• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

నేడు వింబుల్డన్ ఫైనల్: అల్కారాజ్‌ vs సిన్నర్‌

ఇవాళ వింబుల్డన్ పురుషుల ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కారాజ్‌తో వరల్డ్ నం.1 సినర్‌‌ తలపడనున్నాడు. వరుసగా రెండు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన అల్కారాజ్ ఇవాళ్టి ఫైనల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తున్నాడు. ఈమ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

July 13, 2025 / 02:26 PM IST

IND vs ENG: నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు

లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి 91 ఓవర్లలో 316 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. జడేజా(40), నితీశ్‌ రెడ్డి(25) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 143 బంతుల్లో 62 పరుగులు జోడించారు. కాగా, ఇంగ్లండ్ స్కోర్‌కు భారత్ ఇంకా 73 పరుగుల వెనకంజలో ఉంది. ఈ సెషెన్‌లో టీమిండియా కేఎల్ రాహుల్(100) వికెట్‌ను కోల్పోయింది.

July 12, 2025 / 08:19 PM IST

చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్

ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రెండు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు నమోదు చేశాడు. 34 సిక్సర్లతో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును పంత్(35) బ్రేక్ చేశాడు.

July 12, 2025 / 05:23 PM IST

వింబుల్డన్ ఫైనల్: అల్కారాజ్‌ vs సిన్నర్‌

వింబుల్డన్ పురుషుల సెమీఫైనల్లో నొవాక్ జకోవిచ్ ఓటమిపాలయ్యాడు. జకోవిచ్ పై వరల్డ్ నం.1 సినర్‌ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో సినర్ 6-3, 6-3, 6-4తో వరుస సెట్లలో జకోవిచ్‌ను ఓడించాడు. దీంతో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగే ఫైనల్లో అల్కారాజ్‌తో సిన్నర్‌ తలపడనున్నాడు.

July 12, 2025 / 02:18 PM IST

బాగా అలసిపోయా: బుమ్రా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అయినా అతడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీనికి కారణం ఏంటా? అని క్రికెట్ అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై బుమ్రా మాట్లాడుతూ.. ‘నేను బాగా అలసిపోయా. అందుకే ఎక్కువగా సంతోషపడలేకపోయా. ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు’ అని వెల్లడించాడు.

July 12, 2025 / 08:27 AM IST

IND vs ENG: ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు

లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 13, కరుణ్‌ నాయర్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ మరో 343 పరుగులు వెనుకబడి ఉంది.

July 11, 2025 / 08:23 PM IST

320 పరుగుల్లోపే కట్టడి చేయాలి: కుంబ్లే

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 320 పరుగుల్లోపే కట్టడి చేస్తే భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. అలాగే, తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి ఫిట్‌నెస్, ఆటతీరు బాగుందని ప్రశంసించాడు. అతడి విషయంలో ఏ మార్పులు చేయొద్దని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

July 11, 2025 / 02:28 PM IST

టీ బ్రేక్.. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో భారత్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లులో రూట్(54*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పోప్(44*) కూడా హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

July 10, 2025 / 08:19 PM IST

అతడికి ఛాన్స్ ఇవ్వాలి: పీటర్సన్

ఇంగ్లండ్‌‌తో ఇవాళ్టి నుంచి జరగనున్న మూడో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని ఇప్పటికే ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ భారత్‌కు సూచించాడు. తాజాగా, కెవిన్ పీటర్సన్ కూడా కుల్దీప్‌కు మద్దతుగా నిలిచాడు. ‘DC మెంటార్‌గా కుల్దీప్‌తో నేను చాలా సమయం గడిపాను. ఇంగ్లండ్ పిచ్‌లు అతడికి సరిగా సరిపోతాయి. మూడో టెస్టులో అతడిని ఆడించాలి’ అని తెలిపాడు.

July 10, 2025 / 02:24 PM IST

మూడో టెస్టు కోసం ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

భారత్-ఇంగ్లండ్ మధ్య జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌‌లకు దూరంగా ఉన్న గస్ అట్కిన్సన్‌కు జట్టులో చోటుకల్పించింది. జట్టు: స్టోక్స్(c), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, డకెట్, ఓవర్టన్, పోప్, రూట్, స్మిత్, జోష్ టంగ్, వోక్స్

July 8, 2025 / 02:15 PM IST

రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు

ADB: రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈనెల 9 నుంచి అండర్-15 రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయని, పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు.

July 8, 2025 / 07:58 AM IST

వన్డే ర్యాంకింగ్స్: టాప్‌లో భారత్

ICC తాజాగా విడుదల చేసిన ODI ర్యాంకింగ్స్‌లో టీమిండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్(109), ఆస్ట్రేలియా(109) తర్వాత స్థానాల్లో నిలిచాయి. అలాగే, పాక్(4), శ్రీలంక(5), సౌతాఫ్రికా(6), అఫ్ఘానిస్థాన్(7), ఇంగ్లండ్(8), బంగ్లాదేశ్(9), వెస్టిండీస్(10) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాగా, 2027 మార్చి 31లోపు టాప్-8లో ఉన్న జట్లు నేరుగా WC-2027కు అర్హత సాధిస్తాయి.

July 7, 2025 / 02:21 PM IST

సెంచరీతో అదరగొట్టిన యువ ఆటగాడు

టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న U-19 నాలుగో ODIలో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లండ్ యువ బౌలర్లను ఉతికారేశాడు.

July 5, 2025 / 05:27 PM IST

ENG vs IND: మూడో రోజు.. భారత్ ఆధిక్యం ఎంతంటే?

ఇంగ్లండ్, భారత జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 27, కరుణ్ నాయర్ 7 రన్స్‌తో ఉన్నారు.

July 4, 2025 / 11:24 PM IST

స్మిత్-బ్రూక్ దూకుడు.. ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మూడో రోజు ఆటను కొనసాగిస్తోంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 355/5 స్కోర్ చేసింది. రెండో సెషన్‌లో ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. క్రీజులో ఉన్న స్మిత్ (157) బ్రూక్ (140) శతకాలు చేసి దూకుడుగా ఆడుతున్నారు.

July 4, 2025 / 08:22 PM IST