టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో షమీ ఆడనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న షమీ పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్షిప్ 2023 ఫైనల్ తర్వాత అతను ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశాడు. 50 ఓవర్లలో ముంబై 444/8 స్కోర్ చేసింది. ఉత్తరాఖండ్తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశాడు. పుదుచ్చేరితో మ్యాచులో కర్ణాటక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(132), దేవదత్ (113) శతకాల మోత మోగించారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. 40 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో (157) ఆకట్టుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో సెంచరీ చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(54) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన మార్టిన్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు సమాచారం. మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్న అతను చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడి సహచరుడు డారెన్ లేమన్ వెల్లడించాడు. మార్టిన్ తన క్రికెట్ కెరీర్లో 67 టెస్ట్ మ్యాచ్లు, 208 వన్డేలు ఆడాడు.
శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. టీ20 ప్రపంచకప్ ఇంకా సుదూర లక్ష్యమేనని తెలిపింది. జట్టుకు ప్రయోజనకరమైన ఆటతీరును కనబర్చేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తానని వెల్లడించింది. వన్డే విజయం జోష్ శ్రీలంక సిరీస్లో ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ విజయం ఉత్సాహం టీ20 ప్రపంచకప్లో కనిపించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ పేసర్ లసిత్ మలింగను తమ జట్టుకు కన్సల్టెంట్ పేస్ బౌలింగ్ కోచ్గా నియమించింది. భారత్తో పాటు సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో మలింగ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని SLC భావిస్తోంది. కాగా 2014 WC విజేతగా నిలిచిన అనంతరం.. గత 4 ఎడిషన్లలో లంక నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది.
శ్రీలంకతో 5వ T20లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 T20ల సిరీస్లో లంక క్లీన్ స్వీప్ అయ్యింది. 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు తరఫున హాసిని(65), ఇమేషా(50) అర్ధసెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అరుంధతి రెడ్డి (27*) అమన్జ్యోత్ (21), హర్లీన్ (13), కమలినీ (12) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు తీశారు.
శ్రీలంక మహిళలతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా తడబడుతోంది. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ (28*), దీప్తిశర్మ(6*) క్రీజులో ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్న షెఫాలీ వర్మ(5) ఈ మ్యాచ్లో నిరాశపర్చింది. కమలినీ(12) LBWగా వెనుదిరిగింది. హర్లీన్ 13, రిచాఘోష్ 5 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమరి, కవిష, నిమష, రష్మిక తలో వికెట్ తీశారు.
భారత యువ బ్యాటర్ షెఫాలి వర్మ శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో అదరగొడుతుంది. చివరి టీ20లో షెఫాలి మరో 75 పరుగులు చేస్తే మహిళల Iటీ20 సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఈ సిరీస్లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది.
ICC టీ20 ర్యాంకింగ్స్లో భారత మహిళల స్టార్ బ్యాటర్ షెఫాలి వర్మ నాలుగు స్థానాలు ఎగబాకింది. తాజాగా ఆరో ర్యాంక్కు చేరుకుంది. స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతోంది. రిచా ఘోష్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్లో నిలిచింది. బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. శ్రీచరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి 52వ స్థానంలో నిలిచింది.
తన దృష్టిలో వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’ అని మాజీ క్రికెటర్ అశ్విన్ వెల్లడించాడు. అతడు జట్టుకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సాధించడంలో వరుణ్ కీలకపాత్ర పోషించబోతున్నాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా అతడు టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అని అశ్విన్ పేర్కొన్నాడు. నిజానికి అతడో ఆర్కిటెక్ట్ అని కితాబిచ్చాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా తమ ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ – 2025’ను ప్రకటించింది. ఈ జట్టులో భారత్, ఆస్ట్రేలియా నుంచి నలుగురు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమాను ఎంపిక చేశారు.జట్టు: KL రాహుల్, హెడ్, రూట్, గిల్, బవుమా(C), క్యారీ(wk), స్టోక్స్, స్టార్క్, బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, జడేజా
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఆమె మరో 62 పరుగులు చేస్తే, 2025లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె అన్ని ఫార్మాట్లలో కలిపి 1,703 పరుగులు చేసింది. ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ఆమె 62 పరుగులు చేస్తే.. గిల్(1,764 పరుగులు) రికార్డును అధిగమిస్తుంది.