టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ తన ఫామ్ వెనుకు ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. ‘క్రికెట్ దిగ్గజమైన సచిన్ నుంచి సలహాలు తీసుకున్నాను. స్పష్టతతో ఉండడం, మ్యాచ్కు సన్నద్ధమవ్వడం.. పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడ్డాయి. వరల్డ్కప్లో నేను గొప్పగా రాణించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.
T20WC విజయంపై భారత క్రికెటర్ సంజూ శాంసన్ స్పందించాడు. ‘నా దేశం కోసం గెలవాలి అనేది నా కల. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి రోజుల నుంచి పరిస్థితులను సానుకూలంగా చూడటానికి నేను ట్రైన్ అయ్యాను. సాధారణంగా బాధలు, ఎదురుదెబ్బలు నన్ను చాలా బలవంతుడిని చేశాయి. వాటిని సానుకూలంగా ఉపయోగించినట్లయితే, మీ జీవితంలో గొప్ప బలం అవుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా సౌతాఫ్రికా మాజీ దిగ్గజం గ్యారీ కిర్స్టన్ నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన T20 WC-2026లో శ్రీలంక జట్టు సూపర్-8 లోనే వెనుదిరిగింది. దీంతో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా చేశారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేయడంలో టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. అభిషేక్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇషాన్ కిషన్ స్పందింస్తూ.. ‘అరే భాయ్ నువ్వు కేవలం ఒక్క నెల మాత్రమే ఫామ్లో లేవు. నేను గత రెండేళ్లు జట్టులో లేను’ అని సరదా వ్యాఖ్యానించాడు.
పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. తాజాగా దీనిపై పాక్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు. ‘బంగ్లా సిరీస్ నుంచి బాబర్ను తప్పించలేదు. ఈ సిరీస్ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్తో పాటు అయూబ్, నసీమ్ కూడా జట్టులో లేరు’ అని క్లారిటీ ఇచ్చాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన T20 WC లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వ్యూయర్పిష్ పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. జియో హాట్ స్టార్లో 19వ ఓవర్లో కివీస్ చివరి వికెట్ సమయంలో 74.5 కోట్ల మంది ఏకకాలంలో లైవ్లో వీక్షించారు. మ్యాచ్ అనంతరం జరిగే ప్రైజ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసే సరికి 82.1 కోట్లకు చేరి రికార్డులను బద్దలు కొట్టింది.
T20 WCలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYD నుంచి T20 WC విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్లను TG ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టీమిండియాపై రోహిత్ శర్మ, కోహ్లీ ప్రశంసలు కురిపించారు. భారత జట్టులోని ప్రతిఒక్కరూ అద్భుతమైన ఆటతీరు కనబరిచారని రోహిత్ అభినందించాడు. అలాగే, మరోసారి ఛాంపియన్లుగా నిలిచామని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించాం. సంజూ శాంసన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడు. ఇంత ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మరెవరూ సరితూగలేరు’ అని కోహ్లీ కొనియాడాడు.
టీమిండియాపై దిగ్గజాలు సచిన్, గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఈ ట్రోఫీకి భారత క్రికెటర్లు పూర్తి అర్హులని సచిన్ కొనియాడాడు. క్రికెట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనకు టీమిండియా ఎప్పటికీ ఓ బ్రాండ్ అని కితాబిచ్చాడు. అలాగే, టీ20 ప్రపంచకప్లో 25 నుంచి 30 పరుగుల తేడాతో గెలిస్తేనే పెద్ద విజయంగా భావిస్తామని.. ఇది అంతకంటే అతి భారీ విజయం అని గవాస్కర్ పేర్కొన్నాడు.
T2O WC ముగిసిన నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ సైట్ ‘ESPN క్రిక్ఇన్ఫో’ టోర్నీ జట్టును ప్రకటించింది. ఇందులో ఐదుగురు భారత ప్లేయర్లు ఉండగా.. సూర్యకు, టోర్నీ టాప్ స్కోరర్ ఫర్హాన్(PAK)కీ చోటివ్వకపోవడం గమనార్హం.జట్టు: శాంసన్(WK), మార్క్రమ్(C), ఇషాన్, హెట్మెయిర్, దూబే, హార్దిక్, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, అదిల్ రషీద్, బుమ్రా, లుంగి ఎంగిడి, బ్లెసింగ్ బుజర్బానీ(12)
T20 WC విజయం తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తొలి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ప్లాన్ కూడా. ప్రతి ప్లేయర్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్’ అంటూ రాసుకొచ్చాడు. గంభీర్ తన పోస్టుకు జాతీయ జెండా, 3 ట్రోఫీలనూ జోడించాడు.
ICC ఈవెంట్స్లో గంభీర్కి అద్భుత రికార్డ్ ఉంది. నాకౌట్ పోరు ఏదైనా అటు ఆటగాడిగా ఇటు కోచ్గా అతనికే ఓటమే లేదు. ఆటగాడిగా T20 WC 2007 సెమీస్-ఫైనల్, వన్డే WC 2011 క్వార్టర్స్-సెమీస్-ఫైనల్లో విజయం అందుకున్నాడు. ఇక కోచ్గానూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్-ఫైనల్స్, T20 WC 2026 సెమీస్-ఫైనల్స్లో అజేయంగా నిలిచాడు.
✦ T20 WC ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీ పొందిన భారత ప్లేయర్గా కోహ్లీ(2014 & 16), బుమ్రా(2024) సమం✦ షాహీద్ అఫ్రిది(2009), కోహ్లీ(2014) తర్వాత సెమీస్ & ఫైనల్లో 50+ రన్స్ చేసిన ఆటగాడి రికార్డ్✦ T20 WCలో వరుసగా 3 50+ స్కోర్లు.. కోహ్లీ(2016-21), రాహుల్(2021) రికార్డ్ సమం.
T20 WC 2026 టోర్నీకి ముందు ఓ ఎడిషన్లో అత్యధిక రన్స్ చేసిన రికార్డ్ కోహ్లీ(2014లో 319) పేరిట ఉండేది. అయితే టోర్నీ ముగిసేసరికి కోహ్లీ రికార్డును ముగ్గురు బ్రేక్ చేశారు. ఈ ఎడిషన్ టోర్నీలో షాహిబ్జాదా ఫర్హాన్(PAK) 383, టిమ్ సీఫర్ట్(NZ) 326, సంజూ శాంసన్ 321 పరుగులు చేయడంతో.. ఈ లిస్టులో కోహ్లీ 4వ స్థానానికి దిగాడు. ఇషాన్ కిషన్, దిల్షాన్(SL) 317 పరుగులతో 5వ స్థానంలో ఉన్నారు.
★ ఉమెన్స్ U19 వరల్డ్ కప్ – 2025★ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025★ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ – 2025★ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ – 2025★ మెన్స్ U19 వరల్డ్ కప్ -2026★ మెన్స్ T20 వరల్డ్ కప్ – 2026