తిరువనంతపురంలో జరిగిన 4వ T20లో శ్రీలంకపై భారత్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 191/5 స్కోరుకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో చమరి(52) పరుగులతో రాణించగా.. భారత్ తరఫున వైష్ణవి, అరుంధతి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత ఓపెనర్లు స్మృతి 80, షెఫాలీ 79 పరుగులతో రాణించగా.. చివర్లో రిచా( 16 బంతుల్లో 40*) రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. దీంతో భారత్ తరఫున మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచింది. ఓవరాల్గా మహిళా క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కింది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అదరగొడుతోంది. గత రెండు మ్యాచ్ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో మెరిసిన ఆమె, తాజాగా నాలుగో టీ20లోనూ ఆ జోరును కొనసాగించింది. కేవలం 30 బంతుల్లోనే అర్ధ శతకాన్ని బాదిన షఫాలీ, ఈ సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 35 (18 బంతుల్లో), స్మృతి మంధాన 26 (15 బంతుల్లో) పరుగులతో దంచికొడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే భారత్ భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది.
మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్, జేఎస్డబ్ల్యూ సూర్మ హాకీ క్లబ్, శ్రచి బెంగాల్ టైగర్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే తొలి మ్యాచ్లో రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్ జట్లు తలపడనున్నాయి. జనవరి 10న జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది.
కోచ్గా గంభీర్ను తొలగించనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. కోచ్ మార్పు కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. గంభీర్పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఒప్పందం ప్రకారం 2027 ODI WC వరకు ఆయనే కోచ్గా కొనసాగుతారని తేల్చి చెప్పారు.
టీమిండియా కొత్త ఏడాదిని న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్కు భారత్ త్వరలోనే తమ జట్టును ప్రకటించనుంది. అయితే, ఈ సిరీస్కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ స్టేడియంలోనే గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి వరకు స్టేడియంలో ఎంతో చురుగ్గా ఉన్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఢాకా క్యాపిటల్స్, రాజ్షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.
బాలీవుడ్ ‘కండలవీరుడు’ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ బర్త్ డే పార్టీలో దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి పాల్గొని సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, ధోనీలను ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు SM వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో అరుదైన రికార్డు సాధించాడు. 2025 క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గిల్ 7 సెంచరీలతో 1,764 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్(1,760) రెండో స్థానంలో, ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్(1,598) మూడో స్థానంలో నిలిచాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి పిచ్పై మ్యాచ్ నిర్వహించినందుకు ఆస్ట్రేలియాను కచ్చితంగా తప్పుపట్టాలని అన్నాడు. ‘భారత్లో ఇలా వికెట్లు పడితే అందరూ విమర్శలు గుప్పిస్తారు.. మరి ఇప్పుడు మెల్బోర్న్ పిచ్పై ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నించాడు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు GATE 2023/24/25 స్కోర్ గలవారు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.