నేషన్స్ కప్ ఫుట్బాల్లో భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో ఒమన్పై గెలిచింది. భారత్ తరఫున లలియాంజులా జితిన్, చంగ్తె, రాహుల్ బెకె స్కోర్ చేశారు. ఓ అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లో ఒమన్పై గెలవడం భారత్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అబుదాబిలో ఆఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్తో టోర్నీ మొదలుకానుంది. ఎనిమిది జట్ల ఈ సమరంలో టీమిండియా తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సూర్యకుమార్ సేన పోరు అత్యంత ఆసక్తి రేపుతోంది.
ఆసియా కప్ రేపటి నుంచి UAE వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా.. గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. ఆ తర్వాత సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.
ఆగస్టు నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. పురుషుల జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ, వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఈ అవార్డు కోసం బరిలో నిలిచారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో సిరాజ్ చేసిన అద్భత ప్రదర్శనకు గాను అతడు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యాడు.
ఐస్లాండ్కు చెందిన హాఫ్థోర్ బ్జోర్న్సన్.. వరల్డ్ స్ట్రాంగ్మాన్గా అవతరించాడు. బర్మింగ్హమ్లో జరిగిన 2025 వరల్డ్ డెడ్లిఫ్ట్ ఛాంపియన్షిప్లో 510kgల బరువును ఎత్తి ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న 505kgల రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, అతడు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్లో ‘ది మౌంటైన్’ పాత్రలో నటించాడు.
ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ ఈనెల 14న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్(BAN)ను ఎంపిక చేసింది. టీవీ అంపైర్గా అహ్మద్ పక్తీన్(AFG), ఫోర్త్ అంపైర్గా ఇజతుల్లా సఫీ(AFG), మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(ZIM) వ్యవహరించనున్నారు.
శుభ్మన్ గిల్ రాబోయే పదేళ్ల పాటు టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉంటాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. గిల్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఉండగల సమర్థుడు అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో సిరీస్లో గిల్ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. అలాగే, T20ల్లో గిల్ను వైస్ కెప్టెన్ చేయడం ద్వారా సూర్యపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పాడు.
ఆసియా కప్కు ముందు ఒమన్ ఆటగాడు సుఫ్యాన్ మెహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో పెద్ద జట్లకు షాక్ ఇస్తామని అతడు తెలిపాడు. ఆసియా కప్లో భారత్, పాక్, UAEలతో కూడిన గ్రూప్లో ఒమన్ ఉంది. తన తొలి మ్యాచ్లో పాక్తో తలపడనుంది. టీమిండియాతో సెప్టెంబర్ 19న ఆడనుంది. ఈ గ్రూప్లో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
VSP: నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ (సెప్టెంబర్ 12-14, కాకినాడ)లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు సభ్యులకు జెర్సీలను గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్ నాయుడు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. జట్టు కెప్టెన్ వాసుపల్లి నరేష్ సమిష్టి కృషితో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రికెటర్ క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ టీంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. ఐపీఎల్కు పేరు తెచ్చినా నన్ను చిన్న పిల్లాడిలా చూశారు’ అని అన్నారు. ఈ కారణంగా తొలిసారి డిప్రెషన్లోకి వెళ్లానని, అనిల్ కుంబ్లేతో మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు. రాహుల్ ఉండమని చెప్పినా వినకుండా తాను జట్టును వీడినట్లు తెలిపారు.
టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ పుట్టినరోజు సందర్భంగా BCCI అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 113 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 6వేల పరుగులు, 18 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడని పేర్కొంది. 2025 ICC ఛాంఫియన్ ట్రోఫి విజేత అని రాసుకొచ్చింది. ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే, టీ20 జట్లలో ఓపెనర్గా కొనసాగుతున్న గిల్, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
KDP: కలసపాడు మండలంలోని పుల్లారెడ్డి పల్లెలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీలో పాల్గొన వచ్చున్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.3వేలు అందజేస్తారన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొనే వారికి భోజన వసతి కల్పిస్తారని చెప్పారు.
2025 US ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. ఫైనల్లో యానిక్ సినర్ను ఓడించి, మళ్లీ ప్రపంచ నంబర్ 1గా నిలిచాడు. ఈ విజయంతో అల్కరాస్ ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్ను, ఈ ఏడాది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ను గెలిచాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ రెండు గంటల 42ని.లు సాగింది.
2025 US ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. ఫైనల్లో యానిక్ సినర్ను ఓడించి, మళ్లీ ప్రపంచ నంబర్ 1గా నిలిచాడు. ఈ విజయంతో అల్కరాస్ ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్ను, ఈ ఏడాది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ను గెలిచాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ రెండు గంటల 42ని.లు సాగింది.
వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ 414 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో, వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంకపై భారత్(317) పేరిట ఉండేది.