★ ఉమెన్స్ U19 వరల్డ్ కప్ – 2025★ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025★ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ – 2025★ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ – 2025★ మెన్స్ U19 వరల్డ్ కప్ -2026★ మెన్స్ T20 వరల్డ్ కప్ – 2026
➤ 3 ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు(2007, 2024, 2026)➤ వరుసగా రెండో ట్రోఫీ సాధించిన టీమ్(2024, 2026)➤ స్వదేశంలో టైటిల్ నెగ్గిన ఏకైక జట్టు(2026)➤ ఫుల్ మెంబర్ జట్టుపై తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ 127/1➤ నాకౌట్స్లో వేగంగా 7.2 ఓవర్లలో 100 రన్స్➤ పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92/0.
➤ టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి➤ తొలి వికెట్కు 50+ స్కోర్(98) చేసిన ఏకైక టీమ్➤ ఫైనల్లో అత్యధిక బౌండరీలు 37➤ T20ల్లో అత్యధికంగా 7 సార్లు 250+ స్కోర్➤ ఒకే టోర్నీలో అత్యధికంగా 3 సార్లు 250+ స్కోర్.
తన రిటైర్మెంట్ వార్తలపై కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచాక ప్రధాన కోచ్ గంభీర్తో కలిసి సూర్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సూర్య సమాధానం చెబుతూ.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, రిటైర్మెంట్ గురించి తనకు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడంపై స్టార్ బౌలర్ బుమ్రా స్పందించారు. ‘ఈ అవార్డు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే గతంలో ఇదే అహ్మాదాబాద్ వేదికగా ఫైనల్ ఆడాం. కానీ గెలవలేకపోయాం. అందుకే ఈ విజయం ఇచ్చే ఆనందం చాలా భిన్నమైనది. ఇక్కడ ఫ్లాట్ పిచ్. అందుకే పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశా. ఇక్కడ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
T20 WC-2026లో టీమిండియా గెలుపులో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ మరువలేనిది. ఫైనల్లో 89 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లోనూ అద్భుత హఫ్ సెంచరీలను సాధించి తన సత్తా చాటాడు. టీ20 వరల్ట్ కప్లో భారత్కు గొప్ప విజయాన్ని అందించిందిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
T20 WC-2026 ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అక్షర్ 3, హార్దిక్, వరుణ్, అభిషేక్ తలో వికెట్ సాధించారు.
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెంచరీ మిస్ చేసుకుంది. ఈ పోరులో ఇంగ్లండ్(2), సౌతాఫ్రికా(1), శ్రీలంక(1), పాకిస్తాన్(2), కెనడా(1), న్యూజిలాండ్(1) జట్ల నుంచి సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి అవుటై అభిమానులను నిరాశ పరిచాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లో బౌలింగ్ వేసిన బుమ్రా తొలి బంతికే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ అలెన్ వికెట్ పడగొట్టాడు. సెమీఫైనల్లోనూ తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది.IPL-2026 సీజన్ మార్చి 28న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్కాస్టర్ ‘స్టార్ స్పోర్ట్స్’ వెల్లడించింది. మే 31, 2026 వరకు ఈ లీగ్ కొనసాగనుంది. గతేడాది (2025) టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ సొంత గడ్డపైనే ఈ సీజన్ను ప్రారంభించే అవకాశం ఉంది.
T20 WC లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణిత 20 ఓవర్లలో భారత్ స్కోర్ 256/5 చేసింది. సంజూ (89), అభిషేక్ (52), ఇషాన్ కిషన్ (54) శివమ్ దూబె(25*)తో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టాడు.
టీ20 ప్రపంచ కప్లో భాగంగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా హాజరయ్యారు. తన మనుమరాలితో కలిసి సందడి చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియంలో ఉన్నారు. ‘ఇండియా.. ఇండియా’ అంటూ మైదానం హోరెత్తుతోంది.
న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ 45 బంతుల్లో సెంచరీ(89*) పూర్తి చేసుకున్నాడు. 8 సిక్సర్లు, ఐదు ఫోర్లతో సంచలనం సృష్టిస్తున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ(53*) పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 203/1 గా ఉంది.