NZతో 3 వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. ఇవాళ మరో పోరుకు సిద్దమైంది. అయితే తొలి వన్డేలో గాయపడిన భారత స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ ఆయుష్ బదోనిని ఏరికోరి ఎంపిక చేసింది. దీంతో రెండో వన్డేలో అతడినే ఆడిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డికి మళ్లీ బెంచ్కే పరిమితం కానున్నట్లు సమాచారం.
ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అమన్జ్యోత్ కౌర్ 40, హర్మన్ప్రీత్ కౌర్ (71*) నికోలా కెరీ (38*) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, సోఫీ డివైన్ తలో వికెట్ పడగొట్టారు.
WPLలో భాగంగా ముంబై, గుజరాత్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్హామ్(43*), టాప్ స్కోరర్. కనిక(35), మూనీ(33) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు.
ఒలింపిక్స్ విజేత, ప్రముఖ బాక్సర్ మేరీకోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీకి జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం ఉండేదని తెలిపాడు. కుటుంబం సర్దిచెప్పినప్పటికీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని పేర్కొన్నాడు. దానికి ప్రూఫ్లు కూడా తన వద్ద ఉన్నాయన్నాడు. ఆమె ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుందని.. అందుకే విడాకులు తీసుకుందని అన్నాడు.
ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీపై భారత స్టార్ షట్లర్లు సింధు, లక్ష్యసేన్ గురిపెట్టారు. సొంతగడ్డపై ప్రతిష్ఠాత్మక టైటిల్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2010), కిదాంబి శ్రీకాంత్ (2015), సింధు (2017), లక్ష్యసేన్.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (2022) ఇండియా ఓపెన్లో విజేతలుగా నిలిచారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను అద్భుతమైన రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్తో రెండో వన్డేలో అతడు 34 పరుగులు చేస్తే భారత్ తరఫున అత్యంత వేగంగా 3000 పరుగుల చేసిన ప్లేయర్గా నిలుస్తాడు. అయ్యర్ ప్రస్తుతం వన్డేల్లో 68 ఇన్నింగ్స్ల్లో 2,966 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 72, కోహ్లీ 75 ఇన్నింగ్స్ల్లో 3 వేల పరుగుల ఫీట్ను సాధించారు.
యాషెస్ సిరీస్లో 1-4 తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే శ్రీలంక సిరీస్, అలాగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లపై బోర్డు కఠిన నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. ప్లేయర్లు పార్టీలు చేసుకోవడం, మద్యం సేవించడం, విహారయాత్రలకు వెళ్లడంపై నిషేధం విధించినట్లు సమాచారం.
తన కంటే ముందు ఆడుతున్న బ్యాటర్ ఔటైనప్పుడు ఫ్యాన్స్ చేసే హర్షధ్వానాలు తనకు నచ్చవని కోహ్లీ అన్నాడు. NZతో తొలి వన్డేలో రోహిత్ ఔటైన తర్వాత ఫ్యాన్స్.. కోహ్లీ వస్తున్నాడని సంతోషం వ్యక్తంచేశారు. ఇది తనకు సంతోషం కలిగించదని, ధోనీ విషయంలోనూ ఇలా జరగడం చూశానని పేర్కొన్నాడు. అభిమానుల ఎగ్జైట్మెంట్ అర్థం చేసుకోగలనని, వారు తన ఆటను చూడటం అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చాడు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే రేపు ప్రారంభం కానుంది. రాజ్కోట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, ఈ పోరులో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని కివీస్ భావిస్తోంది.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఈరోజు MI vs GG మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా జియోహాట్స్టార్ యాప్లో చూడవచ్చు. గతంలో ఈ జట్ల మధ్య 7 మ్యాచ్లు జరగ్గా అన్ని మ్యాచ్ల్లోనూ ముంబై విజయం సాధించింది. కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై RCB ఘన విజయం నమోదు చేసింది.
WPL 2026లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన RCB 12.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. గ్రేస్ హారిస్ (85), స్మృతి మంధాన (47*) రన్స్ చేశారు. యూపీ బౌలర్లలో షిఖా పాండే ఒక వికెట్ పడగొట్టింది.
WPL 2026లో భాగంగా బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్లో యూపీ వారీయర్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి (45*), డాటిన్ (40*) టాప్ స్కోరర్స్గా నిలిచారు. RCB బౌలర్లలో శ్రేయంక 2, నదైన్ 2, బెల్ 1 వికెట్ తీశారు. RCB టార్గెట్ 144.
టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికలపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. బంగ్లా మ్యాచ్ల వేదికల మార్పుకు సంబంధించి ఐసీసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఈ అంశంతో తమకు సంబంభం లేదని.. ఇది BCB, ICC మధ్య కమ్యూనికేషన్కు సంబంధించిన విషయమని తెలిపాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గుడ్న్యూస్ చెప్పాడు. తన ప్రియురాలు సోఫీ షైన్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘చిరునవ్వుల నుంచి కలల వరకు అన్నీ పంచుకున్నాం. చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం’ అని పోస్ట్ చేశాడు. ఈ మేరకు ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49)తో కలిసి ఓపెనర్గా వచ్చిన వైభవ్.. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్లో బిగ్ షాట్ ఆడే క్రమంలో థామస్ ర్యూకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.