తమిళనాడులో జరుగుతోన్న జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం అర్జెంటీనాతో జరిగిన పోరులో భారత్ 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ టోర్నీ చరిత్రలో భారత్ మెన్స్ జట్టు కాంస్యం సాధించడం ఇదే తొలిసారి. 1997లో రజతం, 2001, 2016లో స్వర్ణం సాధించింది.
టీమిండియాలో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్, జితేశ్ శర్మల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కూడా శాంసన్ను కాదని జితేశ్కు అవకాశం ఇచ్చారు. మ్యాచ్ అనంతరం జితేశ్ మాట్లాడుతూ.. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే అని చెప్పాడు. శాంసన్ తనకు పెద్దన్నలాంటి వాడని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో అతను తనకు చాలా సహాయం చేసినట్లు పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో కోహ్లీ 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో టాప్ రన్ స్కోరర్గా(302*) నిలవడంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని.. రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగతున్నాడు. కాగా, 2021 తర్వాత కోహ్లీ వన్డేల్లో ఇప్పటివరకు అగ్రస్థానానికి చేరుకోలేదు.
పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP) కోచ్ వెంకట్రామన్పై ముగ్గురు అండర్-19 క్రికెటర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ తలకు గాయం కావడంతో 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతో క్రికెటర్లు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. స్థానికులకు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లతో నాన్ లోకల్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నట్లు CAPపై ఆరోపణలు వస్తున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీని 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వాళ్లు ఫామ్లో లేకపోతే జట్టులో ఉండటం కష్టమని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్, కోహ్లీ కంటే మెరుగైన బ్యాటర్లున్నారా?.. లేరు కాబట్టి వారిని జట్టులోంచి తప్పించాలని చూడొద్దు’ అని చెప్పుకొచ్చాడు.
అర్ష్దీప్ తొలి T20 పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు)లో అత్యధికంగా 47 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా భువనేశ్వర్ రికార్డును సమం చేశాడు. మరో వికెట్ తీస్తే ఈ రికార్డ్ అర్ష్దీప్ సొంతం కానుంది. ఇక ఈ లిస్టులో బుమ్రా(33) రెండో స్థానంలో ఉండగా.. అక్షర్, సుందర్(21) మూడో స్థానంలో ఉన్నారు.
విండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ T20 క్రికెట్లో ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో 5000 రన్స్, 500 సిక్సర్తోపాటు 500 వికెట్లు పడగొట్టిన తొలి & ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 577 మ్యాచులు ఆడిన రస్సెల్.. 9508 రన్స్, 774 సిక్సర్స్, 500 వికెట్లు పడగొట్టాడు. అలాగే T20ల్లో 500+ వికెట్లు తీసిన 6వ ఆటగాడిగానూ నిలిచాడు.
టీమిండియా పేసర్ బుమ్రా 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడంపై అర్ష్దీప్ హర్షం వ్యక్తం చేశాడు. బుమ్రా కూడా 100 వికెట్ల క్లబ్లో చేరడం గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు. అతను వందో వికెట్ సాధించగానే దగ్గరికి వెళ్లి అభినందించినట్లు తెలిపాడు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎల్లప్పుడూ సరదగా ఉంటుందని పేర్కొన్నాడు.
తొలి టీ20లో సాతాఫ్రికా బ్యాటర్లకు మన బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో సౌతాఫ్రికా కేవలం 50 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్(0), మార్క్రమ్(14), స్టబ్స్(14), మిల్లర్(1), పెరారీయా(5) వికెట్లు పడ్డాయి. బౌలర్లలో అర్ష్దీప్ 2 వికెట్లు తీయగా, చక్రవర్తి, అక్షర్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. క్రీజులో బ్రెవిస్(21), యాన్సెన్(6) ఉన్నారు.
సౌతాఫ్రికాతో తొలి T20లో అర్ష్దీప్ సింగ్ టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతడు తన తొలి ఓవర్లోని రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ను డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. తన తర్వాతి ఓవర్లో స్టబ్స్(14)ను ఔట్ చేశాడు. దీంతో 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సౌతాఫ్రికా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం నుంచి కోలుకుని, భారత జట్టులోకి తిరిగి వచ్చిన అతడు కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో పాండ్యా 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో, టీమిండియా తరఫున T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 100 సిక్సర్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ (4) వికెట్ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ సూర్య(12) కూడా భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో భారత్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు కూడా లుంగి ఎంగిడి పడగొట్టాడు.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికాతో ఈరోజు జరగబోయే తొలి టీ20లో అందరి కళ్లు అభిషేక్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘అభిషేక్తో కలిసి SRHకు ఆడాను. అతడు విధ్వంసక ఆటగాడు. ఈ మ్యాచ్లో అతడి వికెట్ చాలా కీలకం. పవర్ ప్లేలో అతడిని అడ్డుకోవడం బౌలర్లకు సవాలే’ అని పేర్కొన్నాడు.