జాతీయ క్రీడా పురస్కారాల కోసం 2025 సంవత్సరానికి గాను సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క క్రికెటర్కు కూడా చోటు దక్కకోపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు.. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.
విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 300 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(131) అదరగొట్టాడు. సిక్కిం బౌలర్లలో నితీష్ 1, రాజు 1, సత్యనారాయణ 2, హేమంత్ 2 వికెట్లు పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కోహ్లీ 83 బంతుల్లో (101*) సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కోహ్లీ 83 బంతుల్లో (101*) సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అంతకుముందు ఆంధ్ర 50 ఓవర్లలో 298/8 స్కోర్ సాధించింది.
విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. అంతకుముందు సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 237 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(155) అదరగొట్టాడు. సిక్కిం బౌలర్లలో క్రాంతి కుమార్, అంకుర్ తలో వికెట్ పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ చెలరేగాడు. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ 62 బంతుల్లో (100*) సెంచరీ చేశాడు. తొలుత సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 150/1 పరుగులతో ఉంది.
విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో మరో పరుగు చేస్తే.. లిస్ట్-ఏ క్రికెట్లో 16వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బీహార్ రికార్డు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 574/6 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక స్కోరు ఇది. షకిబుల్ గని(128*), వైభవ్ సూర్యవంశీ 190, ఆయుష్ లోహారుక 116 సెంచరీలతో అదరగొట్టారు. అరుణాచల్ బౌలర్లలో మోహిత్, నెరి చెరో 2 వికెట్లు పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ కెప్టెన్ షకిబుల్ గని సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో 36 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ రికార్డును షకిబుల్ బ్రేక్ చేయడం గమనార్హం. భారత్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
భారత మహిళల క్రికెట్ జట్టులో జెమీమా రోడ్రిగ్స్ కెరీర్ రెండు నెలలముందు అంత గొప్పగా ఏమీ లేదు. నిలకడ లేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఆమె భారత జట్టు సూపర్ స్టార్లలో ఒకరిగా ఎదిగింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా అక్టోబరు 30న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో జెమీమా (127*) చెలరేగడంతో ఆమె పేరు మార్మోగింది. ప్రపంచకప్తో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ (190) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ABD 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమైంది. ఆంధ్రా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టుకు కోహ్లీ, పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సిక్కిం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
AP: బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో బాగా రాణించాలని వేడుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఇండోనేషియా, మలేషియా, ఇండియాలో టోర్నమెంట్లు ఉన్నాయన్నారు. విశాఖలో అకాడమీ నిర్మాణం జరుగుతోందని, మంచిపేరు రావాలని ప్రార్థించానన్నారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి గిల్ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్య కూడా పరుగులు చేయకపోవడంతోనే గిల్పై వేటు పడినట్లు తెలిపాడు. ఫామ్లో లేని ఒక్క ఆటగాడికి మాత్రమే జట్టులో అవకాశం ఇవ్వొచ్చని.. అంతకు మించి సాధ్యం కాదన్నాడు. గిల్ కూడా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెప్పాడు.