జింబాబ్వే సీనియర్ ప్లేయర్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 2000+రన్స్తో పాటు 100+వికెట్లు తీసిన మూడో ప్లేయర్గా రికార్డ్ నెలకొల్పాడు. అతని కంటే ముందు బంగ్లా క్రికెటర్ షకిబ్ అల్ హసన్(2551 రన్స్ + 149 వికెట్లు), ఆఫ్ఘాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(2417 + 104) మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు.
విశాఖ వేదికగా భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 6న సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్ ఆడనుంది. పర్యాటక జట్టుతో ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సరీస్లో భాగంగా ఈ చివరి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టికెట్ల విక్రయం ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 22 వేల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. మ్యాచ్ కోసం ఇరుజట్లు DEC 4న విశాఖకు చేరుకుంటాయి.
సౌతాఫ్రికాతో గౌహతి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ప్రస్తుతం ముత్తుసామీ(25), వెరెయిన్(1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మార్క్రమ్ 38, రికెల్టన్ 35, స్టబ్స్ 49, బవుమా 41, జోర్జి 28, ముల్డర్ 13 రన్స్ చేసి వెనుదిరిగారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు తీశాడు.
యాషెస్లో స్టీవ్ స్మిత్ ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో 7 టెస్టులు ఆడిన ఆసీస్(Win, W, W, Draw, W, W, W) ఒక్కటీ ఓడలేదు. ప్లేయర్గానూ 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 805 పరుగులతో రాణిస్తున్నాడు. ఓవరాల్గా 41 టెస్టుల్లో సారథ్యం వహించిన స్మిత్ 10 మాత్రమే ఓడాడు. 24 గెలవగా, మిగతా 7 డ్రాగా ముగిశాయి.
పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో 205 రన్స్ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలోనే చేధించింది. బౌలర్ల ధాటికి 2 రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో.. ఆసీస్ తరఫున స్టార్క్ 10 వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ తరఫున స్టోక్స్, బోలాండ్ ఐదేసి వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేశాడు. 69 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 147 కాగా విజయానికి మరో 57 పరుగులు కావాలి. క్రీజులో హెడ్తో పాటు లబుషేన్(20) ఉన్నాడు.
గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆ జట్టు 156/2 పరుగులు చేసింది. స్టబ్స్ (32*), బవుమా (36*) క్రీజులో ఉన్నారు. వారిద్దరూ టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
టీమిండియాతో జరుగుతున్న రెండు టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజ్లో స్టబ్స్ (27), టెంబా బవుమా (32) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు ఇప్పటివరకు 137 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికాతో కీలకమైన రెండో టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న పంత్కు ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మద్దతు తెలిపాడు. సిరీస్ మధ్యలో సారధిగా వ్యవహరించడం అంత సులువు కాదన్నాడు. మొదటి టెస్టులో ఓటమిపాలైన తర్వాత కెప్టెన్ బాధ్యతలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని అని తెలిపాడు. అయినా పంత్ ఈ పనిని సులువుగా చేయగలడని.. ఆ సత్తా అతడిలో ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 34.4 ఓవర్లకు 164 ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ 204 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. బోలాండ్ 4, స్టార్క్ 3, డాగెట్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో తొలి టెస్టులో ఒకే రోజు 19 వికెట్లు పడ్డాయి. ఈ 19 వికెట్లను పేసర్లే పడగొట్టడం గమనార్హం. దీనిపై మాజీ స్పీన్నర్ అశ్విన్ స్పందించాడు. భారత్లో స్పిన్ పిచ్లు తయారు చేస్తే విమర్శలు చేసే మాజీ ప్లేయర్లు.. పేస్ పిచ్ల గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ సచ్చిపోదా? అని ప్రశ్నించాడు.
పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయింది. 30.1 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులు చేసింది. క్రీజులో గస్ అట్కిన్సన్ (11*), బ్రైడన్ కార్స్ (15* ) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ కన్నా ఇంగ్లండ్ 152 పరుగుల ముందంజలో ఉంది.
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీబ్రేక్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా మరో వికెట్ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రికెల్టన్ (35) రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో టెంబా బవుమా (8*), స్టబ్స్ (2*) ఉన్నారు. 30 ఓవర్లకు స్కోర్ 92/2గా ఉంది.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఒక్క పరుగు తీయకుండా ఓపెనింగ్ భాగస్వామ్యం బ్రేక్ అవడం టెస్టు క్రికెట్లో ఇదే తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ల్లో క్రాలే, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వెదరాల్డ్ డకౌట్ అయ్యారు.
గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 82/1 పరుగులు చేసింది. రికెల్టన్ (35*) క్రీజులో ఉన్నాడు. 38 పరుగులు చేసిన మార్క్రమ్.. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రెండు టెస్టుల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు ఓడిన భారత్ 0-1తో వెనుకబడిన విషయం తెలిసిందే.