స్వదేశంలో గతేడాది నూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్వాష్ అయిన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలో 2-0 క్లీన్ స్వీప్ అయింది. తాజా సిరీస్ తొలి టెస్ట్ను 30 రన్స్తో, రెండో మ్యాచ్ను 405 పరుగులతో కోల్పోయింది. కోల్కతాలో బౌలర్లు రాణించినా.. గౌహతిలో అందరూ చేతులెత్తేశారు. 2001 తర్వాత భారత్లో సఫారీలు టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయింది. గౌహతి టెస్ట్లో 408 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 27/2 స్కోర్తో ఐదో రోజు ఆట ప్రారంభించి 140 పరుగులకే ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి భారత్ 90/5 పరుగులు చేసింది. జట్టు విజయానికి ఇంకా 459 రన్స్ కావాల్సి ఉంది. సుదర్శన్(14*), జడేజా(23*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), కుల్దీప్ (5), జురెల్ (2), పంత్ (13) తేలిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు.
ప్రస్తుత నవంబర్ నెల భారత మహిళా క్రీడాకారిణులకు చాలా స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఈ నెల 2న క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అలాగే 23న అంధుల క్రికెట్ టీమ్ అరంగేట్ర T20 ప్రపంచకప్ విన్నర్గా నిలవగా.. 24న కబడ్డీ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఏడాది ఆరంభంలోనూ(ఫిబ్రవరి 2) భారత మహిళా క్రికెటర్లు U19 T20 వరల్డ్ కప్ నెగ్గారు.
దేశవాళీ T20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-2025కి రంగం సిద్ధమైంది. టోర్నీలో ఇవాళ మొత్తం 16 మ్యాచులు జరగనున్నాయి. 9:30AM, 11AM, 1:30PM, 4:30PMకి నాలుగేసి మ్యాచులు జరుగుతాయి. ఆంధ్రా జట్టు అసోం(1:30PM)తో, హైదరాబాద్ మధ్యప్రదేశ్(4:30PM)తో తలపడనున్నాయి. 2026 T20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య, హార్దిక్, శాంసన్ తదితరులు కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు.
TG: మహిళా షూటర్ ఈషాసింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్భగవత్ను కలిసింది. ఈజిప్టులో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీల్లో ఈషాసింగ్ కాంస్యపతకం గెలుచుకోవడంతోపాటు 10 మీటర్ల ఎయిర్పిస్టల్ విభాగంలో మిక్స్డ్, బృంద పోటీల్లోనూ ఈషాసింగ్ మరో రెండు రజత పతకాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను డీజీపీ అభినందించారు.
స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో ఆమె వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, వివాహం వాయిదా పడటానికి ఇది కారణం కాదని.. స్మృతికి కాబోయే భర్త వేరే అమ్మాయితో చేసిన ఛాటింగ్ లీక్ కావడంతో పెళ్లి అగిపోయిందని SMలో ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అయితే, దీనిపై ఈ జంట స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మెన్స్ T20 ప్రపంచకప్లో గ్రూప్-Aలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్ను యూఏఈతో తలపడనుంది.✦ ఫిబ్రవరి 7: యూఏఈ (వేదిక: ముంబై)✦ ఫిబ్రవరి 12: నమీబియా (వేదిక: న్యూ ఢిల్లీ)✦ ఫిబ్రవరి 15: పాకిస్తాన్ (వేదిక: కొలంబో)✦ ఫిబ్రవరి 18: నెదర్లాండ్స్ (వేదిక: అహ్మదాబాద్)
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న T20 ప్రపంచకప్లో 20 జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపులో 5 టీమ్లుగా మొత్తం నాలుగు గ్రూపులను చేశారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ జట్లు ఉన్నాయి. కొలంబో వేదికగా FEB 15న భారత్, పాక్ తలపడనున్నాయి. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. WC షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, మెన్స్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. WC షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, మెన్స్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
మెన్స్ T20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ICC ఛైర్మన్ జై షా తాజాగా విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం 8 వేదికలను ఎంపిక చేసినట్లు జై షా తెలిపారు. భారత్ నుంచి అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతో పాటు శ్రీలంక నుంచి 3 వేదికలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో తీవ్రంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ తాను జిమ్లో వ్యాయామాలు చేస్తున్న ఫొటోను స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతడు త్వరలోనే తిరిగి భారత్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు గూడ్న్యూస్గా చెప్పవచ్చు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత్లో ల్యాండ్ అయ్యాడు. ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం లండన్ నుంచి కోహ్లీ ఈ రోజు భారత్కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో కోహ్లీని చూసిన అభిమానులు అతడి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ‘KING IS BACK’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, భారత్ ముందు 548 పరుగుల భారీ టార్గెట్ను ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 14, రాహుల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. చివరి రోజు ఆటలో IND విజయానికి 522 పరుగులు, SAకు 8 వికెట్లు కావాలి.