కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి రోజు ఆట కేవలం 35 ఓవర్లకు మాత్రమే పరిమితం అయింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మోమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్(6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, ఆశ్విన్ ఒక వికెట్ తీశారు.
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లో జరుగుతుంది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే లంచ్ బ్రేక్ సమయానికి యంగ్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. కాగా ప్రస్తుతం క్రీజ్లో శాంటో(28), మెమినల్ హక్ (17)లు ఉన్నారు. అయితే పూర్తి స్కోర్ 74/2గా కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే మరోవైపు చినుకులు పడుతుండటంతో గ్రౌండ్పై ...
ఇటీవల జరిగిన డైమండ్ లీగ్లో గాయం కారణంగా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానానికి పరిమితమైయ్యాడు. పారిస్ ఒలింపిక్స్లోనూ గాయం కావడం వల్ల ఇబ్బంది పడిన ఈ అథ్లెట్ రజత పతకం సాధించాడు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్కి ఫిట్గా తిరిగి వస్తానని తాజాగా నీరజ్ మాటిచ్చాడు.
కోల్కతా నైట్ రైడర్స్(KKR) నూతన మెంటార్గా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఎంపికయ్యాడు. గతంలో ఈ జట్టుకు మెంటార్గా వ్యవహరించిన గంభీర్ భారత జట్టు కోచ్గా నియమితులు కావడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గౌతమ్ గంభీర్ స్థానంలో బ్రావో ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఈ KKR అధికారికంగాధృవీకరించింది.
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నవిషయం తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఫీల్డింగ్ ఎంచుకోవడం 9ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచారు. కాగా, చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదటగా బ్యాటింగ్ ఆడనుంది. ఇప్పటికే చెన్నైలో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో భారీ విజయం సాధించిన టీమిండియా 1-0గా ఆధిక్యంలో ఉంది.
అంతర్జాతీయ క్రికెట్కు విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఇప్పటికే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడు మరో కీలక ప్రకటన చేశాడు. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు బ్రావో వెల్లడించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తగిలిన గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రావో పేర్కొన్నాడు.
భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ చెన్నైలో జరగగా భారీ విజయం సాధించిన టీమిండియా 1-0తో ముందుంది. అయితే ఇవాళ కాన్పూర్లో జరిగే రెండో మ్యాచ్ ఉ.9.30 గం.లకు జరగాల్సి ఉండగా టాస్ ఆలస్యం కానుంది. నిన్న రాత్రి వర్షం కురవడంతో సిబ్బంది గ్రౌండ్పై కవర్లతో కప్పి ఉంచింది. అయినా పిచ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు ఉ. 9.30 గం.లకు పిచ్ను పరిశీలించనున్నారు.
రేపు టీమిండియా, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. టెస్ట్ల్లో మరో 35 పరుగులు చేస్తే 27,000 వేల పరుగులు పూర్తి అవుతాయి. ఇప్పటి వరకు 514 మ్యాచ్లు ఆడిన కోహ్లి 26,965 పరుగులు చేశాడు. ఈ జాబాతాలో కోహ్లి కంటే ముందు సచిన్( 34,357), సంగర్కకర(28,016), రికీ పాంటింగ్(27,483) ఉన్నారు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన టెస్టు కెరీర్ ముగింపు దశకు చేరుకుందని ప్రకటించాడు. మిర్పూర్లో తన చివరి టెస్టు ఆడాలని ఉందని తెలిపాడు. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇప్పుడు భారత్తో రెండో టెస్టు మ్యాచే తన చివరి టెస్ట్ మ్యాచ్ అని వెల్లడించాడు. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్న విష...
ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఈ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్లో రజతం పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు సీఎం రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయల చెక్లు అందించారు. పురుషుల హైజంప్లో కాంస్యం గెలిచిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ర...
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గతంలో తాను చేసిన డేటింగ్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2007-08 సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే సమయంలో తాను ఓ సినీ నటితో డేటింగ్లో ఉన్నట్లు తెలిపాడు. అయితే ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్ధేశంతో తన వద్దకు రావద్దని చెప్పినా ఆమె వినలేదని చెప్పాడు. అయితే, ఆ నటి పేరును చెప్పలేనని అన్నాడు. ఆ నటి ఎవరో మీకు తెలిస్తే కా...
పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో ఆమె వాడిన పిస్టల్ ధర రూ.కోటికి పైగా ఉంటుందని నెట్టింట చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై బాకర్ స్పందించింది. “కోట్ల రూపాయలా? అంత ఊహించుకోకండి. అది రూ.1.5 లక్షల నుంచి 1.85 లక్షల వరకు ఉండొచ్చు. మోడల్ను బట్టి ధర మారుతూ ఉంటుంది. మనం ఒక స్థాయికి వచ్చాక కొన్ని కంపెనీలు ఉచితంగా కూ...
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి.. తొలి మ్యాచులోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పంత్పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పునరాగమనం తర్వాత పంత్ మరింత అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్లో టెస్టుల్లో కెప్టెన్గా భారత జట్టు...