టోర్నీలో మొత్తం 84 T20లు జరుగుతాయి. ఇక ఎప్పటిలాగానే మ్యాచులు 3:30PM, 7:30PMకు ఉంటాయి.
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో సంచలనం నమోదైంది. పాకిస్తాన్కు పసికూన నేపాల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 170/ 7 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నేపాల్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సెమీస్కు అర్హత సాధించింది.