భారత పర్యటనకు ఇవాళ అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ రానున్నారు. GOAT టూర్లో భాగంగా 3 రోజులు భారత్లో ఆయన పర్యటించనున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్నారు.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రసవత్తరంగ సాగుతోంది. తొలి మ్యాచ్లో టీమిండియా, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. ఈ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 ధర్మశాల వేదికగా ఆదివారం రోజున జరుగనుంది. అయితే.. గిల్, కెప్టెన్ సూర్యకుమార్ వరుసగా విఫలమవుతుండటం భారత జట్టును కలవరపెడుతోంది.
U-19 ఆసియాకప్లో UAEపై భారత్ 234 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, వైభవ్ సూర్యవంశీ (171) భారీ సెంచరీతో 433/6 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో, యూఏఈ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.
WTC(2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ ఒక డ్రా, మరో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో గతంలో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆరో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-2లో కొనసాగుతున్నాయి. కాగా, పాకిస్తాన్ 5వ ర్యాంక్లో ఉండి భారత్ కంటే ముందుంది.
టీమిండియాతో రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్పై సౌతాఫ్రికా గెలవడం ఇది 13వ సారి. దీంతో T20Iల్లో టీమిండియాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. గతంలో 12 విజయాలతో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పేరిట సంయుక్తంగా ఉండేది.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 433/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(171) సూపర్ సెంచరీ సాధించాడు. అలాగే, ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69), వేదాంత్ త్రివేది(38) రాణించారు. దీంతో U-19 క్రికెట్లో 21 ఏళ్ల క్రితం భారత్ చేసిన అత్యధిక పరుగుల(425) రికార్డును బ్రేక్ చేసింది.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఈఏతో టీమిండియాకు జరుగుతున్న మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి చేసి పెవిలియన్ చేరాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 40 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఈఏతో టీమిండియాకు జరుగుతున్న మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి చేసి పెవిలియన్ చేరాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 40 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఆమె పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారనే కారణంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. ఆ తర్వాత వినేష్ రిటైర్మెంట్ను ప్రకటించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా 112 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రిషభ్ చౌహాన్ 47, రాహుల్ బాదమ్ (35*) పరుగులు చేశారు. ఆంధ్రా బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు.
అండర్-19 ఆసియాకప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 9 సిక్సర్లు, 5 ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 20.2 ఓవర్లకు భారత్ ప్రస్తుత స్కోరు 158/1గా ఉంది. వైభవ్ సూర్యవంశీ(100*), ఆరోన్ జార్జ్ (48*) క్రీజులో ఉన్నారు.
టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్ర తరఫున మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. తొలుత హర్ష్ గవాలిని 5 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత వరుస బంతుల్లో హర్ప్రీత్ సింగ్, రజత్ పటీదార్ను ఔట్ చేశాడు.
AP: భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ క్రికెటర్ శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, కడపలో ఇంటి స్థలం కేటాయింపుతోపాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోద్రముద్ర వేసింది.
AP: భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ క్రికెటర్ శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, కడపలో ఇంటి స్థలం కేటాయింపుతోపాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో భారత్, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.