MIతో మ్యాచ్లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న KKR జోరుకు శార్దుల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. 69 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (37)ను పెవిలియన్ చేర్చి ముంబైకి తొలి వికెట్ను అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రీన్(18) కూడా శార్దుల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 109 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది.
MIతో జరుగుతున్న మ్యాచ్లో KKR ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను దాటేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 14 బంతుల్లో 32 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 12 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నారు. ముఖ్యంగా పాండ్యా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఈ జోడీ 2 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించడం విశేషం.
ధోనీ గాయంతో రెండు వారాల పాటు IPLకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా ధోనీ కోలుకోవడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో CSK ఆడే 6 మ్యాచ్లకు MSD దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ధోనీ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది.
2026 టీ20 ప్రపంచకప్ బ్లాక్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ముంబైకి చెందిన మాజీ అండర్-19 క్రికెటర్ బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2,500 టికెట్ను ఏకంగా రూ. 25,000కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు సోధాను కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది.
IPLలో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు పడే అవకాశం ఉండటంతో పాండ్యా ఛేజింగ్కే మొగ్గు చూపాడు. కాగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్ల్లో ముంబై 24 సార్లు విజయం సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని మీడియా ప్లాట్ఫారమ్లు తన ఫిట్నెస్ గురించి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాడు. గాయం కారణంగా KKRకు దూరం కావడం తనను బాధిస్తోందన్నాడు. ఈ సందర్భంగా ఆ జట్టు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. వీలైనంత త్వరగా కోలుకుని IPL బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మకు కోటిన్నర విలువైన మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇది భారత్లోనే మొదటి మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ మోడల్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామంగా ప్రసిద్ధి చెందింది. చిన్న బౌండరీలు, ఫాస్ట్ ఔట్ఫీల్డ్ కారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. ప్రారంభంలో పేసర్లకు కొత్త బంతితో కొంత స్వింగ్ లభిస్తుంది. రాత్రి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్లు మొదట బౌలింగ్ ఎంచుకుంటాయి. ఈ గ్రౌండ్లో సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్: 180.
SRHతో మ్యాచ్లో విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69* పరుగులు చేసి RCB విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ఇన్నింగ్స్పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అంటూ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. రాబోయే మ్యాచ్ల్లో కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తాడని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు.
IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇవాళ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. KKRతో జరగబోయే మ్యాచ్తో ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు MI మొత్తం 299 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో IPLలో 277 మ్యాచ్లు, ఛాంపియన్స్ లీగ్ T20లో 22 మ్యాచ్లు ఆడింది.
MI, KKR మధ్య ఈరోజు బిగ్ ఫైట్ జరగనుంది. హోం గ్రౌండ్ వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాండ్యా సేన హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. అయితే, 2013 నుంచి సీజన్ తొలి మ్యాచ్లో ముంబై గెలవలేదు. మరోవైపు, రహానే కెప్టెన్సీలో KKR కూడా చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోరులో ‘MI తన 13 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్ చేస్తుందా?’ లేక ‘KKR గెలుస్తుందా?’.. కామెంట్ చేయండి.
IPLలో తన 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై మనీష్ పాండే భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సీజన్లో KKR తరఫున బరిలోకి దిగుతున్న పాండే, తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణం రెప్పపాటులో గడిచిపోయినట్లు అనిపిస్తోందని తెలిపాడు. ‘2009లో RCB తరఫున సెంచరీ సాధించడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆటపై ఉన్న ఇష్టమే నన్ను ఇన్నాళ్లు కొనసాగేలా చేసింది’ అని మనీష్ పేర్కొన్నాడు.
KKRతో ఇవాళ్టి మ్యాచ్లో MI తుది జట్టులో రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, తిలక్ వర్మ, పాండ్యా(c), రూథర్ఫోర్డ్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్ పేసర్లుగా ఉండగా, స్పిన్నర్లుగా నమన్ ధీర్, అల్లా గజన్ఫర్ ఆడనున్నారు. శార్దూల్ ఠాకూర్/మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది.
MI స్పీడ్ స్టార్ బుమ్రా ఇవాళ KKRతో మ్యాచ్లో ఆడతాడా లేదా అనే సందిగ్ధతకు తెరపడింది. ఈ కీలక పోరులో బుమ్రా బరిలోకి దిగడం ఖాయమని జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. బుమ్రా సైతం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ముంబై అభిమానులకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. అయితే, ఈ మ్యాచ్కు మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ అందుబాటులో ఉండటం లేదు.