రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇరు జట్లు 194 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ దిగిన టీమిండియా ప్లేయర్లు జితేష్ శర్మ, అశుతోష్ శర్మ డకౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లా ప్లేయర్ యాసిర్ అలీ డకౌట్ కాగా.. రెండో బంతి వైడ్ వెళ్లడంతో బంగ్లాదేశ్ ఫైనల్కు దూసుకెళ్లింది.
ఉత్కంఠ భరితంగా సాగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్-1 మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కూడా 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలనుంది.
ఉత్కంఠ భరితంగా సాగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్-1 మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కూడా 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలనుంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గంభీర్ BJP ఎంపీగా ఉన్న సమయంలో కొవిడ్ మందులను అక్రమంగా నిల్వ చేసినట్లు అతడిపైన, ఫౌండేషన్ ట్రస్టీలైన గంభీర్ భార్య నటాషా, తల్లి సీమా, కంపెనీ సీఈవోలపై ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ 39 ఓవర్లలో 123/9 గా ఉంది. ఆసీస్ జట్టు ఇప్పటికీ 49 పరుగుల వెనకంజలో ఉంది. అంతకముందు బౌలింగ్లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 7 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత వైద్య పరీక్షల రిపోర్ట్స్ ప్రకారం.. గాయం పూర్తిగా తగ్గేవరకు కడుపుపై ఒత్తిడి పెంచే ఏ విధమైన శిక్షణనూ మరో నెల పాటు చేయకూడదని వైద్యులు సూచించారు. దీంతో రాబోయే SA, NZలతో జరిగే వన్డే సిరీస్లకు రావడం కష్టమే. కాగా OCT 25న ఆసీస్తో 3వ వన్డేలో గాయపడ్డ సంగతి తెలిసిందే.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా తొలి సెమీస్లో టీమిండియా-A, బంగ్లా-A జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ బలంగా కనిపిస్తుండగా.. బంగ్లా మాత్రం బౌలింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దీంతో బంగ్లాకు ఈ పోరు కొంత సవాలుగా మారే అవకాశం ఉంది.
యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. 31 పరుగులకే నలుగురు ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో హెడ్(1), గ్రీన్(0) ఉండగా.. వెదర్లాండ్(0), లబుషేన్(9), స్మిత్(17), ఖవాజా(2) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, కార్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ బ్యాటర్లు కూడా తడబడి 172 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే.
భారత T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ నెల 26 నుంచి జరగనున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ఆడనున్నాడు. T20WC 2026 సన్నాహాల దృష్ట్యా SKY ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తమ జట్టు ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఆటకు దూరం కావడంతో.. సారథ్య బాధ్యతలను SKY చేపట్టనున్నాడు. అటు శివమ్ దూబే కూడా అందుబాటులో ఉండనున్నట్లు ముంబై జట్టు వర్గాలు తెలిపాయి.
గౌహతి టెస్టుకు ముందు యశస్వీ జైస్వాల్కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచన చేశాడు. ఈగో పక్కన పెట్టి కొంచెం టైం తీసుకొని ఆడాలని సూచించాడు. 3 ఫార్మాట్లలోనూ లెఫ్టార్మ్ బౌలర్లపై యశస్వీ ఆడలేకపోతున్నాడని, లోపాలు అంగీకరిస్తేనే మెరుగుపరుచుకోగలమని పేర్కొన్నాడు. కాగా తొలి టెస్టు 2 ఇన్నింగ్సుల్లోనూ యశస్వీ SA లెఫ్టార్మర్ యాన్సెన్కే వికెట్ అప్పగించుకున్నాడు.
పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో స్టోక్స్ సేన 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో పోప్(46), బ్రూక్(52) మినహా ఎవరూ రాణించలేదు. అటు ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు పడగొట్టగా.. డెబ్యూ ప్లేయర్ డాగెట్ 2 వికెట్లు తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి యాషెస్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు కుప్పకూలుతోంది. దీంతో 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ బ్యాటర్లలో పోప్(46), బ్రూక్(52) మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం జేమీ స్మిత్(28), కార్స్(0) క్రీజులు ఉన్నారు. అటు ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లతో తన మార్క్ చూపించాడు.
ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి యాషెస్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు కుప్పకూలుతోంది. దీంతో 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ బ్యాటర్లలో పోప్(46), బ్రూక్(52) మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం జేమీ స్మిత్(28), కార్స్(0) క్రీజులు ఉన్నారు. అటు ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లతో తన మార్క్ చూపించాడు.
భారత టెస్ట్ జట్టులో వన్ డౌన్ బ్యాటర్ను తరచూ మారుస్తుండటంపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. ENGపై కరుణ్ నాయర్, WIపై సాయి సుదర్శన్, ఇప్పుడు SAపై వాషింగ్టన్ సుందర్.. ఇలా 3వ స్థానంపై గందరగోళం ఎందుకని ప్రశ్నించాడు. ఈ స్థానంలో సుందర్ను కొనసాగించాలని భావిస్తుంటే సుదర్శన్, నాయర్తో సమయం ఎందుకు వృథా చేశాడని నిలదీశాడు.