దాదాపు 2 దశాబ్దాలపాటు రెజ్లింగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వెటరన్ రెజ్లర్, 17 టైమ్స్ WWE ఛాంపియన్ జాన్ సీనా రేపు తన చివరి మ్యాచ్ ఆడనున్నారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమయ్యే SNME ఈవెంట్లో గుంథర్తో తలపడనున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ‘Never Give Up’ అన్న స్ఫూర్తిని చాటిన జాన్ సీనా.. తన ‘Last Time is Now’ ఫేర్వెల్ టూర్ను గతేడాది జూలై 7న ప్రకటించారు.
T20లలో IND బ్యాటింగ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉంటోంది. SAతో T20 సిరీస్ ముందు కూడా కెప్టెన్ సూర్య.. బ్యాటర్లు 3-7 స్థానాలలో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. అన్నట్లుగా తొలి 2 మ్యాచులలో ప్లేయర్లతో ఆడించాడు. దీనిపై మాజీ ప్లేయర్ ఉతప్ప సూర్యకు చురకలు అంటిచాడు. T20WC ముందు అనుసరిస్తున్న ఈ విధానం సరికాదని, వికెట్లు పడినప్పుడు నిలకడగా ఆడే ప్లేయర్లను పంపించాలని సూచించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ భారత్కు చేరుకున్నారు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని కలవడానికే విరుష్క దంపతులు స్వదేశానికి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు.
కోల్కతాలో మెస్సీ ఈవెంట్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి.. టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. స్టేడియం మొత్తం గందరగోళంగా మారడంతో నిర్వాహకులు దిగివచ్చారు. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించారు. ఫ్యాన్స్ దెబ్బకు ఈవెంట్ ఆర్గనైజర్లు దిగిరాక తప్పలేదు.
అర్జెంటీనా క్రీడాకారుడు లియోనల్ మెస్సీ తన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. లేక్టౌన్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని ఆయన వర్చువల్గా ఆవిష్కరించారు. అనంతరం సాల్ట్లేక్ స్టేడియంలో అభిమానులను కలిశారు. మెస్సీతో కరచాలనం చేసి అభిమానులు ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు.
భారత్లో ఇవాళ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటించనున్నారు. HYDలోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ- సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీతో ఫొటో దిగేందుకు 10 లక్షలు చెల్లించాలనడంతో పలువురు AIని ఉపయోగిస్తున్నారు. మెస్సీతో తాము ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సి కోల్కతాకు చేరుకున్నాడు. 2011 తర్వాత ఈ స్టార్ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. కోల్కతా టూర్లో భాగంగా లేక్టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించనున్నారు. అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, షారుఖ్ ఖాన్, బెంగాల్ CM మమతలను కలుస్తారు. సాయంత్రం HYDకి చేరుకోనున్నారు.
భారత పర్యటనకు ఇవాళ అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ రానున్నారు. GOAT టూర్లో భాగంగా 3 రోజులు భారత్లో ఆయన పర్యటించనున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్నారు.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రసవత్తరంగ సాగుతోంది. తొలి మ్యాచ్లో టీమిండియా, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. ఈ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 ధర్మశాల వేదికగా ఆదివారం రోజున జరుగనుంది. అయితే.. గిల్, కెప్టెన్ సూర్యకుమార్ వరుసగా విఫలమవుతుండటం భారత జట్టును కలవరపెడుతోంది.
U-19 ఆసియాకప్లో UAEపై భారత్ 234 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, వైభవ్ సూర్యవంశీ (171) భారీ సెంచరీతో 433/6 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో, యూఏఈ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.
WTC(2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ ఒక డ్రా, మరో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో గతంలో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆరో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-2లో కొనసాగుతున్నాయి. కాగా, పాకిస్తాన్ 5వ ర్యాంక్లో ఉండి భారత్ కంటే ముందుంది.
టీమిండియాతో రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్పై సౌతాఫ్రికా గెలవడం ఇది 13వ సారి. దీంతో T20Iల్లో టీమిండియాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. గతంలో 12 విజయాలతో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పేరిట సంయుక్తంగా ఉండేది.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 433/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(171) సూపర్ సెంచరీ సాధించాడు. అలాగే, ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69), వేదాంత్ త్రివేది(38) రాణించారు. దీంతో U-19 క్రికెట్లో 21 ఏళ్ల క్రితం భారత్ చేసిన అత్యధిక పరుగుల(425) రికార్డును బ్రేక్ చేసింది.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఈఏతో టీమిండియాకు జరుగుతున్న మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి చేసి పెవిలియన్ చేరాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 40 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.