SKLM: సంతబొమ్మాలి మండలం కొల్లిపాడులో తారకేశ్వర స్వామి వార్షికోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీపీ చిదపాన ధర్మార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విజేతులకు వరుసగా రూ.30,000, రూ.20,000 బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు.
RCBకి బిగ్ షాక్ తగలనుంది. బెంగళూరు పేసర్ జోస్ హేజిల్వుడ్ భుజం నొప్పి కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్లో WTC ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి భారత్కు పంపకూడదని ఆసీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్లో హేజిల్వుడ్ 18 వికెట్లు తీశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాడు. భారత జట్టుకు కోహ్లీ అవసరం ఇప్పుడు చాలా ఉందన్నాడు. కోహ్లీ బరిలోకి లేకుంటే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుందని అన్నాడు.
టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు BCCI సెలక్షన్ కమిటీ ముహూర్తం ఖరారు చేసింది. మే 23న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో పాటు టెస్టు కెప్టెన్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక భారత టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ పేరును BCCI దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ విచక్షణా రహితంగా భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వారి కృషి, ధైర్యసాహసాలను కొనియాడుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్పై గెలిచి తిరిగి టాప్-4లోకి రావాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఢిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని పంజాబ్ భావిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ధర్మశాలలో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు సింగర్ బి ప్రాక్ (ప్రతీక్ బచన్) ఆధ్వర్యంలో దేశ భక్తి గీతాలాపన నిర్వహించనున్నారు.
IPL: వర్షం కారణంగా MI, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు అంతరాయం కలిగింది. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన GT 14 ఓవర్లు.. 107/2గా ఉంది.
NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహిస్తున్న అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బేల్ టోర్నమెంట్ పురుషుల పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. 33 యూనివర్సిటీలు పాల్గొనగా, సోమవారం 17 జట్లు తదుపరి దశకు చేరాయి. మంగళవారంతో నాకౌట్ మ్యాచ్లు ముగిసి, బుధవారం లీగ్ దశలో నాలుగు జట్లు తలపడనున్నాయి. టోర్నీకి వర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తున్నారు.
భారీ వర్షం కారణంగా DC-SRH మ్యాచ్ రద్దయింది. దీంతో 2 జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఆరెంజ్ టీమ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో DCని 133 పరుగులకే కట్టడి చేసినా SRH ఆశలను వాన గల్లంతు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో SRH ఖాతాలో ఒక పాయింట్ చేరినా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మిగిలిన మ్యాచులు నామమాత్రంగా ఆడనుంది.
ధర్మశాల వేదికగా LSGతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 37 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 199/7 పరుగులు చేసింది. మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), పూరన్ (6) తేలిపోయారు. కెప్టెన్ పంత్ (18) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో బదోని (74) ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచింది. కెప్టెన్ రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న KKR ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని కసిగా ఉంది. గత మ్యాచ్లో ఓడిన RR ఎలాగైన ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.
చిన్నస్వామి స్టేడియం వేదికగా CSKతో జరిగిన మ్యాచ్లో RCB రెండు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే (94), జడేజా (77*) హాఫ్ సెంచరీలతో రాణించిన విజయాన్ని అందించలేకపోయారు. RCB బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశాడు.
మహిళల వన్డే సిరీస్లో భాగంగా రేపు శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత ఓపెనర్ ప్రతీక ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం ఆమె వరుసగా ఐదు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసింది. ఈ మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత క్రికెటర్లు సచిన్, ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేయనుంది.
2026 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదిక కానుంది. 12 జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీ ఈవెంట్ జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో తుది పోరు జూలై 5న జరగనుంది. ఈ టోర్నీలో పన్నెండు జట్లు రెండు గ్రూప్లుగా ఆడనున్నాయి.