ఢిల్లీలో వీర్ బాల్ దివస్ ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారాన్ని ఇద్దరు అందుకున్నారు. ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని, తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ స్వీకరించారు.
యాషెస్ నాలుగో టెస్టులో తొలిరోజే 20 వికెట్లు పడ్డాయి. మెల్బోర్న్ పిచ్ చూస్తుంటే ఈ మ్యాచ్ మూడు రోజులు కూడా సాగడం అనుమానంగా మారింది. అయితే, ఇదే పరిస్థితి భారత్లో జరిగే టెస్టుల్లో ఎదురై, తొలిరోజే 20 వికెట్లు పడితే.. అది ‘చెత్త పిచ్’ అని, ఇలాంటి పిచ్లపై మ్యాచ్లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని విదేశీ మీడియా గగ్గోలు పెట్టేది.
విజయ్హజారే ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ ఆటగాడు రింకూ సింగ్ అజేయ సెంచరీ సాధించాడు. రాజ్కోట్ వేదికగా చంఢీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో రింకూ 60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. అలాగే, ఆర్యన్ జుయల్ కూడా 134 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. దీంతో యూపీ 50 ఓవర్లలో 367/4 స్కోర్ చేసింది.
బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ENG 110 పరుగులకే పరిమితమైంది. బ్రూక్(41), చివరలో అట్కిన్సన్(28) రాణించడంతో ఈ మాత్రం స్కోర్ చేసి.. ఇంకా 42 రన్స్ వెనుకంజలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్లో AUS 152 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. సిరీస్ కోల్పోయిన బాధలో ENG బౌలింగ్ మెరుగుపడినట్లు కనిపించినా.. బ్యాటింగ్లో మార్పు లేదు.
ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. బాక్సింగ్ డే టెస్టులోనూ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 83 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా ఆడుతోంది. బ్రూక్ 41, స్టోక్స్ 16 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ప్రస్తుతం క్రీజులో అట్కిన్సన్(6), కార్స్(0) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యధిక క్యాచులు పట్టిన రెండో ఫీల్డర్గా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్తో బాక్సింగ్ డే టెస్టులో క్రాలీ క్యాచ్ పట్టుకోవడం ద్వారా స్మిత్(211*) ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్(210)ని అధిగమించాడు. కాగా ఈ లిస్టులో ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్(214) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
యాషెస్ 4వ టెస్టులో బౌలింగ్తో అదరగొట్టిన ఇంగ్లండ్.. బ్యాటింగ్లో తడబడుతోంది. డకెట్(2), క్రాలీ(5), బెథెల్(0) చేతులెత్తేయడంతో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రూట్(0), బ్రూక్(0) ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు యథావిధిగా ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 152 పరుగులకే పరిమితమైంది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ముంబై vs ఉత్తరాఖండ్ మ్యాచులో రోహిత్ నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. అటు ఢిల్లీ vs గుజరాత్ మ్యాచులో కోహ్లీ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ(58*) పూర్తి చేసుకుని.. సెంచరీ దిశగా ఆడుతున్నాడు. కాగా VHT తొలి రౌండులో రోహిత్(155), కోహ్లీ(131) సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్లో ఇంగ్లండ్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో కంగారూలను 152 పరుగులకే కట్టడి చేశారు. ఆసీస్ బ్యాటర్లలో నెజర్(35) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లీష్ బౌలర్లలో టంగ్ 5, అట్కిన్సన్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. మిగిలిన 2 టెస్టుల్లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.
శ్రీలంక మహిళా జట్టుపై ఇప్పటికే తొలి 2 T20లను గెలిచిన భారత్.. 5 మ్యాచుల సిరీస్ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇవాళ తిరువనంతపురం వేదికగా మూడో T20లో లంకతో తలపడనుంది. అయితే సిరీస్ కాపాడుకునేందుకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రత్యర్థి జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో మిగిలిన 3 మ్యాచులూ(ఇవాళ, 28, 30) తిరువనంతపురంలోనే జరగనున్నాయి.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 51/4 కాగా.. క్రీజులో ఖవాజా(9), క్యారీ(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ టంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి 3 టెస్టుల్లో ఓడి యాషెస్ సిరీస్ కోల్పోయిన ENG.. పరువు కాపాడాకునేందుకు పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సిరీస్ గెలిచిన విజయోత్సాహం కంగారూల్లో కనిపించట్లేదు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న యాషెస్ 4వ టెస్టు కోసం ఆస్ట్రేలియా తాజాగా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ కమిన్స్కు విశ్రాంతినివ్వగా.. స్మిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు: స్మిత్(C), బోలాండ్, క్యారీ, డాగెట్, గ్రీన్, హెడ్, ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, మర్ఫీ, నాసర్, రిచర్డ్సన్, స్టార్క్, వెదరాల్డ్, వెబ్స్టర్.
ఇటీవల ముగిసిన SMATలో జార్ఖండ్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని జార్ఖండ్ ఫైనల్లో హర్యానాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే జార్ఖండ్ విజేతగా నిలవడంలో ధోనీ కీలక పాత్ర పోషించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం జాయింట్ సెక్రెటరీ షాబాజ్ నదీమ్ తెలిపారు. జార్ఖండ్ ప్లేయర్లకు ధోనీ మెంటర్గా విలువైన సూచనలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి ఎంపిక చేయాలని కాంగ్రెస్ MP శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వైభవ్ను చూస్తుంటే తనకు చిన్ననాటి సచిన్ను చూసినట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. సచిన్ తరహాలోనే వైభవ్ కూడా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. వైభవ్ భారత్ సీనియర్ జట్టుకు ఆడటాన్ని చూడటం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన SMలో పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియాలో టెస్టుల్లో విఫలమవుతున్న ENGతో పాటు, కోచ్ మెకల్లమ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెకల్లమ్ స్థానాన్ని రవిశాస్త్రితో భర్తీ చేయాలని ENG మాజీ ప్లేయర్ మాంటీ పనేసర్ ECBకి సూచించాడు. AUS బలహీనతలను ఆసరాగా తీసుకుని.. వారిని మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేవాళ్లను ENG కోచ్గా నియమించాలని, ఇందుకు రవి బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.