శ్రీలంక మహిళా జట్టుపై ఇప్పటికే తొలి 2 T20లను గెలిచిన భారత్.. 5 మ్యాచుల సిరీస్ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇవాళ తిరువనంతపురం వేదికగా మూడో T20లో లంకతో తలపడనుంది. అయితే సిరీస్ కాపాడుకునేందుకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రత్యర్థి జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో మిగిలిన 3 మ్యాచులూ(ఇవాళ, 28, 30) తిరువనంతపురంలోనే జరగనున్నాయి.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 51/4 కాగా.. క్రీజులో ఖవాజా(9), క్యారీ(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ టంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి 3 టెస్టుల్లో ఓడి యాషెస్ సిరీస్ కోల్పోయిన ENG.. పరువు కాపాడాకునేందుకు పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సిరీస్ గెలిచిన విజయోత్సాహం కంగారూల్లో కనిపించట్లేదు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న యాషెస్ 4వ టెస్టు కోసం ఆస్ట్రేలియా తాజాగా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ కమిన్స్కు విశ్రాంతినివ్వగా.. స్మిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు: స్మిత్(C), బోలాండ్, క్యారీ, డాగెట్, గ్రీన్, హెడ్, ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, మర్ఫీ, నాసర్, రిచర్డ్సన్, స్టార్క్, వెదరాల్డ్, వెబ్స్టర్.
ఇటీవల ముగిసిన SMATలో జార్ఖండ్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని జార్ఖండ్ ఫైనల్లో హర్యానాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే జార్ఖండ్ విజేతగా నిలవడంలో ధోనీ కీలక పాత్ర పోషించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం జాయింట్ సెక్రెటరీ షాబాజ్ నదీమ్ తెలిపారు. జార్ఖండ్ ప్లేయర్లకు ధోనీ మెంటర్గా విలువైన సూచనలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి ఎంపిక చేయాలని కాంగ్రెస్ MP శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వైభవ్ను చూస్తుంటే తనకు చిన్ననాటి సచిన్ను చూసినట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. సచిన్ తరహాలోనే వైభవ్ కూడా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. వైభవ్ భారత్ సీనియర్ జట్టుకు ఆడటాన్ని చూడటం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన SMలో పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియాలో టెస్టుల్లో విఫలమవుతున్న ENGతో పాటు, కోచ్ మెకల్లమ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెకల్లమ్ స్థానాన్ని రవిశాస్త్రితో భర్తీ చేయాలని ENG మాజీ ప్లేయర్ మాంటీ పనేసర్ ECBకి సూచించాడు. AUS బలహీనతలను ఆసరాగా తీసుకుని.. వారిని మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేవాళ్లను ENG కోచ్గా నియమించాలని, ఇందుకు రవి బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో సచిన్(60) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. ఆంధ్రాపై తన 58వ సెంచరీ చేసిన కోహ్లీ.. మరో 3 శతకాలు సాధిస్తే సచిన్ రికార్డు అతని సొంతమవుతుంది. ఇందుకు కోహ్లీ కనీసం 3 లిస్ట్-ఏ మ్యాచులు ఆడాల్సి ఉండగా.. అవి అడతాడా అనేది అనుమానమే. కాగా కోహ్లీ(53) ఇప్పటికే వన్డేల్లో సచిన్(49) సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
జాతీయ క్రీడా పురస్కారాల కోసం 2025 సంవత్సరానికి గాను సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క క్రికెటర్కు కూడా చోటు దక్కకోపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు.. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.
విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 300 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(131) అదరగొట్టాడు. సిక్కిం బౌలర్లలో నితీష్ 1, రాజు 1, సత్యనారాయణ 2, హేమంత్ 2 వికెట్లు పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కోహ్లీ 83 బంతుల్లో (101*) సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అంతకుముందు ఆంధ్ర 50 ఓవర్లలో 298/8 స్కోర్ సాధించింది.
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కోహ్లీ 83 బంతుల్లో (101*) సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. అంతకుముందు సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 237 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(155) అదరగొట్టాడు. సిక్కిం బౌలర్లలో క్రాంతి కుమార్, అంకుర్ తలో వికెట్ పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ చెలరేగాడు. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ 62 బంతుల్లో (100*) సెంచరీ చేశాడు. తొలుత సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 150/1 పరుగులతో ఉంది.
విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో మరో పరుగు చేస్తే.. లిస్ట్-ఏ క్రికెట్లో 16వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.