ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని MIకాపాడుకుంది. ఈ ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. కారుణ్ నాయర్ (89) పరుగులు చేసినప్పటికీ ఢిల్లీకి ఫలితం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఢిల్లీకి ఇది తొలి ఓటమి
PBKSతో జరిగిన మ్యాచ్లో SRH ఘన విజయం సాధించింది. తొలుత PBKS నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం SRH 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 141 పరుగులతో విజృభించాడు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ మొదటి వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏ దశలోనూ PBKS బౌలర్లు SRH బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ మోస్తరు స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఓ దశలో 200 ప్లస్ పరుగులు చేసేలా కనిపించినా.. LSG బౌలర్లు వరుస వికెట్లతో స్కోరును కట్టడి చేశారు. గిల్, సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. శార్దూల్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. LSG టార్గెట్ 181.
IPLలో GT బ్యాటర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డును సాధించాడు. IPLలో మొదటి 30 ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. అతడు 30 ఇన్నింగ్స్ల్లో 1307 పరుగులు చేశాడు. ఓవరాల్గా చూస్తే రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో షాన్ మార్ష్-1338 పరుగులతో కొనసాగుతున్నాడు. తర్వాత స్థానాల్లో గేల్(1141), విలియమ్సన్(1096), హేడెన్(1082) ఉన్నారు.
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. RR 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో GTకి ఈ విజయం దక్కింది. ప్రసిద్ధ్ 3 వికెట్లు పడగొట్టాడు. కిశోర్, రషీద్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్, కుల్వంత్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటర్లలో హిట్మెయిర్(52), సంజూ(41) రాణించిన ఫలితం దక్కలేదు.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తిలక్(52) హార్దిక్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. సిక్సర్తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తీ చేసుకోవడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి RCB.. 100/2 పరుగులు చేసింది. పటీదార్ 3, కోహ్లీ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ముంబై స్టార్ పేసర్ బుమ్రా దాదాపు మూడు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నేడు RCBతో జరగనున్న మ్యాచ్లో ఆడతాడని MI కోచ్ జయవర్ధనె ఇప్పటికే వెల్లడించాడు. ఈ క్రమంలోనే RCB ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసే తొలి బంతిని తమ ఓపెనర్లు ఫోర్ లేదా సిక్స్ కొడతారని తెలిపాడు. కాగా, టిమ్ డేవిడ్ గతేడాది MI తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
KRNL: ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభలకు వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77), పొరేల్ (33), అక్షర్ పటేల్ (21), రిజ్వీ (20), స్టబ్స్ (24) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 183/6 పరుగులు చేసింది. ఇక CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. CSK టార్గెట్ 184.
IPL 2025లో భాగంగా సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్య కుమార్ (67), నమన్ధీర్ (46), తిలక్ వర్మ(25) పరుగులు చేశారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్కు గురయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తృటిలో సెంచరీ చేజారిపోయిందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.
టాప్ ర్యాంక్ ఆటగాళ్ల పేర్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా, టీ20ల్లో నెంబర్ వన్ ఆల్రౌండర్గా హార్థిక్ పాండ్య స్థానం దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరణం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్లాండ్లో ఓ విల్లాలో వార్న్ చనిపోగా.. అందుకు గుండెపోటు కారణమని భావించారు. తాజాగా ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఘటనాస్థలంలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఔషధ బాటిల్ లభ్యమైనట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. దానిని అక్కడనుంచి తొలగించాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు.
విశాఖ: జిల్లాలో ఇదే నా తొలి మ్యాచ్ అంటూ నితీశ్ కుమార్ రెడ్డి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నేను విశాఖ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఆడాను. కానీ వేలాది మంది క్రీడాభిమానుల మధ్య ఆడడం ఇదే తొలిసారి. తెలుగు ఫ్యాన్స్ నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూస్తున్నారు. మీరు మా దగ్గరి నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేందుకు కృషి చేస్తాం.