టీమిండియా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నవంబర్ నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేస్లో నిలిచింది. గత నెలలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చేసిన ఆల్రౌండ్(87 రన్స్, 2 వికెట్లు)తో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది. అలాగే, థాయ్లాండ్ స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్, UAE ఆల్రౌండర్ ఇషా ఓజా కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 334 పరుగులకు ఆలౌట్ చేసి, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. డిన్నర్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. స్మిత్(24), గ్రీన్(22) క్రీజులో ఉన్నారు. ENG స్కోర్కు ఇంకా 106 పరుగులు వెనుకబడి ఉంది. హెడ్(33), వెదరాల్డ్(72), లాబుస్చాగ్నే(65) ఔట్ అయ్యారు.
యాషెస్ రెండో టెస్టులో సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(138*) ఆస్ట్రేలియాపై అద్భుత రికార్డ్ నెలకొల్పాడు. ఆసీస్తో డే & నైట్ టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ పాక్ ప్లేయర్ అసద్ షఫిక్(137) పేరిట ఉండేది. ఇక ఈ లిస్టులో డూప్లెసిస్(118*), యాసీర్ షా(113 PAK), స్టీఫెన్ కుక్(104 SA) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
SAతో 2వ ODIలోనూ కోహ్లీ సెంచరీ చేస్తాడని అనుకోలేదని సునీల్ గవాస్కర్ అన్నాడు. కానీ ఆరంభంలోనే కోహ్లీ కొట్టిన సిక్సర్తో మంచి ఇన్నింగ్స్ ఆడతాడని భావించానని పేర్కొన్నాడు. రాంచీలో చేసిన సెంచరీ కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందన్నాడు. ఇక రుతురాజ్తో కోహ్లీ మాట్లాడిన తర్వాత అతని ఆట మారిందని, యువ ఆటగాడిని ఓ సీనియర్ నడిపించిన తీరు చూసి ముచ్చటేసిందని పేర్కొన్నాడు.
ఫాబ్-4 ప్లేయర్లలో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ దూసుకెళ్తున్నాడు. గత 4 ఏళ్లుగా టెస్టుల్లో అద్భుత ఫామ్తో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం రూట్ టెస్టుల్లో 40 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. స్మిత్-36, విలియమ్సన్-33, కోహ్లీ-30(రిటైర్డ్) సెంచరీలతో నిలిచారు. రూట్ మరో 12 సెంచరీలు సాధిస్తే, సచిన్(51) పేరిట ఉన్న టెస్టు సెంచరీల రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, డే వన్ స్టంప్స్ సమయానికి 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. జో రూట్ 135 పరుగుల అజేయ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. జాక్ క్రాలీ (76) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోతున్నాడు. తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేసిన స్టార్క్, తాజాగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం అతడి కెరీర్లో ఇది 18వ సారి కావడం విశేషం.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో అదరగొట్టాడు. 181 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్నా కూడా అతడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో 40వ సెంచరీ కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఆ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్ గడ్డపై 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే, మొహాలీలో భారత్పై ఆస్ట్రేలియా ఛేదించిన 359 పరుగుల రికార్డును సౌతాఫ్రికా సమం చేసింది.
యాషెస్ 2వ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికంగా 415* వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్గా పాక్ దిగ్గజం వసీం అక్రమ్(414) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ని ఔట్ చేసి స్టార్క్ ఈ ఘనత సాధించగా.. లంక దిగ్గజం చమిందా వాస్(355) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం కోసం భారత్ ఈ నెల 6న జరిగే విశాఖ మ్యాచ్ నుంచి ముగ్గురు ప్లేయర్లను తప్పించనుందని తెలుస్తోంది. తొలి 2 వన్డేల్లో చేతులెత్తేసిన జైస్వాల్(18, 22), ప్రసిద్ధ్ కృష్ణ(48/1, 85/2)ను తప్పించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఆల్రౌండర్గా ఫెయిల్ అయిన సుందర్నూ వదిలేసి జురెల్, నితీష్, తిలక్ను తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
విశాఖ వేదికగా ఈ నెల 6న భారత్, సౌతాఫ్రికా మూడో వన్డేలో తలపడనున్న సంగతి తెలిసిందే. రాయ్పూర్ వన్డేలో సౌతాఫ్రికా గెలవడంతో సిరీస్ 1-1తో సమం కాగా.. 3 వన్డేల సిరీస్ విశాఖ మ్యాచ్లో గెలిచిన జట్టు సొంతమవుతుంది. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరుజట్లు ఇవాళే విశాఖకు చేరుకోనున్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ వన్డే సిరీస్ గెలవడం ప్రతిష్ఠాత్మకం.
సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరిగిన 2వ వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ టీమిండియాకు పరాజయం తప్పలేదు. కోహ్లీ సెంచరీ చేసిన వన్డేల్లో భారత్ ఓడటం చాలా అరుదు. గతంలో ఇలా AUS చేతిలో 3, NZ 2, ENG, WI చేతిలో ఓ సారి భారత్ ఓడింది. చివరిసారిగా 2019లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా తాజాగా 8వ సారి రాయ్పూర్ వన్డేలో ఓటమి చవిచూసింది.
ఆల్రౌండర్గా IPLలో మెరిపించిన ఆండ్రీ రస్సెల్ లీగ్ నుంచి రిటైర్ కావడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో రిటైర్మెంట్కి గల కారణాన్ని రస్సెల్ స్వయంగా తెలిపాడు. “ఉసెన్ బోల్ట్, ABD తమ ఆటలో రాణిస్తున్నప్పటికీ రిటైర్ అవడంతో అంతా ‘ఎందుకు?’ అని ప్రశ్నించారు. నేను కూడా అందరూ ‘ఎందుకు?’ అని అనేటప్పుడే టాప్ ప్లేయర్గా రిటైర్ అవ్వాలని అనుకున్నా” అని...
HYDలో హార్దిక్ ఫాలోయింగ్ దెబ్బకు ఏకంగా SMAT బరోడా vs గుజరాత్ మ్యాచ్ వేదికను ఉప్పల్కు మార్చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్ జింఖానా మైదానంలో జరగాల్సి ఉంది. అయితే DEC 2న బరోడా vs పుదుచ్చేరి మ్యాచ్లో హార్దిక్ కోసం ఓ అభిమాని గ్రౌండ్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేదికను మార్చారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.