సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంపై అతని సోదరి ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్లో ‘IYKYK’ అనే క్యాప్షన్ పెట్టింది. దీని అర్థం “If You Know, You Know” (మీకు తెలిస్తే, మీకు తెలుసు) అని. ఈ సెంచరీ వెనుక ఉన్న కష్టం, కృషి కేవలం కొందరికే తెలుసు అనే అర్థం వచ్చేలా ఆమె ఈ కోడ్ ఉపయోగించింది.
అబుదాబీ టీ10 లీగ్ ఫైనల్లో UAE బుల్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఆస్పిన్ స్టాలియన్స్ (APS)తో జరిగిన పోరులో 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 ఫోర్లతో భారీ స్కోర్(98) చేశాడు. చివర్లో 9 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టడం విశేషం. డేవిడ్ దూకుడుతో UAE 10 ఓవర్లలో 150 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో APS 70 పరుగులకే పరిమితమైంది. దీంతో UAE బుల్స్ టీ10 టైటిల్ను గెలుచుకుంది.
రాంచి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 17 రన్స్ తేడాతో విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో SA 332 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో బ్రీట్జ్(72), యాన్సెన్(70), బాష్(67) అర్ధ సెంచరీలతో పోరాడారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4, హర్షిత్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత్తో మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతుండగా కుల్దీప్ యాదవ్ స్పిన్తో మ్యాజిక్ చేశాడు. హాఫ్ సెంచరీలు పూర్తిచేసి సెటిలైన బ్యాటర్లు యాన్సెన్(70), బ్రీట్జ్(72)ను కుల్దీప్ కేవలం ఒకే ఓవర్లో పెవిలియన్కు చేర్చి.. మ్యాచ్ను పూర్తిగా మలుపుతిప్పాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. యాన్సెన్ కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో వైపు మాథ్యూ బ్రీట్జ్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం, SA.. 29 ఓవర్లలో 198/5 పరుగులు చేసింది. భారత్ స్కోర్కు మరో 152 పరుగులు వెనుకబడి ఉంది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో హర్షిత్ రాణా టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. వైడ్తో ఇన్నింగ్స్ రెండో ఓవర్ను ప్రారంభించిన రాణా, తర్వాతి బంతికే రికెల్టన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ మూడో బంతికి డికాక్(0)ను కూడా ఔట్ చేసి సౌతాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
➠వన్డేల్లో కోహ్లీ 52వ సెంచరీ, ఓవరాల్గా 83వది.➠వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (352) కొట్టిన ప్లేయర్గా రోహిత్.➠SAపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు (6) చేసిన ప్లేయర్గా కోహ్లీ.➠సొంతగడ్డపై 100 హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ప్లేయర్ కోహ్లీ.➠కోహ్లీ ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్లో 7000వ సెంచరీ.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. కోహ్లీ(135) సూపర్ సెంచరీ చేయగా.. రోహిత్(57), రాహుల్(60) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 349/8 స్కోర్ నమోదు చేసింది. జైస్వాల్ (18), గైక్వాడ్ (8), సుందర్ (13) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్మన్, బర్గర్, యాన్సెన్, బోష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లీ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన కోహ్లీ, సౌతాఫ్రికాపై ODIల్లో అత్యధికంగా 6 సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. రాంచీ స్టేడియంలో అతడికి ఇది 5 ఇన్నింగ్స్ల్లో 3వ సెంచరీ. అలాగే, వన్డేల్లో సొంతగడ్డపై అత్యధికంగా 25 సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచాడు.
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ పట్టుకున్నాడు. బ్రెవిస్ పట్టిన ఈ క్యాచ్ చూసి రుతురాజ్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేసి ‘కింగ్ కోహ్లీ’ తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక ఫార్మాట్లో అత్యధికంగా 52 సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా, కోహ్లీ వన్డేల్లో 52 సెంచరీలతో ఈ రికార్డును అధిగమించాడు. ఓవరాల్గా అతడికి ఇది 83వ సెంచరీ.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. 30.3 ఓవర్లలో 200/4 స్కోరుతో ఉంది. కోహ్లీ (88), రాహుల్ (0) క్రీజులో ఉన్నారు. రోహిత్ 57 పరుగులతో రాణించగా.. జైస్వాల్ 18, రుతురాజ్ గైక్వాడ్ 8, వాషింగ్టన్ సుందర్ 13 స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు.
కింగ్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును అధిగమించాడు. స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. సచిన్ 58 హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ(59) ఈ రికార్డును అధిగమించాడు. ఓవరాల్గా భారత్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్(145) కొనసాగుతుండగా, కోహ్లీ(127) రెండో స్థానంలో నిలిచాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో సొంతగడ్డపై 100 అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు సచిన్ (112), పాంటింగ్ (106), కల్లిస్ (104) మాత్రమే ఈ రికార్డ్ సాధించారు. దీంతో కోహ్లీ ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.