విశాఖ వేదికగా శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో విష్మి(39) రాణించగా, మిగిలిన వారు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. క్రాంతి, దీప్తి, శ్రీ చరణి తలో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత క్రికెట్ మానేయాలనుకున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. అయితే, తుది మెట్టు మీద బోల్తా పడటంతో తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య విశాఖ వేదికగా తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.IND: స్మృతి, షఫాలీ, జెమీమా, హర్మన్ప్రీత్(C), రిచా(w), దీప్తి, అమంజోత్, అరుంధతి, వైష్ణవి, క్రాంతి, చరణిSL: గుణరత్నే, అతపత్తు(సి), హాసిని, హర్షిత, నీలాక్షి, కౌషని(w), కవిషా, మల్కీ, ఇనోకా, కావ్య, శశిని
దుబాయ్ వేదికగా జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. పాక్ బౌలర్ల ధాటికి కేవలం 26.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (26), ఆయూష్ మాత్రే (2) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, ఆసియా కప్ను కైవసం చేసుకుంది.
U19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. పాక్ బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ స్కోరుకు భారత్ ఇంకా 247 పరుగులు వెనుకబడి ఉంది. పాక్ బౌలర్లలో అలీ రజా 3 వికెట్లతో చెలరేగగా, సయ్యం, అబ్దుల్ సుభాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రస్తుతం క్రీజులో ఖిలాన్, హెనిల్ ఉన్నారు.
U19 ఆసియా కప్ ఫైనల్లో భారత్కు భారీ షాక్ తగిలింది. 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 49 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. సూర్యవంశీ, ఆయూష్ మాత్రే కలిసి తొలి ఓవర్లోనే 21 పరుగులు రాబట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో వైభవ్ (26), మాత్రే (2), ఆరోన్ జార్జ్ (16) ఔటయ్యారు. ప్రస్తుతం విహాన్, వేదాంత్ క్రీజులో ఉన్నారు.
T20 WCకు ఎంపికైన సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో సత్తా చాటి, భారత వన్డే జట్టులోనూ సుస్థిర స్థానం దక్కించుకోవాలని సంజూ భావిస్తున్నాడు. కాగా, ఇప్పటివరకు భారత్ తరఫున 16 వన్డేలు ఆడిన సంజూ.. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 510 పరుగులు సాధించాడు.
యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఈ ఓటమి జట్టులోని ప్రతి ఒక్కరినీ తీవ్రంగా బాధిస్తోందని తెలిపాడు. యాషెస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటికీ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో తమ కంటే మెరుగ్గా రాణించిందని పేర్కొన్నాడు.
క్రికెట్ను గౌరవించినందుకు ప్రతిఫలంగానే ఇషాన్ కిషన్కు తిరిగి జట్టులో చోటు దక్కిందని అశ్విన్ పేర్కొన్నాడు. జట్టు నుంచి దూరమైనా నిరాశ చెందకుండా బుచ్చిబాబు ట్రోఫీ, రంజీ, ముస్తాక్ అలీ వంటి టోర్నీల్లో ఆడి పరుగుల వరద పారించాడని కొనియాడాడు. ఎంతటి పెద్ద ఆటగాడైనా ఫస్ట్క్లాస్ క్రికెట్లో రాణించాల్సిందే అనే సందేశాన్ని సెలక్టర్లు దీని ద్వారా ఇచ్చారని పేర్కొన్నాడు.
టీమిండియాతో జరుగుతున్న U19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 347/8 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సమీర్ మిన్హాస్ (172) భారీ శతకంతో విజృంభించగా, అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.
మెన్స్ U19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్(104*) సెంచరీ చేశాడు. 71 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్లతో 100 రన్స్ పూర్తి చేసుకున్నాడు. టోర్నీలో అతనికి ఇది రెండో సెంచరీ కాగా.. 29 ఓవర్లలో పాక్ స్కోర్ 193/2గా ఉంది. క్రీజులో మిన్హాస్తోపాటు అహ్మద్ హుసేన్(27) ఉన్నాడు. అటు భారత బౌలర్లలో హెనిల్, ఖిలన్ చెరో వికెట్ తీశారు.
యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా మూడో టెస్టులోనూ విజయంతో యాషెస్ సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంది. 435 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 352 పరుగులకు ఆలౌటయ్యింది. రెండు ఇన్నింగ్స్లలో ఆస్ట్రేలియా 371, 379, ఇంగ్లాండ్ 286, 352 పరుగులు చేశాయి.
WIతో 3వ టెస్టులో కివీస్ ప్లేయర్ డెవాన్ కాన్వే రఫ్ఫాడిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ(227) చేసిన అతను 2వ ఇన్నింగ్స్లోనూ 100* చేశాడు. కాగా IPL వేలంలో అతణ్ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం తర్వాతి రోజు నుంచే జరుగుతున్న ఈ టెస్టులో కాన్వే తన సత్తా చూపించాడు. ఇక టీ బ్రేక్ సమయానికి NZ వికెట్ పడకుండా 192 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ NZ 575/8d; WI 420