జితేష్ శర్మకు తాజాగా ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడి అభిమానులు SM వేదికగా సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘జితేష్ చేసిన తప్పేంటి? అతడిని జట్టు నుంచి ఎందుకు తొలగించారు..?’ అంటూ BCCIని ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాలను జితేష్ సద్వినియోగం చేసుకున్నప్పటికీ, WC వంటి మెగా టోర్నీకి అతడిని ఎంపిక చేయకపోవడంపై మండిపడుతున్నారు.
T20 WCకు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్తో జరగబోయే T20 సిరీస్లోనూ ఆడుతుందని సెలక్టర్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 31 వరకు కివీస్తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. FEB 7న T20 WC ఆరంభం కానున్న నేపథ్యంలో, ఈ సిరీస్ను భారత్ కీలక సన్నాహకంగా భావిస్తోంది. కాగా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
2025-SMATలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ కనబరిచి టోర్నీలోనే అత్యధిక పరుగులు (517) చేసిన బ్యాటర్గా నిలిచాడు. అలాగే, కెప్టెన్గా జార్ఖండ్ జట్టుకు తొలిసారి ఈ ట్రోఫీని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో జితేష్ శర్మను కాదని, బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కు T20 WC జట్టులో చోటు దక్కింది. కాగా, అతడు చివరిసారిగా 2023లో టీమిండియా తరఫున ఆడాడు.
టీ20 వరల్డ్కప్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నెంబర్ 3లో బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అలాగే, తాను నెంబర్-4లో ఆడనున్నట్లు తెలిపాడు. నెం.5, 6లో దూబే లేదా పాండ్యా బ్యాటింగ్కు రానున్నట్లు వెల్లడించాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆడనున్నారు. కాగా, తిలక్కు నెం.3లో మంచి బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి.
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. ఇటీవల కాలంలో వైట్బాల్ క్రికెట్లో దారుణంగా విఫలమవుతున్న గిల్ను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. గిల్ దూరం కావడంతో సంజూ శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.
T20 వరల్డ్ కప్-2026 కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన టీమిండియాను సూర్య కుమార్ యాదవ్ నడిపించనున్నాడు. భారత జట్టు: అభిషేక్, అక్షర్ పటేల్(VC), శాంసన్, సూర్య(C), ఇషాన్ కిషన్, తిలక్, జితేష్, హార్దిక్, అక్షర్, దూబే, సుందర్, బుమ్రా, వరుణ్, కుల్దీప్, హర్షిత్ రాణా, అర్ష్దీప్
యాషెస్ 3వ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. పాక్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో 150+ వికెట్లు పడగొట్టిన రెండో కెప్టెన్గా నిలిచాడు. కమిన్స్ ఇప్పటివరకు 151* వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ 187 వికెట్లు తీశాడు. కాగా భారత్ తరఫున కపిల్ దేవ్(111), బిషన్ బేడీ(106) మాత్రమే కెప్టెన్గా 100+ వికెట్లు పడగొట్టారు.
T20 ఫార్మాట్లో సౌతాఫ్రికాపై అత్యధికంగా 21 విజయాలు సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. సఫారీలతో జరిగిన 5 T20 సిరీస్లో 3 విజయాలు సాధించడం ద్వారా భారత్ ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉండేది. సఫారీలను 19 సార్లు ఓడించిన కంగారూల జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్రొటీస్పై 14 విజయాలతో వెస్టిండీస్, పాక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు నితీష్ కుమార్రెడ్డి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈనెల 24న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తలపడే 18 మంది సభ్యుల ఆంధ్ర జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.ఆంధ్ర జట్టు: నితీష్ (C), భరత్, రషీద్, రికీభుయ్, అశ్విన్, ప్రసాద్, హేమంత్, వై.సందీప్, సౌరభ్, ధనుష్, వినయ్, స్టీఫెన్, సత్యనారాయణ, KSN.రాజు, జ్ఞానేశ్వర్, CH సందీప్, సాకేత్.
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీశాడు. మొత్తం సిరీస్లో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ICC ర్యాంకింగ్స్లో వరల్డ్ నం.1 బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 33 టీ20ల్లో అతడు 55 వికెట్లు పడగొట్టాడు.
3వ టెస్టు 4వ ఇన్నింగ్సులోనూ ENG పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 435 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 4వ రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులే చేసింది. తొలి 2 టెస్టులూ ఓడినందున.. రేపటి ఆటలో J.స్మిత్(2*), జాక్స్(11*) నిలబడకపోతే మ్యాచుతోపాటు సిరీస్ AUS సొంతమవుతుంది. సిరీస్ కాపాడుకోడానికి ENG రేపంతా ఆడాలి లేదా 228 రన్స్ చేయాలి.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒక టీ20 క్యాలెండర్ ఇయర్లో 1600 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్.. 21 మ్యాచుల్లో 859 రన్స్ చేశాడు. మొత్తంగా 2025లో టీ20ల్లో 1602 పరుగులు పూర్తి చేసి కోహ్లీ ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు 12 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోహ్లీ 2016లో IPL, భారత్ తరఫున 1614 పరుగులు చేశాడు.
భారత్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరుపై తనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఈ సిరీస్లో మేం చేయాలనుకున్నదంతా చేశాం. కానీ.. ‘బ్యాటర్ సూర్య’నే మిస్ అయ్యాడు. కచ్చితంగా మరింత బలంగా తిరిగొస్తాడు’ అని పేర్కొన్నాడు. కెప్టెన్గా ఈ సిరీస్ తనకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపాడు.
అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీశాడు.