న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూశాంసన్ సరికొత్త రికార్డు సంపాదించుకున్నాడు. అత్యధిక వరుస 50+ స్కోర్ ( వరుసగా మూడో హాఫ్ సెంచరీ) సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. గతంలో టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ సంజూశాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ(50*) పూర్తి చేసుకున్నాడు. గతంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇటీవల తన అద్భుత ప్రదర్శనతో తనదైన మార్క్ వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 137/1గా ఉంది.
న్యూజిలాండ్తో జరుగుతన్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 127/1 పరుగులు చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో (52) మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్(48), ఇషాన్ కిషన్(19) పరుగులతో ఉన్నారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో (51*) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గత కొంత కాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్న అభిషేక్ తన సత్తా చాటాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కఠిన పరిస్థితుల్లో అభిషేక్కు తన తండ్రి అండంగా నిలిచారు. ‘అభిషేక్ ఫైనల్లో ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతాడు.. తన బ్యాటింగ్తో ఇండియాను కచ్చితంగా గెలిపిస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు అభిషేక్కు మానసికంగా చేకూరస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. T20 WC చరిత్రలో ఈ జట్లు ఫైనల్లో నిలవడం ఇదే తొలిసారి. అయితే, ICC నిర్వహించిన వన్డే, టెస్టు ఫార్మాట్లలో మూడుసార్లు ఫైనల్లో తలపడ్డాయి. వాటిలో కివీస్ 2 సార్లు, భారత్ ఒకసారి గెలిచాయి.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచకప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీ అవార్డు విన్నర్, ప్రముఖ సింగర్ రిక్కీ మార్టిన్, పంజాబీ పాపులర్ సింగర్ సుఖ్బీర్ సింగ్ ప్రత్యేక ఆటపాటలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘మైదానంలో సిక్సర్లు బాది జీవితాంతం హిట్లు కొట్టాను. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!’ అని రాసుకొస్తూ.. నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘మైదానంలో సిక్సర్లు బాది జీవితాంతం హిట్లు కొట్టాను. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!’ అని రాసుకొస్తూ.. నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ టీమిండియా బౌలర్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నా మంత్రం చాలా స్పష్టం. బంతిని చూసి ఆడతాను తప్ప, బౌలర్ పేరును చూసి కాదు. అవతల బుమ్రా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని ఆలోచిస్తే.. ఆట కంటే ఒత్తిడికే ఎక్కువ లోనవుతాం. అందుకే నేను బౌలర్ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా కేవలం బాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా’ అని పేర్కొన్నాడు.
T20 WC ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీమిండియా T20 WC చరిత్రలో న్యూజిలాండ్పై ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత్ ఓటమి పాలైంది. ఈరోజు ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
T20 WC ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు యాక్టివ్ అయ్యారు. NZపై రూ. వెయ్యికి.. 2900, INDపై రూ. వెయ్యికి.. 400 ఇస్తామని వల వేస్తున్నారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా?.. ఉండడా అని కొందరు పందెం వేస్తున్నారు. మరోవైపు స్కోర్ 180 దాటుతుందా? ఏ బ్యాటర్ ఎంత స్కోర్ చేస్తాడో అని మరి కొందరు బెట్టింగ్ వేస్తున్నారు.
భారత బాక్సింగ్ జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో ఈ నెల 3-11 వరకు జరగాల్సిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత జూనియర్ జట్టు పాల్గొనాల్సి ఉంది. వీసా స్టాంపింగ్ కోసం UAEకి పంపిన పాస్పోర్టులు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం నిలిచిపోయాయి. దీంతో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా టోర్ని నుంచి తప్పుకుంది.
T20 WC ఫైనల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగడం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంలో అహ్మదాబాద్లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది. భారత్ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నాడు.