పొగ మంచు కారణంగా దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. 6:50 గంటలకు ఇన్స్పెక్ట్ చేసిన అంపైర్లు.. 7:30కు మరో సారి చూడనున్నట్లు తెలిపారు. అటు మూడో టీ20కి దూరమైన బుమ్రా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉన్నాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ కాలికి గాయం కావడంతో ఈ మ్యాచ్కి దూరమయ్యాడు.
లక్నో మైదానంలో ఫాగ్(పొగ) కారణంగా భారత్ vs సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. 6:50 గంటలకు ఇన్స్పెక్షన్ ఉంటుందని అంపైర్లు తెలిపారు.
AP: మహిళల వన్డే ప్రపంచ కప్లో రాణించిన క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ఆమెకు చెక్కును అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం వేలంలో కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్పై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో పవర్ హిట్టర్లు ఉన్నా.. నిఖార్సైన బౌలింగ్ యూనిట్ లేకపోవడంతో టీమ్ బలహీనంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్లో 300 స్కోర్ చేసినా.. ప్రత్యర్థిని కట్టడి చేసే బౌలర్లు లేరని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
WTA ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్ అవార్డును అర్యానా సబలెంకా గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని పొందడం ఈ బెలారస్ స్టార్కు వరుసగా ఇది రెండోసారి. యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్ చేరడం, సీజన్ను నంబర్ వన్గా ముగించడంతో.. సబలెంకాకు ఈ అవార్డు దక్కింది.
TG: కరీంనగర్ జిల్లా వెన్నంపల్లికి చెందిన 21 ఏళ్ల పేరాల అమన్రావుకు IPL జట్టులో చోటు లభించింది. రూ.30 లక్షలకు RR జట్టు తీసుకుంది. ప్రస్తుతం ఇతను HYD జట్టు తరఫున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో 160 స్ట్రైక్ రేట్తో రెండు అర్ధ సెంచరీలు చేశాడు.
అబుదాబీ వేదికగా జరిగిన IPL 2026 మినీ వేలం ముగిసింది. తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను కోల్కతా అత్యధిక ధర రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే అన్క్యాప్ట్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ను రూ.14.20 కోట్లకు CSK కొనుగోలు చేసింది.
అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మను రూ.14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్ర్ కొనుగోలు చేసింది. రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ.. పవర్ హిట్టింగ్కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్ల్లో 160.24 స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు.
IPL మినీ వేలంలో ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్స్టోన్ను సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్ల నుంచి వేలం మొదలు కాగా లివింగ్స్టోన్ గురించి లఖ్నవూ, హైదరాబాద్ పోటీపడ్డాయి. దీంతో చివరికి రూ.13 కోట్లకు SRH తీసుకుంది.