పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ మూవీ టీమ్ గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండితెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. కాగా ఈ మూవీ వేసవి కానుకగా మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్కు ఇస్తారు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 3 సార్లు (2015-562, 2017-641, 2019-692), విరాట్ కోహ్లీ 2 సార్లు (2016-973, 2024-741), క్రిస్ గేల్ 2 సార్లు (2011-608, 2012-733) ఆరెంజ్ క్యాప్ గెలిచారు. వార్నర్ మూడుసార్లు గెలిచిన ఏకైక ఆటగాడు. గేల్ వరుసగా రెండు సార్లు గెలిచాడు. 2025లో ఎవరు గెలుస్తారో చూడాలి.
HNK: గోవాలో ఐదు రోజులపాటు జరిగే నలభై ఏడవ భారత మాస్టర్స్ (వెటరన్) నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు హనుమకొండ జేఎన్ఐఎస్ నుండి 18 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు నేడు వెళ్లారు. టీబిఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షటిల్ క్రీడాకారులు ఉత్సాహంగా హనుమకొండ నుండి గోవా బయలుదేరారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి అశ్విన్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. తన వందో టెస్టు జ్ఞాపికను అందజేయడానికి రమ్మని ధోనీని ఆహ్వానించినట్లు వెల్లడించాడు. కానీ, ధోనీ రాలేకపోయినట్లు తెలిపాడు. అయితే, మళ్లీ CSKకు తీసుకుని తనకు గిఫ్ట్ ఇస్తాడని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. తనవల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ బ్రాడ్కాస్టర్స్కు చురకలంటించాడు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రసారకర్తల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నేను ఏం తింటున్నాను? నాకు ఇష్టమైన చోలే బటూరే ఢిల్లీలో ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాలపై చర్చ అవసరం లేదు. దానికి బదులుగా ఒక అథ్లెట్గా ఏం చేస్తున్నా అనే దానిపై చర్చించవచ్చు’ అని పేర్కొన్నాడు.
WPL ఫైనల్లో ముంబై ఇండియన్స్కి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఈ టోర్నీలో అద్భుత ఫామ్లో ఉన్న హేలీ మాథ్యూస్ను ఢిల్లీ బౌలర్ మారిజాన్ కాప్ పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం బ్రంట్(1*), భాటియా(4*) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో ముంబై స్కోర్: 10/1.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ రెండో సెమీఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్ చేరింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 179/5 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 173/9 పరుగులకే పరిమితం అయింది. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇండియాతో వెస్టిండీస్ తలపడనుంది.
WPL లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన RCB 3 వికెట్ల నష్టానికి199 పరుగులు చేసింది. ఛేసింగ్లో ఛేసింగ్లో చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు 188 పరుగులకే ముంబైని కట్టడి చేశారు. దీంతో RCB 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్వదేశంలో పాకిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా బ్రేస్వెల్ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్తో పాటు కీలక ఆటగాళ్లుకు రెస్ట్ ఇచ్చింది. దీంతో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. ఈ సిరీస్లో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది. దీంతో టీమిండియా రూ.19 కోట్ల 52 లక్షల భారీ ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ రూ.9 కోట్ల 76 లక్షలు పొందింది. సెమీస్లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు దాదాపు రూ.4.87 కోట్లు అందుకున్నాయి. గత సీజన్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 53 శాతం పెరిగింది.
ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అయితే, ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ఏ ప్రతినిధి లేకపోవడంపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. పీసీబీ తీరుపై విమర్శలు గుప్పించాడు. ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్కు చెందిన ఒక్క ప్రతినిధి లేకపోవడం బాధగా ఉందన్నాడు. ఎందుకు పీసీబీ ప్రతినిధిని పంపించలేదని ప్రశ్నించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు బిగ్ షాక్ తలిగింది. 122 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గిల్ (31), కోహ్లీ (1) తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరారు. ఇక ఇన్నింగ్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (76) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో శ్రేయస్ (15*), అక్షర్ (0*) పరుగులతో ఉన్నారు.
న్యూజిలాండ్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 37.5వ ఓవర్కు గ్లెన్ ఫిలిప్స్ ((34) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో మిచెల్, ఫిలిప్స్ 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 38 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 165/5. మైకేల్ బ్రాస్వెల్ (0*), డారిల్ మిచెల్ (44*) క్రీజులో ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.IND: రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్, అక్షర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి.NZ: యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్వెల్, శాంట్నర్, జేమీసన్, నాథన్ స్మిత్, విలియమ్ రూరౌర్కీ.
న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకోనున్నాడు. కోహ్లీకి ఈ మ్యాచ్ అంతర్జాతీయ కెరీర్లో 550వ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్(664) మాత్రమే ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో ప్లేయర్గా కోహ్లీ నిలవనున్నాడు. ఓవరాల్గా ఆరోవ ప్లేయర్గా నిలుస్తాడు.