ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 18.5 ఓవర్లలోనే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. KKR విజయంలో మనీష్ పాండే(45), రోవ్మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు. MI బౌలర్లు బాష్ 3 వికెట్లు పడగొట్టగా.. చాహార్, బూమ్ర, గజన్ఫర్ ఒక్కో వికెట్ తీశారు.
IPLలో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. లీగ్లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి, 6 లేదా అంతకంటే తక్కువ ఎకానమీ రేటు నమోదు చేయడం నరైన్కు ఇది 80వ సారి(178 స్పెల్స్లో). ఈ ఆల్టైమ్ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 48.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. నరైన్ 45.2 శాతంతో రెండో స్థానంలో, డేల్ స్టెయిన్ 45.0 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 147/8 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 26, తిలక్ వర్మ 20, సూర్యకుమార్ యాదవ్ 15, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. చివర్లో బోష్ 32* రన్స్తో సత్తా చాటాడు. KKR బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తిక్ త్యాగి తలో 2 వికెట్లు పడగొట్టారు.
IPL క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టికెట్ల దందాకు తెరలేపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా అభిమానులను మోసం చేస్తున్న ఈ ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక అడ్వైజరీ జారీ చేసింది. అనధికారిక ఏజెంట్ల వద్ద టికెట్లు కొని మోసపోవద్దని, కేవలం అధికారిక ప్లాట్ఫామ్స్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.
IPL చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లుగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 280 మ్యాచ్లతో రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో MS ధోని (278 మ్యాచ్లు), రవీంద్ర జడేజా (265 మ్యాచ్లు), దినేష్ కార్తిక్ (257 మ్యాచ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా భారీ వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. గ్రౌండ్స్టాఫ్ హుటాహుటిన పిచ్, అవుట్ఫీల్డ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఆట నిలిచే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్కు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఫిదా అయ్యాడు. ఐపీఎల్లో వైభవ్ ఆడుతున్న తీరు అద్భుతమని కొనియాడిన యువీ.. భవిష్యత్తు స్టార్ అయిన అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి సూచించాడు.
IPL 2026లో భాగంగా KKRతో జరుగుతున్న మ్యాచ్లో MI కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై.. కేవలం 9 బంతుల వ్యవధిలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభం కోసం ప్రయత్నించిన ఓపెనర్ రోహిత్ శర్మ (15) వెనుతిరిగాడు. KKR బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు తీయగా.. సౌరబ్ దుబే ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘BCCI’ 2026-27 ఏడాదికి గాను 1,788 మ్యాచ్లతో కూడిన భారీ దేశీయ సీజన్ను ప్రకటించింది. ఆగస్టు 23న దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో పురుషుల, మహిళల విభాగాల్లో వివిధ వయోపరిమితి టోర్నీలు జరగనున్నాయి. రెడ్-బాల్ క్రికెట్కు పెద్దపీట వేస్తూ.. రంజీ ట్రోఫీని రెండు దశల ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన KKR vs MI మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్ను కవర్స్తో కప్పి ఉంచడంతో టాస్ పడటం ఆలస్యమైంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న కేకేఆర్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా, ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం తగ్గితే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ నిర్వహించే అవకాశముంది.
CSKతో మ్యాచ్లో DC స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిస్సంక(19), రాహుల్(12), నితీష్(13), కరుణ్(13) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్(38), రిజ్వీ(40*) కలిసి 6వ వికెట్కు 65 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. దీంతో DC 155/7 పోరాడే స్కోరు సాధించింది. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
CSKతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న DC బ్యాటింగ్లో తడబడుతోంది. ఓపెనర్లు నిస్సంక (19), రాహుల్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కరుణ్ నాయర్ (13) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అనంతరం నితీష్ రాణా (13) సైతం ఔట్ కావడంతో ఢిల్లీ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
SRH హెడ్ కోచ్ డేనియల్ వెటోరి గుడ్ న్యూస్ చెప్పాడు. గాయంతో KKR మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపాడు. రేపు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో నితీష్ బరిలోకి దిగబోతున్నట్లు వెటోరి స్పష్టం చేశాడు. గత మ్యాచ్లో నితీష్ స్థానంలో ఆడిన స్మరణ్ రవిచంద్రన్(4) ఆకట్టుకోలేకపోయాడు.