• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్

భారత మహిళా క్రీడాకారులు ఇటీవల కాలంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. క్రికెట్‌లో వన్డే ప్రపంచకప్‌తో పాటు అందుల  T20 WC గెలిచిన భారత మహిళలు తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బలమైన చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది.

November 24, 2025 / 06:08 PM IST

IND vs SA: ముగిసిన మూడో రోజు ఆట

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 26/0 పరుగులు చేసి.. మొత్తంగా 314 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 201 రన్స్‌కు ఆలౌట్ చేసిన SA.. 288 రన్స్ లీడ్ సాధించింది. యాన్సెన్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.

November 24, 2025 / 04:01 PM IST

స్మృతి మంధాన పెళ్లి రద్దు..?

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆమె వివాహం పూర్తిగా రద్దు అయిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లికి సంబంధించిన అన్ని ఫొటోలను తొలగించింది. దీంతో ఆమె పెళ్లి రద్దయిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.

November 24, 2025 / 03:37 PM IST

IND vs SA: ఫాలోఆన్ ఇవ్వని సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో SAకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా.. భారత్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని విధించే అవకాశం ఉంది.

November 24, 2025 / 03:29 PM IST

BREAKING: స్వల్ప స్కోరుకే భారత్ ఆలౌట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జైస్వాల్(58), సుందర్(48) మినహా.. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమవడంతో భారత్ 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో, భారత్ ఫాలోఆన్‌లో పడింది. SAకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. యాన్సెన్ 6 వికెట్లు, హార్మర్ 3 వికెట్లతో విజృంభించారు.

November 24, 2025 / 03:06 PM IST

అతడిని నెం.4లో ఆడించాలి: పఠాన్

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా మెనేజ్మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌లో తిలక్ వర్మను నెంబర్-4లో ఆడించాలని కోరాడు. ఆసియాకప్ లాంటి కీలక టోర్నీల్లో కూడా తిలక్ అద్భతమైన బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. అతడు వన్డేల్లో నెంబర్ 4 స్థానానికి సరిగ్గా సరిపోతాడని వ్యాఖ్యానించాడు.

November 24, 2025 / 02:31 PM IST

IND vs SA: లంచ్‌ బ్రేక్.. భారత్‌ 174/7

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 174/7 పరుగులు చేసింది. 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ ముప్పు తప్పించుకునేందుకు ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది. సుందర్ (33*), కుల్దీప్ (14*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 58, కేఎల్ 22 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సన్ 4 వికెట్లు, హార్మర్ 2 వికెట్లు పడగొట్టారు.

November 24, 2025 / 01:37 PM IST

జట్టులో సుందర్ స్థానం ఏంటి?

టీమిండియా మేనేజ్మెంట్ బ్యాటర్లతో కుర్చీలాట ఆడుతోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోల్‌కతా టెస్టులో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సుందర్.. గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 8వ స్థానంలో రావడంపై మాజీ ప్లేయర్లు, ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. సుందర్ చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో వేర్వేరు స్థానాల్లో(5, 8, 9, 7, 3, 3, 8) బ్యాటింగ్ చేయడమే ఇందుక్కారణం.

November 24, 2025 / 12:33 PM IST

గౌహతి టెస్ట్.. భారత్‌కు ఫాలో ఆన్ ముప్పు

గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు తడబడటంతో భారత్ 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా 369 రన్స్ వెనకబడి ఉన్నందున ఫాలో ఆన్ ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం క్రీజులో సుందర్(3), కుల్దీప్(0) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 4, హార్మర్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా ప్రత్యర్థి జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 200+ ఆధిక్యం ఉంటే ఫాలో ఆన్ అడగొచ్చు.

November 24, 2025 / 12:10 PM IST

స్మృతి మంధానకు మరో బిగ్ షాక్

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహం వాయిదా పడింది. అయితే, తాజాగా పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీ బారిన పడినట్లు సమాచారం. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు వెల్లడించారు.

November 24, 2025 / 11:40 AM IST

BREAKING: తడబడుతున్న టీమిండియా

గౌహతి వేదికగా దక్షణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. టీ బ్రేక్ సమయానికి 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 387 పరుగులు వెనుకబడి ఉంది. పంత్ (6*), జడేజా (0*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 22, సాయి సుదర్శన్ 15 పరుగులు చేశారు. ధ్రువ్ జురెల్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 2 వికెట్లు పడగొట్టాడు.

November 24, 2025 / 11:08 AM IST

IND vs SA: టీమిండియా షాక్‌

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా షాక్ తగిలింది. 65 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఐడెన్ మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ కేఎల్ రాహుల్ (22) వెనుదిరిగాడు. 42 పరుగులతో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కొనసాగుతున్నాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు.

November 24, 2025 / 10:13 AM IST

నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ (12*), యశస్వి జైస్వాల్ (24*) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 15 ఓవర్లకు స్కోర్ 37/0గా ఉంది. టీమిండియా ఇంకా 452 పరుగుల వెనుకంజలో ఉంది.

November 24, 2025 / 09:46 AM IST

రికార్డు సృష్టించిన అర్జెంటీనా స్టార్‌ మెస్సీ

ఫుట్‌బాల్ పోటీల్లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు. 1,300 గోల్స్‌కు కంట్రిబ్యూషన్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా అవతరించాడు. ఇంటర్ మియామీ తరఫున మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. మరో మూడు గోల్స్ చేసేందుకు టీమ్‌కు సహకరించాడు.

November 24, 2025 / 08:57 AM IST

పాక్‌దే ఆసియాకప్ రైజింగ్ స్టార్స్‌ టైటిల్‌

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్-2025 ఛాంపియన్‌గా పాకిస్తాన్-A అవతరించింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్-Aపై పాక్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. తొలుత ఇరు జట్లూ 125 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. ఆరు పరుగులు చేసింది. అనంతరం నాలుగు బంతుల్లోనే 7 పరుగులు చేసిన పాక్ విజేతగా నిలిచింది.

November 24, 2025 / 07:34 AM IST