భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య విశాఖ వేదికగా రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.IND: స్మృతి, షఫాలీ, జెమీమా, హర్మన్ప్రీత్(C), రిచా(w), అమంజోత్, స్నేహా, అరుంధతి, వైష్ణవి, క్రాంతి, చరణిSL: గుణరత్నే, అతపత్తు(సి), హాసిని, హర్షిత, నీలాక్షి, కౌషని(w), కవిషా, మల్కీ, ఇనోకా, కావ్య, శశిని
పాక్ చేతిలో భారత్ 191 రన్స్ తేడాతో మెన్స్ U19 ఆసియా కప్ ఫైనల్ ఓడిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అజేయంగా రాణించిన యువ భారత్ టైటిల్ పోరులో చేతులెత్తేయడం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఓటమి, యువ ఆటగాళ్ల ఆటతీరుపై టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ ఆయూష్ మాత్రే నుంచి వివరణ కోరాలని BCCI నిర్ణయించింది. కాగా జింబాబ్వే, నమీబియా వేదికగా జనవరి 15 నుంచి U19 వరల్డ్ కప్ జరగనుంది.
శ్రీలంక మహిళలతో ఇవాళ భారత్ రెండో T20లో తలపడనుంది. తొలి మ్యాచ్ మాదిరి ఇందులోనూ లంకపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. అలాగే తొలి T20లో చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రాక్టీస్లో చెమటోడ్చింది. అటు ఓటమితో సిరీస్ ప్రారంభించిన లంక.. ఇవాళ విజయం సాధించి లెక్క సమం చేయాలనే యోచనలో ఉంది. విశాఖ వేదికగా రా.7 గంటలకు ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి.
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ వాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గ్రాహమ్ వాన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రి తాజాగా మరణించినట్లు వాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త తెలియడంతో పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు మైఖేల్ వాన్ కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
సింహాద్రి అప్పన్నస్వామిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్కౌర్, రేణుక సింగ్, షెఫాలీ వర్మ, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణితో పాటు అంపైర్లు లక్ష్మి, ఇబ్బందా రతి తదితరులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
టీమిండియా క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ తండ్రయ్యాడు. ఆయన భార్య మిథాలీ నిన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శార్దుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సహచర క్రికెటర్లు, అభిమానులు ఆ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, శార్దుల్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.
టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేసిన భారత్ జట్టు అద్భుతంగా ఉందని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. జట్టు నుంచి శుభ్మన్ గిల్ను తొలిగిస్తారని తను ఊహించలేదని, అయితే అది సరైన నిర్ణయమే అని పేర్కొన్నాడు. గిల్ టెస్టుల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీ20ల్లో ఇబ్బందిపడుతున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం మంచి విషయమని చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్తో 3వ టెస్టులో వెస్టిండీస్ 323 రన్స్ తేడాతో ఓడింది. 462 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 138కే పరిమితమైంది. బ్రాండన్ కింగ్(67) మినహా ఎవరూ రాణించలేదు. కివీస్ బౌలర్లలో డఫ్పీ 5, అజాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్ను 2-0తో NZ సొంతం చేసుకుంది.
NZతో 3వ టెస్టులో WI ఓటమి అంచున ఉంది. 462 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 112 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టెవిన్ ఇమ్లాచ్(3), A ఫిలిప్(0) క్రీజులో ఉండగా.. ఇంకా 350 రన్స్ చేయాల్సి ఉంది. అటు కివీస్ మరో 2 వికెట్లు తీస్తే చాలు.. ఈ మ్యాచుతో పాటు 3 టెస్టుల సిరీస్నూ సొంతం చేసుకుంటుంది. తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో టెస్టులో NZ గెలిచిన సంగతి […]
విశాఖ వేదికగా శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో విష్మి(39) రాణించగా, మిగిలిన వారు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. క్రాంతి, దీప్తి, శ్రీ చరణి తలో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత క్రికెట్ మానేయాలనుకున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. అయితే, తుది మెట్టు మీద బోల్తా పడటంతో తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య విశాఖ వేదికగా తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.IND: స్మృతి, షఫాలీ, జెమీమా, హర్మన్ప్రీత్(C), రిచా(w), దీప్తి, అమంజోత్, అరుంధతి, వైష్ణవి, క్రాంతి, చరణిSL: గుణరత్నే, అతపత్తు(సి), హాసిని, హర్షిత, నీలాక్షి, కౌషని(w), కవిషా, మల్కీ, ఇనోకా, కావ్య, శశిని
దుబాయ్ వేదికగా జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. పాక్ బౌలర్ల ధాటికి కేవలం 26.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (26), ఆయూష్ మాత్రే (2) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, ఆసియా కప్ను కైవసం చేసుకుంది.
U19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. పాక్ బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ స్కోరుకు భారత్ ఇంకా 247 పరుగులు వెనుకబడి ఉంది. పాక్ బౌలర్లలో అలీ రజా 3 వికెట్లతో చెలరేగగా, సయ్యం, అబ్దుల్ సుభాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రస్తుతం క్రీజులో ఖిలాన్, హెనిల్ ఉన్నారు.