ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్హక్ కమిటీ కన్వీనర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ యాజమాన్యం ఖండించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, క్రీడా మంత్రికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అతడు చేసినవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది.
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్తో ‘Mr.CONSISTENT’గా మారాడు. ఈ సీజన్లో తను ఆడిన 8 మ్యాచ్ల్లో 5 అర్థ సెంచరీలు సాధించాడు. 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే త్వరలో టీమిండియాలో స్థానం సంపాదించే అవకాశం ఉంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గుర్బాజ్ (1), నరైన్ (17), వెంకటేశ్ అయ్యర్ (14) నిరాశపరిచారు. రహానె (50), రఘువన్షి (27*) ఆకట్టుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి.. 4 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది. అయినప్పటికీ CSKకు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 6 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లతో ఫ్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా CSK కథ ముగుస్తుంది.
రాజస్థాన్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్లో వైభవ్ వండర్ భాయ్ అని కొనియాడాడు. ఈ సందర్భంగా అతడికి అవకాశం ఇచ్చిన రాజస్థాన్కు అభినందించాడు. వైభవ్ కొట్టిన తొలి రెండు సిక్స్లు అద్భుతమైన బంతులకు వచ్చినవేనని వెల్లడించాడు. తన ఆటతో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
జైపూర్ వేదికగా రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జైస్వాల్ (74) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) రాణించినా విజయం అందించలేకపోయారు. LSG బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.
వాంఖడే వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21*) పరుగులు చేశారు. SRH బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీశాడు.
NTR: 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్-18 కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, మల్కబ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఈనెల 16వ తేదీన ఎంపిక చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) వీసీ ఎండీ గిరీషా పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయన్నారు.
IPL 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నోపై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది.
IPL పునరాగమనంలో MIతో జరిగిన మ్యాచ్లో DC ఆటగాడు కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ‘నాయర్ పట్టుదల అద్భుతం.. మంచి ఫామ్లో ఉన్నాడు.. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయాలి’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ నుంచి టీమిండియా ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని MIకాపాడుకుంది. ఈ ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. కారుణ్ నాయర్ (89) పరుగులు చేసినప్పటికీ ఢిల్లీకి ఫలితం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఢిల్లీకి ఇది తొలి ఓటమి
PBKSతో జరిగిన మ్యాచ్లో SRH ఘన విజయం సాధించింది. తొలుత PBKS నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం SRH 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 141 పరుగులతో విజృభించాడు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ మొదటి వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏ దశలోనూ PBKS బౌలర్లు SRH బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ మోస్తరు స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఓ దశలో 200 ప్లస్ పరుగులు చేసేలా కనిపించినా.. LSG బౌలర్లు వరుస వికెట్లతో స్కోరును కట్టడి చేశారు. గిల్, సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. శార్దూల్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. LSG టార్గెట్ 181.
IPLలో GT బ్యాటర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డును సాధించాడు. IPLలో మొదటి 30 ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. అతడు 30 ఇన్నింగ్స్ల్లో 1307 పరుగులు చేశాడు. ఓవరాల్గా చూస్తే రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో షాన్ మార్ష్-1338 పరుగులతో కొనసాగుతున్నాడు. తర్వాత స్థానాల్లో గేల్(1141), విలియమ్సన్(1096), హేడెన్(1082) ఉన్నారు.
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. RR 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో GTకి ఈ విజయం దక్కింది. ప్రసిద్ధ్ 3 వికెట్లు పడగొట్టాడు. కిశోర్, రషీద్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్, కుల్వంత్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటర్లలో హిట్మెయిర్(52), సంజూ(41) రాణించిన ఫలితం దక్కలేదు.