టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ(140* ) తమిళనాడుపై వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 9వ సెంచరీ. కాగా అంతకుముందు ఆంధ్రా జట్టుపై ఆడిన మ్యాచులోనూ రింకూ అజేయంగా 165 రన్స్(13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా ODI కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ ఆటకు దూరమైన క్రమంలో మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్కి జట్టు పగ్గాలు ఇస్తామన్నా వద్దంటాడని, కాబట్టి KL రాహుల్కి సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. అతనికి కెప్టెన్గా, ఆటగాడిగా అనుభవం ఉందని, సౌతాఫ్రికాతో ODI సిరీస్లో INDని నడిపించగలడని పేర్కొన్నాడు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్-A జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 135/7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హర్ష్ దూబే అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(12) నిరాశపరిచాడు.
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్-Aతో దోహా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఒమన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నిర్ణీత 20 ఓవర్లలో 135/7 పరుగులు చేసింది. వశీమ్ అలీ (54*) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత్ బౌలర్లలో సుయాష్ శర్మ, గుర్జప్నీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈనెల 22 నుంచి గౌహతిలో భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్టు కాస్త విభిన్నంగా ఉండనుంది. సాధారణంగా ఏ టెస్టు మ్యాచ్లోనైనా లంచ్ బ్రేక్ తర్వాత టీ విరామం ఉంటుంది. కానీ, రెండో టెస్టులో తొలుత టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత భోజన విరామం ఉంటుంది. పగటిపూట జరిగే టెస్టుల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. గౌహతిలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేశారు.
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ వేళ శ్రీలంకకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు. తాజాగా స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ విజయకాంత్ను జట్టులోకి తీసుకుంది. అతడిని స్వదేశంలో భవిష్యత్ హసరంగగా కీర్తిస్తుంటారు.
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఆజమ్కు భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన వన్డేలో బాబర్ ఔటైన తర్వాత వికెట్లను బ్యాట్తో కొట్టాడు. దీంతో ఐసీసీ అతడికి జరిమానా విధించింది. ఓ డీమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. కాగా, ఐసీసీ చర్యలను బాబర్ కూడా అంగీకరించాడు.
ఏటీపీ ఫైనల్స్ టెన్నీస్ టోర్నమెంట్లో ఇటలీ స్టార్ యానిక్ సినర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో స్పెయిన్కు చెందిన అల్కరాస్పై అతడు విజయం సాధించాడు. రెండో సెట్లో తొలి గేమ్లోనే సర్వీస్ కోల్పోయినా సినర్ పుంజుకున్నాడు. పన్నెండో గేమ్లో అల్కరాస్ సర్వీస్ బ్రేక్ చేసి సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతున్నాడు. యూఏఈ అండర్ 19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై ఒమన్కు చెందిన ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ ప్రశంసలు కురిపించారు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్స్లు బాదుతున్నాడని కితాబిచ్చారు.
డెఫ్లింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత షూటర్ అనుయ ప్రసాద్ సత్తా చాటింది. ఫైనల్లో అనుయ 241.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఇది డెఫ్లింపిక్స్ ఫైనల్ ప్రపంచ రికార్డు. ఇదే విభాగంలో ప్రాంజలి రజతం సాధించింది. మరోవైపు పురుషుల విభాగంలో అభినవ్ దేశ్వాల్ రజతం గెలుచుకున్నాడు.
2026 ఫుట్బాల్ ప్రపంచకప్కు పోర్చుగల్, నార్వే అర్హత సాధించాయి. ఆర్మేనియాతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో పోర్చుగల్ గెలుపొందింది. మరో మ్యాచ్లో ఇటలీని నార్వే ఓడించింది. కాగా, ఆతిథ్య హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో నేరుగా బెర్తు దక్కించుకున్నాయి. 48 జట్లు పోటీపడే 2026 ప్రపంచకప్కు ఇప్పటికే 32 జట్లు అర్హత సాధించాయి.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. మంచి టెక్నిక్, అంకితభావంతో క్రీజులో పాతుకుపోయాడని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా టీమిండియా బ్యాటర్లు ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. నిద్రలేమి వల్ల గిల్ మెడ కండరం పట్టేసిందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరించాడు. దీంతో అతడు రెండో టెస్టులోనూ ఆడేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు వహించే అవకాశముంది. అయితే, దీనిపై BCCI నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, శనివారం నుంచి జరగనున్న రెండో టెస్టులో గిల్ ఆడకుంటే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రుతురాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని తెలిపాడు. రంజీ, దులీప్ ట్రోఫీల్లో చక్కగా రాణించాడని వెల్లడించాడు.