రూ.25.20 కోట్లతో KKR కొనుగోలు చేసిన ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ MIతో మ్యాచ్లో 18 పరుగులే చేశాడు. అయితే, ఈ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. దీనిపై కామెంటేటర్ కెప్టెన్ రహానేను ప్రశ్నించగా.. ఈ ప్రశ్న క్రికెట్ ఆస్ట్రేలియాను అడిగితే బాగుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల వల్లే అతను బౌలింగ్ చేయడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
KKRతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ముంబై తరపున తన అరంగేట్రం మ్యాచ్లోనే శార్దుల్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందే LSG నుండి ట్రేడింగ్ ద్వారా MI శార్దుల్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది ఈ సీజన్లో మొదటి మ్యాచ్ కావడంతో, గెలుపుతో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ధోనీ, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్న చెన్నై.. రాజస్థాన్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ KKRతో జరిగిన మ్యాచ్తో ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇందులో IPLలో 278 మ్యాచ్లు, ఛాంపియన్స్ లీగ్ T20లో 22 మ్యాచ్లు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ IPL-2026 చరిత్రలో శుభారంభం చేసింది. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో కోల్కతాపై ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ (78), రికెల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్లతో ఛేదించారు. ఈ మ్యాచ్తోనే ముంబై తన ‘తొలి మ్యాచ్ ఓటమి’ సెంటిమెంట్ను బ్రేక్ చేసి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది.
కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. MI ఓపెనర్లు రికల్టన్(81), రోహిత్(78) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో తిలక్(20), పాండ్యా(18*) కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ విజయంతో ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.
ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్ల మైలురాయిని దాటిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన ప్రపంచంలోని 9వ ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. IPL-2026లో KKRతో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే రోహిత్ అర్ధశతకం (51*)తో అదరగొట్టాడు. మరోవైపు రికెల్టన్ (28*) అతనికి మంచి పార్టనర్షిప్ అందిస్తున్నాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 80 పరుగులుగా నమోదైంది.
KKR కెప్టెన్ అజింక్య రహానే టీ20 కెరీర్లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా రహానే, టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్ను దాటాడు. ఈ మ్యాచ్లో రహానే కేవలం 40 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు.
RRతో రేపు జరగనున్న కీలక మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ట్రైనింగ్ సెషన్లో గాయపడ్డాడు. దీంతో అతడు రేపటి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఇప్పటికే ధోనీ గాయంతో దూరమవ్వగా, ఇప్పుడు బ్రెవిస్ కూడా దూరం కావడం జట్టుకు పెద్ద లోటు అని పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో KKR 220/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రహానే(67) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఫిన్ అలెన్ 37 పరుగులు చేశాడు. గ్రీన్(18) తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ, రాఘువంశీ (51), రింకూ సింగ్ (33) చివర్లో ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. MI టార్గెట్: 221.
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రేపు ఆసక్తికర పోరు జరగనుంది. గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. CSK సారథిగా రుతురాజ్ గైక్వాడ్, RR కెప్టెన్గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నారు. అయితే, గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్తో పాటు జియోహాట్స్టార్ యాప్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
వాంఖడేలో అజింక్య రహానే బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో రహానేకు ఇది 34వ అర్ధసెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 64 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న అతడు.. KKRను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. స్కోర్: 11 ఓవర్లలో 132/2.
వాంఖడేలో అజింక్య రహానే తన బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు. MIతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో రహానేకు ఇది 34వ అర్ధసెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 64 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న అతడు.. KKRను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. స్కోర్: 11 ఓవర్లలో 132/2.
MIతో మ్యాచ్లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న KKR జోరుకు శార్దుల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. 69 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (37)ను పెవిలియన్ చేర్చి ముంబైకి తొలి వికెట్ను అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రీన్(18) కూడా శార్దుల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 109 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది.