ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు టీ విరామ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 564 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (265) డబుల్ సెంచరీ సాధించి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. గిల్కు సహకారం అందించిన వాషింగ్టన్ సుందర్ (42).. రూట్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో ఆకాశ్ దీప్ (0*) క్రీజులోకి వచ్చాడు.
భారత యువ ప్లేయర్లు గిల్, జైస్వాల్లపై క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రశంసలు కురిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 310/5 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఓపెనర్గా జైస్వాల్ దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడని కొనియాడాడు. అలాగే, గిల్ పూర్తి నియంత్రణతో ఆడి, సెంచరీ సాధించిన తీరు తనను ఆకట్టుకుందని సచిన్ పేర్కొన్నాడు.
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నోలో సియాటిల్ ఓర్కాస్తో జరుగుతున్న మ్యాచ్లో MI న్యూయార్క్ బ్యాటర్ తజిందర్ ధిల్లాన్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా 7 బంతుల్లో 6 సిక్సర్లు బాది అదరగొట్టాడు. 13వ ఓవర్ చివరి 4 బంతుల్లో మూడు సిక్సర్లు.. 14వ ఓవర్లో మొదటి 3 బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే, 35 బంతుల్లో 95 పరుగులు చేసిన తజిందర్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
హెడింగ్లీలో జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ తొలి టెస్టు చివరి రోజు ఉత్కంఠగా మారింది. ఇంగ్లండ్ గెలవాలంటే 350 పరుగులు అవసరం కాగా, భారత్ 10 వికెట్లు పడగొట్టాలి. ఇప్పటికే ఇంగ్లండ్ డ్రా కోసం కాకుండా విజయం కోసమే ఆడుతామని ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగిస్తే డ్రాగా ముగిసే అవకాశం ఉంది.
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ రోజుతో 18 ఏళ్లు పూర్తవుతుంది. 2007 జూన్ 23న ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో హిట్మ్యాన్ అరంగేట్రం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేశాడు. అప్పటి హెల్మెట్ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, టీ20, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో పోప్ (106) సెంచరీతో మెరిశాడు. బ్రూక్ (99) ఒక్క పరుగుతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు.
భారత స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా మరో రికార్డు సాధించాడు. SENA(SA, ENG, NZ, AUS) దేశాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు 147 వికెట్లు పడగొట్టాడు. ENGతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పాడు. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ (146) రికార్డును బద్దలు కొట్టాడు. వీరి తర్వాత కుంబ్లే (141), ఇషాంత్ శర్మ(130), షమీ (123) ఉన్నారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు స్టోక్స్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. కాగా, తొలి టెస్టు ఆడుతున్న సాయి సుదర్శన్ను కూడా స్టోక్స్ డకౌట్ చేసిన విషయం తెలిసిందే.
వికారాబాద్: తాండూర్ పట్టణంలోని తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూర్ రాజ్ పుత్ సమాజం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఆధ్వర్యంలో సమాజం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి సహయం అందించాలని కోరారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన బ్యాటింగ్తో మెరిశాడు. బౌలర్లపై చెలరేగి 144 బంతుల్లో మొత్తం 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది సూపర్ సెంచరీ చేశాడు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనూ సెంచరీతో మెరిసిన జైశ్వాల్.. ఇంగ్లండ్ గడ్డపై అదే ఫీట్ నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 213/2 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి టైటిల్ను కైవసం చేసుకుంది. మార్క్రమ్ చిరస్మరణీయ సెంచరీతో 27 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. కెప్టెన్ బవుమా (66) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
బౌండరీ రోప్ బయట గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్ పట్టుకుని ఒకే ప్రయత్నంలో లోపలకు బాల్ను విసరాలి. అప్పుడు బౌండరీ రోప్ లోపలకు వచ్చి బంతిని పట్టుకుంటే ఔట్. లేకపోతే సిక్స్ సేవ్ చేసినట్లు. కానీ బౌండరీ రోప్ బయట ఉండి.. గాల్లోకి ఎగిరి రెండో ప్రయత్నంలో బంతిని బౌండరీ లోపలకు విసిరే ప్రయత్నం చేస్తే.. ఇకపై అది సిక్స్ గానే పరిగణిస్తారు. ఈ రూల్ 2026 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఆసీస్.. రెండో సెషన్లో పుంజుకుంది. దీంతో టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వెబ్స్టర్ (55), కారె (22) ఉన్నారు.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పలువురు నెటిజన్లు ‘అరెస్ట్ కోహ్లీ’ అనే హ్యాష్ట్యాగ్ను ‘X’లో ట్రెండ్ చేస్తున్నారు. తొక్కిసలాటలో 11 మంది మరణిస్తే, కోహ్లీ తన కుటుంబంతో లండన్కు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కప్ మీద ఉన్న ప్రేమ ఫ్యాన్స్ పట్ల లేదని మండిపడుతున్నారు. మరోవైపు, ‘వి స్టాండ్ విత్ కోహ్లీ’ అంటూ పలువురు అతడికి మద్దతుగా నిలు...
NLG: నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో 47వ TG రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం 2వ రోజు వివిధ జిల్లాల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. రెండో రోజు బాలికల విభాగం నుంచి 12మ్యాచులు, బాలుర విభాగం నుంచి 12మ్యాచ్లు నిర్వహించినట్లు TG రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు.