విరాట్ కోహ్లీపై RCB ప్లేయర్ జాకబ్ బెథెల్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని బెథెల్ పేర్కొన్నాడు. అలాగే, కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం తనకు ఒక కలలా ఉందని తెలిపాడు. ముఖ్యంగా ఛేజింగ్లో కోహ్లీ ఆడే తీరును చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్ IPLలో అదరగొడుతున్నాడు. టెస్టు బౌలర్గా ముద్రపడిన సిరాజ్, తాను పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అద్భుతాలు చేయగలనని నిరూపిస్తున్నాడు. ప్రస్తుత IPL సీజన్లో తన బౌలింగ్తో GT విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 10 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టిన సిరాజ్, ఈ సీజన్లో అత్యధికంగా 109 డాట్ బాల్స్ వేసి రికార్డు సృష్టించాడు.
KKR స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న DCతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సాల్ట్, ఆ గాయానికి స్కానింగ్ చేయించుకోవడం కోసం ఇంగ్లండ్ వెళ్లినట్లు సమాచారం. అయితే, అతడు త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతాడని RCB యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, వారం రోజుల విరామం లభించడంతో RCB ప్లేయర్లు మాల్దీవులలో సేదతీరుతున్నారు.
IPL చరిత్రలో MI, LSG జట్ల మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డుల్లో లక్నో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. LSG 6, MI 2 సార్లు గెలిచాయి. అలాగే, వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్లలో ముంబై 3, లక్నో 3 సార్లు గెలిచాయి. దీంతో ఇవాళ్టి పోరులో విజయం ఎవరు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.
క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్ధలు కొట్టాడు. ఐపీఎల్లో తన మొదటి 50 ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు(2178 రన్స్) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు 2061 పరుగులతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. మిచెల్ మార్ష్ 1933 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి మ్యాచ్తో ఒక కొత్త ఆటగాడు టాప్ ఆర్డర్లోకి వస్తున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ(440 రన్స్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేఎల్ రాహుల్(433 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్(425పరుగులు), వైభవ్ సూర్యవంశీ(404 పరుగులు), సాయి సుదర్శన్(385 పరుగులు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.
కోల్కతా నైట్రైడర్స్ చేతిలో పరాజయంపై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘మేము శుభారంభం అందుకున్నప్పటికీ దానిని కొనసాగించలేకపోయాము. కనీసం 180-200 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. నాలుగో ఓవర్లో నేను ఏకంగా 27 పరుగులు ఇవ్వడం మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. చిన్న చిన్న తప్పిదాలే తీవ్ర ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు.
IPLలో వరుస విజయాలతో దూసుకెళ్లిన టాప్-4 జట్లు (PBKS, RCB, SRH, RR) గత నాలుగు రోజులుగా తడబడుతున్నాయి. ఏప్రిల్ 30న RCB, మే 1న RR, మే 3న హైదరాబాద్, పంజాబ్ జట్లు ఓటమి పాలయ్యాయి. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మార్పులు లేకపోయినా.. GT, KKR, CSK, DC జట్లు పుంజుకుంటే సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
IPL -2026లో ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన చేస్తోంది. MI ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వెనక హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఉందని కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. హార్దిక్ ఓ ప్లాస్టిక్ కెప్టెన్ అని.. అతని చెత్త నిర్ణయాల కారణంగా MI ఈ పరిస్థితిలో ఉందని విమర్శలు చేశారు. అతనికి కెప్టెన్సీ పనికిరాదని విమర్శించారు. రోహిత్ శర్మను వెంటనే జట్టులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
➤ 1777: జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్ జననం➤ 1870: సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం ➤ 1910: మహాకవి శ్రీశ్రీ జననం➤ 1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం ➤ 1986: భారతీయ నౌకాదళంలో చేరిన INS సింధుఘోష్➤ 1987: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ జననం➤ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంఆయుష్మాన్ భారత్ దివస్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంలో జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం వైభవ్పై యశస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. వైభవ్ నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్ని చూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని SRH 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్ (76), క్లాసెన్ (65*) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అభిషేక్ శర్మ (45), సలీల్ అరోరా (30*) పరుగులు చేశారు.
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో SRH బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్లాసెన్ (42*), నితీష్ కుమార్ రెడ్డి (14*) ఉన్నారు. హైదరాబాద్ విజయానికి 36 బంతుల్లో 55 పరుగులు అవసరం.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో SRH వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఘజన్ ఫర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ (45) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ (0) గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. SRH విజయానికి 66 బంతులకు 114 పరుగులు అవసరం.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (36), ట్రావిస్ హెడ్ (48) పరుగులతో క్రీజులో ఉన్నారు. SRH విజయానికి 84 బంతుల్లో 152 పరుగులు అవసరం.