భారత్, సౌతాఫ్రికా మధ్య లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అభిమానులు.. టికెట్ల సొమ్ము రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ తాజాగా స్పందించింది. టికెట్ల సొమ్ము రీఫండ్ అంశం రాష్ట్రాల క్రికెట్ సంఘాల పరిధిలోకి వస్తుందని బీసీసీఐ కార్యదర్శి సైకియా పేర్కొన్నారు.
భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దుకు పొగ మంచు కారణం కాదని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. గాలి కాలుష్యం వల్లే మ్యాచ్ రద్దయ్యిందని చెప్పారు. ‘ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు లక్నోకు చేరుకుంది. అందుకే లక్నోలో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుకు మంచు కారణం కాదు. విషపూరితమైన గాలి కాలుష్యం’ అని అన్నారు.
SMAT-2025 ఛాంపియన్గా జార్ఖండ్ జట్టు నిలిచింది. హర్యానాతో జరిగిన ఫైనల్లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి ఈ టీ20 ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్(101) అదరగొట్టాడు. బౌలర్లలో సుశాంత్, బాలకృష్ణ 3 వికెట్లు పడగొట్టగా.. వికాష్, అనుకుల్ తలో రెండు వికెట్లు తీశారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా పుణె వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో జార్ఖండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 చేసింది. ఇషాన్ కిషన్(101), కుమార్ కుష్రంగా (81), అంకుల్ రాయ్(40*) రాణించారు. హర్యానా బౌలర్లు కాంబోజ్, సుమిత్, సమంత్ జాకర్ తలో వికెట్ తీశారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా పుణె వేదికగా హర్యానా, జార్ఖండ్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 45 బంతుల్లో(101*) సెంచరీతో అదరగొట్టాడు. మరో ఆటగాడు కుమార్ కుష్రంగా (76*) కూడా సెంచరీకి చెరువలో ఉన్నాడు.
రోల్బాల్ వరల్డ్ కప్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతగా నిలిచాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత పురుషుల జట్టు, మహిళల జట్టు ప్రపంచకప్ టైటిల్స్ను ముద్దాడాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో కెన్యాపై భారత పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించింది. ఇది పురుషుల జట్టుకు 5వ ప్రపంచ కప్. కెన్యాపై మహిళల జట్టు3-2 తేడాతో మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా పుణె వేదికగా ఇవాళ హర్యానా, ఝార్ఖండ్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హర్యానా బౌలింగ్ ఎంచుకుంది. ఇంతవరకు ఈ రెండు జట్లు ఈ టీ20 ట్రోఫీని గెలవలేదు. మరీ ఈ ఏడాది ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.
IND vs SA జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాడు. ఇకపై మ్యాచ్లు జరిగే వేదికల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, మళ్లి ఇలాంటి పొరపాట్లు జరగకుంగా చూస్తామన్నాడు. కాగా, స్టేడియంలో పొగమంచు అధికంగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
అంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే IND vs SA నాలుగో టీ20 రద్దయిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ల నిర్ణయం నాకు ఆశ్చర్యానికి కలిగించింది. రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే.. సమయం గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఎలా అనుకుంటున్నారు?’ అని మండిపడ్డాడు. కాగా, పొగమంచు కారణంగా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
WIతో 3వ టెస్టులో NZ ఓపెనర్లు సెంచరీలతో రఫ్పాడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి NZ ఒకే వికెట్ కోల్పోయి 334 రన్స్ చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ 137 రన్స్ వద్ద ఔట్ కాగా.. డెవాన్ కాన్వే(178), జాకబ్ డఫ్ఫీ(9) అజేయంగా నిలిచారు. లాథమ్-కాన్వే తొలి వికెట్కు అత్యధికంగా 323 పరుగుల భాగస్వామ్యంతో 1930 నాటి స్టీవీ డెంప్స్టర్-జాకీ మిల్స్(276 vs ENG) రికార్డూ బ్రేక్ చేశారు.
యాషెస్ 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంత్ ఇంగ్లండ్ 168 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. ఇంకా 203 రన్స్ వెనుకంజలో ఉంది. ప్రస్తుతం కార్స్(0), స్టోక్స్(31) క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్రూక్(45) మినహా ఎవరూ పెద్దగా నిలబడలేకపోయారు. ఇప్పటికే తొలి 2 టెస్టులో ఓడిన ఇంగ్లండ్కి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. లేదంటే సిరీస్ ఆసీస్ సొంతమవుతుంది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బెంగళూరులో జరిగిన ఓ మొబైల్ కంపెనీ ప్రోగ్రాంకు హాజరై సరదాగా కనిపించింది. ఆ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పెళ్లి రద్దు అంశం నుంచి త్వరగా కోలుకున్న స్మృతి గతంలో మాదిరే క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఆమె ‘గ్లింప్ల్ ఆఫ్ లైఫ్’ అంటూ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.
AUS సీనియర్ స్పిన్నర్ నాథన్ లయాన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 6వ ప్లేయర్గా నిలిచాడు. యాషెస్ 3వ టెస్టులో ENG బ్యాటర్ బెన్ డకెట్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతను గ్లెన్ మెక్గ్రాత్(AUS)ను దాటేశాడు. లయాన్ ఇప్పటివరకు 564* వికెట్లు పడగొట్టగా.. మెక్గ్రాత్ 653 తీశాడు. 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 4వ T20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. పొగమంచు వల్ల పలుమార్లు టాస్ వాయిదా పడగా.. రాత్రి కావడంతో మంచు అంతకంతకూ పెరుగుతోంది. విజిబిలిటీ పెరిగే ఛాన్స్ లేకపోవడంతో 4వ మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 5 T20ల సిరీస్లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉండగా.. చివరి మ్యాచ్ 19న జరగనుంది.
లక్నో మైదానంలో పొగ మంచు ప్రభావం తగ్గకపోవడంతో నాలుగో మ్యాచ్ టాస్ కోసం నిరీక్షణ తప్పట్లేదు. 7:30 గంటలకు రెండో సారి, 8 గంటలకు మరో సారి ఇన్స్పెక్ట్ చేసిన అంపైర్లు.. 8:30కి మళ్లీ చూస్తామని తెలిపారు. అయితే ఓవర్ల కుదింపు విషయంలో అంపైర్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.