టీమిండియా మాజీ క్రికెటర్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రిషభ్ పంత్ను దృష్టిలో ఉంచుకోవాలని తొలుత సూచించినట్లు తెలిపాడు. అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ మంచి ఆప్షన్గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అక్షర్ సరిపోతాడని.. బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నాడు. రిషభ్ పంత్కు ఛాన్స్లు తక్కువేనని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని తెలిపాడు. మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్ను పక్కనపెట్టడం సరికాదన్నాడు.
E.G: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ క్రికెట్, వాలీబాల్ కిట్లు, క్రీడా ప్రాంగణానికి మూడు డే లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామ యువకులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగం చేశారు. ఈ సిరీస్లో అతడు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా భాగమయ్యే అవకాశం ఉంది.
ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచరులపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి చొరవ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.
U-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా అవతరించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 82 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్లో మన తెలుగమ్మాయి త్రిష(44) రాణించడంతో.. భారత్ కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, రైల్వేస్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సంగ్వాన్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో అభిమానులు స్టేడియం వదలివెళ్లిపోతుండటం గమనార్హం.
2036 ఒలింపిక్స్ అతిథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మౌళిక వసతుల్ని బలోపేతం చేస్తున్నామని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. ‘వసతులతో పాటు మేధో పరిశోధన సంసిద్ధత సామర్థ్యం బలోపేతంపై కూడా దృష్టిసారించాం. క్రీడల మౌళిక సదుపాయాలతో మెగా టోర్నీలు లాభాసాటిగా మారేందుకు ఎలాంటి ఆర్థిక నమూనాలు సహయపడతాయనే విషయాలపై చర్చించాలి’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్ కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, డైరెక్టర్ కుమార సంగక్కర ఇటీవల ఫ్రాంచైజీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వీరిద్దరూ కలిసి RR కొత్త జెర్సీని విడుదల చేశారు. ‘ఇద్దరు దిగ్గజాలు, ఒక జెర్సీ. రాజస్థాన్ రాయల్స్ ఈసారి IPL కప్ గెలవడానికి పక్కా ప్రణాళికతో వస్తుంది’ ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. మరొకరు.. ఈ సీజన్లో RR యాక్షన్ చూడాలని ఎదురుచూస్తున్నామని రీట్వీట్ చేశాడు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. దీనిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయవకాశాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడని తెలిపాడు. బ్యాటింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు.
KKD: జాతీయ స్థాయి స్కూల్ క్రీడా పోటీలకు పెద్దాపురంకు చెందిన విద్యార్థిని మన్యం పల్లవి ఎంపికైనట్లు పీడీ కామిరెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆర్బీపట్నం జడ్పీ స్కూల్లో ఆరో తరగతి చదివే మన్యం పల్లవి జిమ్నాస్టిక్స్లో ఎంపికైందన్నారు. ఆమె జనవరి 29-30 వరకు పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరిగే క్రీడల్లో అండర్-14 అమ్మాయిల కేటగిరీల్లో పాల్గొంటుందన్నారు.
VSP: జిల్లాకు చెందిన ఓలింపియన్ ఎర్రాజి జ్యోతి మరో అంతర్జాతీయ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫ్రాన్స్లో నాంటెక్స్ మెట్రో పోల్లో జరిగిన ఎలైట్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మహిళల 60 మీటర్ల హార్డిల్స్లో మంచి ప్రతిభ కనపర్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పతకం సాధించిన జ్యోతిని పలువురు అభినందిస్తున్నారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా జనిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్పై 6-3, 7-6, 6-3 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు. దీంతో ఇటలీ ఖాతాలో వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేరింది. విన్నర్గా నిలవాలనుకున్న జ్వెరెన్కు నిరాశ మిగిలింది. కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ చరిత్ర సృష్టించాడు. సాల్ట్, డకెట్ను ఔట్ చేయడం ద్వారా T20ల్లో అత్యధిక వికెట్లు(97) తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు చాహల్(96) పేరిట ఉండేది. అలాగే మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్గా అర్ష్దీప్ నిలుస్తాడు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో విఫలమైన విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు చాలా కీలకం అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఓటమిని ఓ పట్టాన కోహ్లీ అంగీకరించడని.. టీమ్లో అతడు స్ఫూర్తిని నింపుతాడని కైఫ్ అన్నాడు.