WPLలో భాగంగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో RCB ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. బెత్ మూనీ (27), భారతి ఫుల్మలి (39), కష్వీ గౌతమ్ (18), తనూజ (21) రన్స్ చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు, లారెన్ 3 వికెట్లు పడగొట్టారు. RCB వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
నవీ ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్తరు స్కోర్ను ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాధా యాదవ్ 66, రీచా ఘోష్ 44 రన్స్తో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రేణుక 1, జార్జియా 1, కష్వీ గౌతమ్ 2, సోఫీ డెవినె 3 వికెట్లు పడగొట్టాడు.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలీబాగ్లోని రాయ్గఢ్లో 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.37.86 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
మహిళల ప్రిమియర్ లీగ్లో భాగంగా నవీ ముంబై వేదికగా RCBతో గుజరాత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్లో RCB ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. మరోవైపు గుజరాత్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచింది.
విశాఖలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. నేటి నుంచి మూడ్రోజులపాటు ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో 8 జట్లు తలపడనున్నాయి. ఇందులో జట్ల తరపున టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ, భోజ్పురి నటులు ఆడనున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రద్దీ సమస్యను పరిష్కరించేందుకు RCB సుమారు 300 నుంచి 350 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే రూ.4.5 కోట్ల ఖర్చును తామే పూర్తిగా భరిస్తామని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ మండలికి బెంగళూరు జట్టు ప్రతిపాదనలు పంపింది.
మహిళల ప్రిమియర్ లీగ్లో భాగంగా ఈరోజు RCBతో గుజరాత్ తలపడనుంది. నవీ ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో RCB ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. మరోవైపు గుజరాత్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో గెలిచింది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత్ ఓటమి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. అందరూ టీమిండియాదే విజయం అనుకున్నారని తెలిపాడు. న్యూజిలాండ్ను 270 పరుగులలోపే కట్టడి చేస్తుందనుకున్నట్లు చెప్పాడు. చాలా అలవోకగా భారత్ ఈ మ్యాచ్లో గెలుస్తుందని భావించినట్లు చెప్పుకొచ్చాడు.
భద్రత కారణాల నేపథ్యంలో భారత్లో టీ20 ప్రపంచకప్లో ఆడమని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అయితే, ఆ దేశ అంపైర్ మాత్రం భారత్లో విధులు నిర్వహిస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్లో షాహిద్ సైకత్ మూడో అంపైర్గా వ్యవహరిస్తున్నాడు. మొదటి వన్డేలో మూడో అంపైర్గా, రెండో మ్యాచ్లో టీవీ అంపైర్గా పనిచేశాడు.
WPLలో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన యూపీ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. హర్లీన్ డియోల్ (64*), లిచ్ఫీల్డ్ (25), మెగ్ లానింగ్ (25), ట్రయాన్ (27*) రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో బ్రంట్ 2, అమీలియా 1 వికెట్ పడగొట్టారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా యూపీతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సివర్ బ్రంట్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అమన్జ్యోత్ (38), కారే (32*) రాణించారు. యూపీ బౌలర్లలో శిఖ, దీప్తి, సోఫీ, ఆశ తలో వికెట్ పడగొట్టారు. యూపీ టార్గెట్ 162.
బంగ్లాదేశ్ ఆటగాళ్లపై BCB ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ నజ్ముల్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు రాజీనామా చేయకపోతే BPLతోపాటు అంతర్జాతీయ మ్యాచ్లను కూడా బహిష్కరిస్తామని ప్లేయర్లు హెచ్చరించారు. ఇవాళ BPL మ్యాచ్లోనూ టాస్ సమయానికి ప్లేయర్లు వేదిక వద్దకు రాలేదు. దీంతో ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి నజ్ముల్ను తొలగిస్తున్నట్లు BCB తెలిపింది.
అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ తేలిపోయాడు. కేవలం 2 పరుగులు చేసి రిత్విక్ అప్పిడి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో గెలిచి విజయాల ఖాతా తెరవాలని యూపీ భావిస్తోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.