న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదిన రోహిత్.. భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గిల్కు తోడుగా కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్లు అరుదైన రికార్డు సాధించారు. హెన్రీ నికోల్స్, డేవన్ కాన్వే కలిసి తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 1999లో భారత్పై కివీస్ ఓపెనింగ్ జోడీ నెలకొల్పిన 115 పరుగుల రికార్డు బద్దలైంది. కాగా, 1988లో ఆండ్రూ జోన్స్ – జాన్ రైట్ జోడీ సాధించిన 140 పరుగులే ఇప్పటివరకు భారత్పై అత్యధికం.
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ స్కోరు 200 పరుగులు దాటింది. 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతడికి తోడుగా బ్రేస్వెల్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీసుకోగా, హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు.
తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టుకు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణా డబుల్ షాక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీలతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డేవన్ కాన్వే (56)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 126 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విల్ యంగ్, డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు.
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు హెన్రీ నికోల్స్, డేవన్ కాన్వే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో కివీస్ 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో నికోల్స్ బతికిపోయాడు.
వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి చోటు దక్కలేదు. జట్టులో సుందర్, జడేజా, కుల్దీప్ స్పిన్నర్లుగా.. సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్ పేసర్లుగా ఆడుతున్నట్లు కెప్టెన్ గిల్ చెప్పాడు. ఈ కారణం చేతనే అతడికి తుది జట్టులో చోటు కల్పించలేకపోయినట్లు గిల్ స్పష్టం చేశాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ.. భారత్ తరఫున 309 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. సచిన్(463) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 443 పరుగులు చేస్తే… వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ ఈ ఘనతను 377 ఇన్నింగ్స్ల్లో సాధించగా… కోహ్లీ అంతకంటే తక్కువ ఇన్నింగ్స్ల్లోనే దీనిని బద్దలు కొట్టే అవకాశం ఉంది.
వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. IND కెప్టెన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చివరిసారిగా 2024 OCTలో టెస్ట్ సిరీస్ కోసం భారత్ వచ్చిన కివీస్.. INDను వైట్వాష్ చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని గిల్ సేన భావిస్తోంది. అటు భారత్లో ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా గెలవని కివీస్.. ఈ సారైనా సాధించాలనే పట్టుదలతో ఉంది.
న్యూజిలాండ్తో 3 వన్డేల సిరిస్కు రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. నిన్న బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పంత్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పంత్ ఈ సిరీస్ నుంచి వైదొలగాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ఆకట్టుకున్నాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా తొలి వన్డే జరగనుంది.
WPL 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కివెర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ 2.. హెన్రీ, శ్రీచరణి చెరో వికెట్ తీశారు.
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీతో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. కాగా, తొలి మ్యాచ్లో స్మృతి మంధాన టీమ్ చేతిలో ఓడిన హర్మన్ సేన.. ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ జట్టుపై విజయం సాధించాలని భావిస్తోంది.
WPL 2026లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం సాధించింది. తొలుత గుజరాత్ 207/4 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో యూపీ 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. లిట్చ్ఫీల్డ్ (78), లానింగ్ (30), శోభన (27*) శ్వేత (25) పరుగులు చేశారు. కీలక సమయంలో గుజరాత్ బౌలర్లు రాణించారు. రేణుక, జార్జియా, సోఫీ తలో రెండు వికెట్లు తీశారు.
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆష్లే గార్డెనర్ (65) హాఫ్ సెంచరీ చేసింది. అనుష్క శర్మ (44), సోఫీ డివైన్ (38), జార్జియా (27*) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు తీసింది.