సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ (4) వికెట్ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ సూర్య(12) కూడా భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో భారత్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు కూడా లుంగి ఎంగిడి పడగొట్టాడు.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికాతో ఈరోజు జరగబోయే తొలి టీ20లో అందరి కళ్లు అభిషేక్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘అభిషేక్తో కలిసి SRHకు ఆడాను. అతడు విధ్వంసక ఆటగాడు. ఈ మ్యాచ్లో అతడి వికెట్ చాలా కీలకం. పవర్ ప్లేలో అతడిని అడ్డుకోవడం బౌలర్లకు సవాలే’ అని పేర్కొన్నాడు.
➤ అబుదాబిలో డిసెంబర్ 16న ఆక్షన్➤ మ.2.30 గంటలకు వేలం ప్రారంభం➤ వేలంలో నమోదు చేసుకున్న ప్లేయర్లు – 1,355 ➤ షార్ట్లిస్ట్ అయిన ఆటగాళ్లు – 350➤ భారత ప్లేయర్లు – 224 అన్క్యాప్డ్, 16 క్యాప్డ్➤ విదేశీ ప్లేయర్లు – 110
దక్షిణాఫ్రికాతో ఇవాళ కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, యువ ఆటగాడు తిలక్ వర్మ సహా కొందరు జట్టు సభ్యులు ఒడిశాలో పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.
యాషెస్ మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో తొలి 2 టెస్టులు ఆడని హేజిల్వుడ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అటు ఇంగ్లండ్ జట్టు నుంచి కూడా మోకాలి గాయంతో మార్క్ వుడ్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో మాథ్యూ ఫిషర్ ఇంగ్లీష్ జట్టులో చేరాడు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ కమిన్స్ మూడో టెస్టు నుంచి ఆడనున్నాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్లో గందరగోళం నెలకొంది. జింఖానా గ్రౌండ్లో నిర్వహిస్తున్న సెలక్షన్స్కు దాదాపు 1000 మందికి పైగా ప్లేయర్లు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ ప్లేయర్ల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సచిన్ కంటే వేగంగా ఆడుతున్నాడు. సచిన్ తన తొలి 216 ఇన్నింగ్స్ల్లో 43 హఫ్ సెంచరీలు, 35 సెంచరీలు చేయగా.. స్మిత్ 44 అర్ధ శతకాలు, 36 శతకాలు బాదాడు. ఈ క్రమంలో అతను సచిన్(54.92) కంటే మెరుగైన యావరేజ్(55.97) కూడా కలిగి ఉన్నాడు. రన్స్ పరంగా సచిన్ 10,654 చేయగా.. స్మిత్ 10580 చేశాడు.
సోమవారం జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్లో తెలుగు టీమ్స్ AP, హైదరాబాద్ రెండూ ఓడినప్పటికీ సూపర్ లీగ్కు అర్హత సాధించాయి. గ్రూపుల వారీగా A నుంచి ముంబై, AP.. B నుంచి హైదరాబాద్, MP.. C నుంచి పంజాబ్, హర్యానా.. D నుంచి జార్ఖండ్, రాజస్థాన్ ప్రమోట్ అయ్యాయి. ఈ నెల 12, 14, 16 తేదీల్లో సూపర్ లీగ్ జరగనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్లో త్రిపుర ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా.. త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో త్రిపుర 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ అద్భుత పదర్శనతో ఆదరగొట్టారు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ నెల 3న రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్కు కారణమైన టీమిండియా ఆటగాళ్లకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. కెప్టెన్ KL రాహుల్ తప్పును అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్నకు సంబంధించి జియోహాట్స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు T20I సిరీస్కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా సిద్దంగా ఉన్నారు. గిల్, హార్దిక్ గాయం నుంచి కోలుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ వెల్లడించాడు. ఈ కీలక ఆటగాళ్ల రీఎంట్రీ.. T20 ప్రపంచకప్కు ముందు భారత జట్టుకు బలం చేకూర్చనుంది. కాగా, రేపు కటక్ వేదికగా తొలి టీ20 జరగనుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలా? లేదా? అనేది ‘రో-కో’ వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. అంతేతప్ప, వారు ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే అని వారికి ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా, ఈ టోర్నీలో ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ జట్టుకు కోహ్లీ ఆడే అవకాశం ఉంది.