WPL-2026 మెగా వేలంలో భారత ఆల్రౌండర్ శిఖా పాండే కోసం RCB, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు రూ.2.40 కోట్లతో ఆమెను యూపీ దక్కించుకుంది. సంజీవన్ సంజనను రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకున్నారు. పుజా వస్త్రాకర్కు రూ.85 లక్షలకు RCB కొనుగోలు చేసింది. తానియా భాటియాను రూ.30 లక్షలకు, లక్కీ హమిల్టన్ను రూ.10 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో భారత స్టార్ ఓపెనర్ ప్రతికా రావల్కు బిగ్ షాక్ తగిలింది. ఈ వేలంలో ఆమె అమ్ముడుపోలేదు. ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ప్రతికాపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయమైంది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాట్ అయ్యింది. దీంతో భారత ప్లేయర్ల ఆట తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనందుకు క్షమించాలని అభిమానులకు కోరాడు. ‘భారత్కు ప్రాతినిధ్యం వహించడం మాకు గొప్ప గౌరవం.. బలంగా, మెరుగ్గా తిరిగి రావడానికి కష్టపడతాం’ అని వెల్లడించాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో పలువురు అన్క్యాప్డ్ బ్యాటర్లకు నిరాశ ఎదురైంది. ప్రణవి చంద్ర, వింద్రా దినేశ్, దిశా కసత్, అరుషి గోయెల్, డెవినా ఫెరిన్ అన్సోల్డ్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్తో పాటు ప్రియా మిశ్రా, అమండా-జాడే వెల్లింగ్టన్, సైకా ఇషాన్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
WPL-2026 మెగా వేలంలో కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్పాట్ తగిలింది. RCBతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ ఆమెను రూ.1.1 కోట్లకు దక్కించుకుంది. అలాగే, తెలుగమ్మాయి జి.త్రిషకు నిరాశ ఎదురైంది. ఆమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సైతం అన్సోల్డ్ అయ్యింది.
WPL మెగా వేలంలో భారత బౌలర్ క్రాంతి గౌడ్ తిరిగి యూపీకి ఆడనుంది. RTM కార్డు ఉపయోగించి రూ.50 లక్షలకు యూపీ జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ లారెన్ బెల్ను రూ.90 లక్షలకు RCB కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ను రూ.60 లక్షలకు ముంబైకి దక్కించుకుంది. భారత బౌలర్ టిటాస్ సాధును రూ.30 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.
WPL మెగా వేలంలో భారత ఆల్రౌండర్ రాధా యాదవ్ను RCB రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. హార్లీన్ డియోల్ను బేస్ ధర రూ.50 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వికెట్ కీపర్లు ఈజీ గేజ్, అమీ జోన్స్తో పాటు భారత వికెట్ కీపర్ ఉమా ఛెత్రి అన్సోల్డ్ అయ్యారు. లిజెల్ లీ (సౌతాఫ్రికా)ను కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ జట్టులోకి తీసుకున్నారు.
WPL-2026 మెగా వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ హెన్రీని రూ.1.30 కోట్లకు ఢిల్లీ తీసుకుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ నడిన్ డ్ క్లెర్క్ రూ.65 లక్షలకు RCBలోకి తీసుకున్నారు. కిరణ్ నవ్గిరే కోసం RTM కార్డు ఉపయోగించి రూ.60 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. భారత ప్లేయర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
WPL-2026 మెగా వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి కోసం ఢిల్లీ, యూపీ పోటీపడ్డాయి. చివరకు రూ.1.30 కోట్లతో ఢిల్లీ దక్కించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ను యూపీ వారియర్స్ రూ.1.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది. భారతి ఫుల్మాలిని RTM కార్డు ఉపయోగించి రూ.70 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.
WPL-2026 మెగా వేలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రపంచకప్ క్వీన్ దీప్తి శర్మ కోసం హైడ్రామా నడిచింది. ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ పోటీ పడగా.. ‘RTM’ కార్డ్ ఉపయోగించి యూపీ రూ.3.20 కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది. ఈ ధరతో WPLలో ఇప్పటివరకు రెండో అత్యధిక ధర కలిగిన ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మంధానను RCB రూ.3.4 కోట్లకు దక్కించుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9న ప్రారంభంకానుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో ఈ మ్యాచ్లు జరగనున్నాయని వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.