రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్తో విశాఖలో జరుగుతున్న వన్డేలో 27 రన్స్ చేయడం ద్వారా ఈ రికార్డ్ సాధించాడు. రోహిత్ వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, T20ల్లో 4,231 పరుగులు చేశాడు. దీంతో భారత్ తరఫున ఈ రికార్డు సాధించిన సచిన్(34,357), కోహ్లీ(27,808), ద్రవిడ్(24,064) తర్వాతి స్థానంలో నిలిచాడు.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ 5 పరుగులు చేసి.. SENA దేశాలపై వన్డేల్లో 5 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓపెనర్గా SENA దేశాలపై ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సచిన్ (7116 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో, కుల్దీప్ యాదవ్ స్పిన్తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అతను 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో, వన్డేలలో భారత్ తరఫున అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే (10 సార్లు)ను అధిగమించి కుల్దీప్ (11 సార్లు) 3వ స్థానానికి చేరుకున్నాడు. షమీ(16), అగర్కార్(12) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో హిట్మ్యాన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 27 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్ (34,357), కోహ్లీ (27,808), ద్రవిడ్ (24,064) మాత్రమే ఈ ఘనత సాధించారు.
విశాఖ వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దీంతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో డికాక్ (106), బవుమా (48) ధాటిగా ఆడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ(4 వికెట్లు), కుల్దీప్(4 వికెట్లు) అద్భుత బౌలింగ్ చేసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. వన్డే సిరీస్ కైవసం చేసుకోవడానికి భారత్ 271 పరుగులు చేయాలి.
2025-భారత్లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్లేయర్ల జాబితాను గూగుల్ తాజాగా విడుదల చేసింది. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రియాంష్ ఆర్య 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జెమీమా(5), మంధాన(7) చోటు దక్కించుకున్నారు. కాగా, అభిషేక్ శర్మ 3వ స్థానంలో ఉన్నప్పటికీ, పాక్లో మాత్రం అత్యధికంగా సెర్చ్ చేసిన ప్లేయర్గా టాప్లో నిలిచాడు.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అరుదైన మైలురాయి సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో(53) సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో 2000 పరుగులు సాధించిన 5వ ప్లేయర్గా నిలిచాడు. 40 ఇన్నింగ్స్లతో హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. అలాగే, ఈ ఘనత సాధించిన ఓల్డెస్ట్ సౌతాఫ్రికా ప్లేయర్(35y 203d)గా బావుమా మరో రికార్డ్ నమోదు చేశాడు.
ఈరోజు ఏకంగా 11 మంది క్రికెటర్లు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, RP సింగ్, కరుణ్ నాయర్, అన్షుల్ కాంబోజ్, సుయాష్ ప్రభుదేశాయి, ఆండ్రూ ఫ్లింటాఫ్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ ఎర్విన్, హ్యారీ టెక్టర్ బర్త్డే జరుపుకుంటున్న వారిలో ఉన్నారు. దీంతో వీరందరినీ కలిపి నెటిజన్లు సరదాగా ‘బర్త్డే టీమ్’ అంటూ SMలో వైరల్ చేస్తున్నారు.
స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ల T20 సిరీస్లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో అతడు పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. దీంతో ఈ నెల 9 నుంచి జరగబోయే టీ20 సిరీస్లో ఆడటానికి మార్గం సుగమమైంది. అలాగే.. పాండ్యా, బుమ్రా కూడా ఈ సిరీస్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
విశాఖ వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ గడ్డపై వన్డేల్లో 7 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఓవరాల్గా అతడి వన్డే కెరీర్లో ఇది 23వ సెంచరీ. అలాగే, వికెట్ కీపర్లలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్గా సంగక్కర(23) సరసన నిలిచాడు.
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో స్మిత్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా 4219 పరుగులతో గ్రెగ్ చాపెల్(4209)ను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ అలన్ బోర్డర్(6623), పాంటింగ్(6542) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమవుతున్న ప్రసిద్ధ్ కృష్ణ చివరి వన్డేలో మాత్రం అదరగొడుతున్నాడు. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న బ్రీట్జ్కీ(24), గత మ్యాచ్ సెంచరీ హీరో మార్క్రామ్ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం SA 29 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమవుతున్న ప్రసిద్ధ్ కృష్ణ చివరి వన్డేలో మాత్రం అదరగొడుతున్నాడు. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న బ్రీట్జ్కీ(24), గత మ్యాచ్ సెంచరీ హీరో మార్క్రామ్ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం SA 29 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
విశాఖ వన్డేలో ‘బర్త్ డే బాయ్’ రవీంద్ర జడేజా(36 ఏళ్లు) తొలి వికెట్ తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ వైపు సాగుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను 48 పరుగుల వద్ద ఔట్ చేశాడు. బావుమా కొట్టిన షాట్ను బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. కాగా, జడేజాకు ఈ సిరీస్లో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం.
విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న వన్డేలో సౌతాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ క్వింటన్ డికాక్(57), బావుమా(32) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, డికాక్ భారత్లో ఇప్పటివరకు చేసిన ప్రతి హాఫ్ సెంచరీ(6)ని శతకంగా మలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 16 ఓవర్లలో 93/1 పరుగులు చేసింది.