ప్రతిష్ఠాత్మక యాషెస్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ ఇప్పటికీ ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్(1928-48) పేరిటనే ఉంది. ఇంగ్లండ్పై 37 టెస్టులు ఆడిన ఆయన ఏకంగా 19 సెంచరీలు చేశాడు. 12 సెంచరీలతో ఆ రికార్డుకు చేరువగా స్టీవ్ స్మిత్.. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జాక్ హాబ్స్(1908-30) సరసన రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా(AUS-10) మూడో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసోంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొనున్నారు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. రెండో మ్యాచ్ ఈనెల 22 నుంచి గౌహతిలో జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు గంభీర్ కామాఖ్య ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంగ్లండ్తో రేపటి నుంచి జరిగే యాషెస్ తొలి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ తరఫున జేక్ వెదర్లాండ్, బ్రెండన్ డాగెట్ అరంగేట్రం చేయనున్నారు.ఆసీస్ జట్టు: స్మిత్(C), ఖవాజా, వెదర్లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, డాగెట్, బోలాండ్
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుండగా.. వచ్చే ఏడాది మార్చ్ 15 నుంచి టోర్నీ ప్రారంభమవుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో ఈ సారి ఒక్కో జట్లు 16 లీగ్ మ్యాచులు ఆడుతుంది. అలాగే టోర్నీలో మొత్తం 84 T20లు జరుగుతాయి. ఇక ఎప్పటిలాగానే మ్యాచులు 3:30PM, 7:30PMకు ఉంటాయి.
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో సంచలనం నమోదైంది. పాకిస్తాన్కు పసికూన నేపాల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 170/ 7 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నేపాల్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సెమీస్కు అర్హత సాధించింది.
2026 పురుషుల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2026 జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత్, యూఎస్ తలపడనున్నాయి. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది.
వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు. ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో హోప్ (109) సెంచరీ చేసి ఈ అరుదైన రికార్డు సాధించాడు.
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-Aతో జరిగిన మూడో అనధికార వన్డేలో ఇండియా-A 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా-A 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇండియా-A 252 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడు అనధికార వన్డే మ్యాచ్ల సిరీస్ను ఇండియా-A.. 2-1తో కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఈ ద్వయం చాంగ్ చి- లీ వీ (చైనీస్ తైపీ) జంటను చిత్తు చేసి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ ఇండోనేసియా ప్లేయర్ల చేతిలో ఓటమిపాలైంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. గౌహతి పిచ్ను క్యూరేటర్ ఎర్రమట్టితో సిద్ధం చేశారు. దీంతో ఎక్కవ పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా కోరినట్లు పిచ్లో టర్న్ ఉంటుంది. అయితే, బౌన్స్ మరీ ఎక్కువగా ఉండకుండా క్యూరేటర్లు జాగ్రత్త తీసుకున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో భాగంగా నవంబర్ 21 నుంచి జరిగే తొలి టెస్టుకు ఇంగ్లంగ్ తమ జట్టును ప్రకటించింది. 12 మంది సభ్యుల ఈ టీమ్ను స్టోక్స్ నడిపించనున్నాడు.జట్టు: బెన్ స్టోక్స్(C), జోఫ్రా ఆర్చర్, గస్ ఆట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైండన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, మార్క్ వుడ్
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 3వ అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A ఓపెనర్లు ప్రిటోరియస్(123), మునుస్వామి(107)సెంచరీలతో రాణించారు. దీంతో ప్రోటీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. భారత్-A బౌలర్లలో ఖలీల్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ సేన విజయ లక్ష్యం 326. అంతకుముందు 2 మ్యాచుల్లోనూ భారత్-A గెలిచిన సంగతి తెలిసిందే.
మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడని, టీమిండియాతోపాటు గౌహతికి వెళ్తాడని BCCI తెలిపింది. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, సౌతాఫ్రికాతో ఈ నెల 22 నుంచి జరిగే 2వ టెస్టులో ఆడతాడో లేదో అప్పటి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుందని పేర్కొంది. కాగా తొలి టెస్ట్ 2వ రోజు గిల్ మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ(140* ) తమిళనాడుపై వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 9వ సెంచరీ. కాగా అంతకుముందు ఆంధ్రా జట్టుపై ఆడిన మ్యాచులోనూ రింకూ అజేయంగా 165 రన్స్(13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన సంగతి తెలిసిందే.