2025 ఏడాదికి గానూ విజ్డన్ తన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి రోహిత్, కోహ్లీలకు చోటు దక్కింది. మొత్తం 8 దేశాల నుంచి 11 మంది ఆటగాళ్లను విజ్డన్ ఎంపిక చేసింది. జట్టు: రోహిత్ శర్మ, జార్జ్ మున్సే, విరాట్ కోహ్లీ, షాయ్ హోప్, మాథ్యూ బ్రీట్జ్కే, మిలింద్ కుమార్, మిచెల్ సాంట్నర్(C), ఆదిల్ రషీద్, మ్యాట్ హెన్రీ, జేడన్ సీల్స్, అషిత ఫెర్నాండో.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 4 నుంచి యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్నఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. జట్టు: స్టోక్స్(C), బషీర్, బెతెల్, బ్రూక్, కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (wk), జోష్ టంగ్.
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జేసన్ గిలెస్పీ తాజాగా వెల్లడించాడు. 2024లో పాక్ కోచ్ పదవి నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందని ఒక నెటిజన్ ప్రశ్నించగా, గిలెస్పీ స్పందించాడు. ‘నాకు కనీస సమాచారం ఇవ్వకుండానే PCB అసిస్టెంట్ కోచ్ను తొలగించింది. ఇలాంటి ఎన్నో అవమానకర ఘటనలు ఎదురయ్యాయి’ అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నేనొక ముస్లింని, పాకిస్థాన్ నుంచి వచ్చిన నల్ల జాతీయుడిని. నేను ఆస్ట్రేలియా జట్టులో ఎప్పటికీ ఆడలేనని చాలామంది అన్నారు. కానీ, ఇప్పుడు నన్ను చూసి మీరూ సాధించవచ్చని నమ్ముతున్నా’ అని అన్నాడు.
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా భవిష్యత్పై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్లో భాగంగా త్వరలో జరగనున్న అయిదో టెస్ట్ అనంతరం ఖవాజా(39 ఏళ్లు) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వెల్లడించాడు. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ సందర్భంగా 8,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ సందర్భంగా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట రికార్డులు సృష్టిస్తోంది. తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ షేర్ చేసిన కేవలం 4 గంటల్లోనే 6.2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది. ప్రస్తుతం, ఇన్స్టాలో 274 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ భారత్లోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో షమీ ఆడనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న షమీ పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్షిప్ 2023 ఫైనల్ తర్వాత అతను ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశాడు. 50 ఓవర్లలో ముంబై 444/8 స్కోర్ చేసింది. ఉత్తరాఖండ్తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశాడు. పుదుచ్చేరితో మ్యాచులో కర్ణాటక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(132), దేవదత్ (113) శతకాల మోత మోగించారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. 40 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో (157) ఆకట్టుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో సెంచరీ చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(54) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన మార్టిన్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు సమాచారం. మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్న అతను చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడి సహచరుడు డారెన్ లేమన్ వెల్లడించాడు. మార్టిన్ తన క్రికెట్ కెరీర్లో 67 టెస్ట్ మ్యాచ్లు, 208 వన్డేలు ఆడాడు.
శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. టీ20 ప్రపంచకప్ ఇంకా సుదూర లక్ష్యమేనని తెలిపింది. జట్టుకు ప్రయోజనకరమైన ఆటతీరును కనబర్చేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తానని వెల్లడించింది. వన్డే విజయం జోష్ శ్రీలంక సిరీస్లో ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ విజయం ఉత్సాహం టీ20 ప్రపంచకప్లో కనిపించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ పేసర్ లసిత్ మలింగను తమ జట్టుకు కన్సల్టెంట్ పేస్ బౌలింగ్ కోచ్గా నియమించింది. భారత్తో పాటు సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో మలింగ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని SLC భావిస్తోంది. కాగా 2014 WC విజేతగా నిలిచిన అనంతరం.. గత 4 ఎడిషన్లలో లంక నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది.
శ్రీలంకతో 5వ T20లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 T20ల సిరీస్లో లంక క్లీన్ స్వీప్ అయ్యింది. 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు తరఫున హాసిని(65), ఇమేషా(50) అర్ధసెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అరుంధతి రెడ్డి (27*) అమన్జ్యోత్ (21), హర్లీన్ (13), కమలినీ (12) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు తీశారు.