మహిళల T20ల్లో వెస్టిండీస్పై ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. విండీస్ 20 ఓవర్లలో 141/8 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 14.1 ఓవర్లలో 95/5 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో DLS ప్రకారం ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది.
IPL-2026 విజేతగా నిలిచిన RCB విజయోత్సవ వేడుకలపై ఆ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది RCB విజయోత్సవ వేడుకల్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, ఈ సారి విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని నిర్ణయించింది. అలాగే కర్ణాటక CMగా శివకుమార్ ప్రమాణ స్వీకారం, మరోవైపు పలువురు ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాలో చేరనుండటంతో విజయోత్సవ వేడుకలు చేయట్లేదని తెలిపింది.
RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ ఫిన్ స్పందించాడు. ‘అతన్ని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకురావాలి. UK వేసవి సీజన్లోనే భారత జెర్సీలో వైభవ్ను చూడాలని ఉంది. భారత జట్టు ఓపెనింగ్లో ఇప్పటికే అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. అందువల్ల ఎవరిని పక్కనబెట్టి వైభవ్కు అవకాశం ఇవ్వాలన్నది కఠిన నిర్ణయమే’ అని అన్నాడు.
IPL ముగియడంతో టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్పై పూర్తి ఫోకస్ పెట్టనుంది. భారత జట్టు సుమారు 10 టెస్టులు, 20 ODI, 23 T20 మ్యాచ్లు ఆడనుంది. ఈ బిజీ షెడ్యూల్లో భాగంగా అఫ్గాన్తో(1టెస్టు, 3 ODI), ఐర్లాండ్తో (2 T20)లు, ఇంగ్లాండ్తో(5 T20లు, 3 ODI), జింబాబ్వేతో (3 టీ20లు, 3ODI) ఆడనుంది. ఆసీస్ సిరీస్, ఆసియా గేమ్స్ కూడా ఉన్నాయి.
దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత జట్టు వరుసగా రెండో విజయంతో అదరగొట్టింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్తో ఘనవిజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రేపు జరిగే సెమీఫైనల్లో భూటాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. కాగా, తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 11–0 గోల్స్ తేడాతో మాల్దీవులు జట్టును చిత్తు చేసింది.
భారత్లో ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రసార హక్కులపై క్లారిటీ వచ్చింది. జూన్ 11న ప్రారంభం కానున్న టోర్నీలో మ్యాచ్లు జీ స్పోర్ట్స్లో ప్రసారం కానున్నాయి. ఫిఫాతో 8 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఈ ప్రపంచకప్తో పాటు 2030 వరల్డ్కప్, 2027 ఫిఫా మహిళల ప్రపంచకప్ వంటి ఇతర 39 ఈవెంట్ల ప్రసారాల హక్కుల్ని దక్కించుకుంది.
IPL రెండు సీజన్లలో ఛాంపియన్గా గెలిచిన టీమ్లో అత్యధిక రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. బెంగళూరు తరఫున 2025(657 R), 2026(675 R)లో విరాటే హయ్యెస్ట్ రన్ స్కోరర్. గతంలో 17 మంది ఒక్కోసారి ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా, కోహ్లీ RCB తరఫున 9,336* పరుగులు చేశాడు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న ABD చేసిన రన్స్ 4,522.
GTతో ఫైనల్లో అంపైర్పైకి ఐస్ బ్యాగ్ విసిరిన RCB ప్లేయర్ టిమ్ డేవిడ్పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 50% కోత విధించి, 2 డీమెరిట్ పాయింట్లు చేర్చారు. దీంతో అతని మొత్తం డీమెరిట్ పాయింట్లు 5కు చేరడంతో నియమాల ప్రకారం నిషేధం పడింది. ఫలితంగా వచ్చే సీజన్ తొలి మ్యాచ్కు అతడు దూరం కానున్నాడు.
1. వెలుతురు తక్కువగా ఉండే సమయంలో టెస్టుల్లో గులాబీ బంతిని ఉపయోగించవచ్చు.2. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ను అంచనా వేయడానికి అంపైర్లు ‘హాక్-ఐ’ను వాడవచ్చు.3. అధికారిక డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్లు ఆటగాళ్లతో మాట్లాడవచ్చు.4. T20ల్లో 15 నిమిషాల ఇన్నింగ్స్ బ్రేక్ తప్పనిసరి.5. OCT 1, 2026 నుంచి న్యూ రూల్స్ అమలులోకి రానున్నాయి.
భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య రేపు కీలకమైన మూడో టీ20 జరగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఇరుజట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో లేదా SonyLiv యాప్లో ఈ మ్యాచ్ను లైవ్లో చూడవచ్చు.
ICC ఛైర్మన్ జయ్ షా నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027లో జరగనున్న మహిళల మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను సవరించి, ఆ టోర్నీని ఫిబ్రవరి 14-28 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, 2028లో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో.. భారత్ తన మ్యాచ్లను తటస్థ వేదికల్లో ఆడటానికి ఐసీసీ అంగీకారం తెలిపింది.
IPL-2026 సీజన్లో RCB, GT మధ్య జరిగిన గ్రాండ్ ఫైనల్.. అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా సరికొత్త రికార్డు సృష్టించింది. డిజిటల్ ప్లాట్ఫామ్ ‘జియోహాట్స్టార్’లో ఈ ఫైనల్ మ్యాచ్కు ఏకంగా 512 మిలియన్ల (51.2 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇక లీగ్ దశ మ్యాచ్ల్లో.. RCB, SRH మధ్య జరిగిన సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ 426 మిలియన్ల వీక్షణలతో రెండో స్థానంలో నిలిచింది.
IPL-2026లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు నమోదు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. DCతో జరిగిన మ్యాచ్లో PBKS 265/4 పరుగులు చేసి ఈ సీజన్లోనే అత్యధిక టీమ్ స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో DC(264/2), SRH(255/4), LSG(254/7), RCB(254/5) నిలిచాయి. కాగా, GTతో జరిగిన క్వాలిఫయర్-1లో RCB చేసిన 254/5 పరుగులే IPL ప్లే ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్.