• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

పెర్త్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..?

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం పెర్త్‌లో ఉన్నారు, వారి తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో జంట సాధారణంగా ఉన్నప్పటికీ, వారి హ్యాండ్‌సమ్, కూల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో అనుష్క నీలిరంగు డెనిమ్, టీ-షర్ట్ ధరించారు. విరాట్.. లేత రంగు టీ-షర్ట్‌తో నీలిరంగు డెనిమ్‌లో కనిపించారు. వాళ్ల కుమార్తె కనిపించకుండా ఫొటో షేర్ చేశారు.

December 2, 2024 / 02:04 PM IST

WTC: టీమిండియా ఫైనల్‌కు వెళ్లాలంటే ఇది జరగాలి..!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టాప్-2లో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సహా శ్రీలంక పోటీపడుతున్నాయి. ఇటీవల పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్.. పెర్త్ టెస్టులో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని భారత్ 5-0, 4-1, 4-0తో ముగిస్తే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ బెర్తును ఖర...

December 2, 2024 / 12:14 PM IST

పాక్‌ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించిన అక్తర్‌

పాకిస్థాన్‌లో నిర్వహించనున్న 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాలో నిర్వహించే ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలన్న పాక్‌ ప్రతిపాదనను మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యతిరేకించాడు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్‌  వెళ్లాలని.. వారిని సొంతగడ్డపైనే ఒడించి రావాలని సూచించాడు.

December 2, 2024 / 11:21 AM IST

ఇషాన్‌కు పాండ్య భావోద్వేగ వీడ్కోలు

ఇషాన్‌ కిషన్‌ను ముంబై జట్టు కోల్పోవడంపై తాజాగా హార్దిక్‌ పాండ్య స్పందించాడు. ‘ఇషాన్‌ ఎప్పుడూ డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఉత్సాహంగా ఉంచుతాడని.. అందరినీ నవ్విస్తాడు. ముంబై అతడిని కచ్చితంగా మిస్‌ అవుతుంది’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భావోద్వేగ పోస్టుతో వీడ్కోలు పలికాడు.

December 2, 2024 / 11:06 AM IST

CRICKET: ఈ రికార్డును బ్రేక్ చేసేదెవరు?

క్రికెట్‌లో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. సచిన్ రికార్డుల తరహాలో మరో భారత క్రికెటర్ కూడా ఎవరూ అందుకోలేని రికార్డు నమోదు చేశాడు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ వేశాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ రికార్డును అందుకోలేదు. కాగా ఆ మ్యాచ్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం...

December 2, 2024 / 10:52 AM IST

ఆ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే ఆస్ట్రేలియాకు షమీ..!!

టీమిండియా పేసర్ షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయితే అతడి బౌలింగ్, ఫిట్‌నెస్‌ను బీసీసీఐ స్పోర్ట్స్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, సెలెక్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే షమీని ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పంపే అంశాన్నిబీసీసీఐ పరిశీలిస్తుంద...

December 2, 2024 / 10:34 AM IST

రేపు జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల ఎంపికలు

NZB: ఎస్జీఎఫ్ అండర్ -17 బాల బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈనెల 3న ఉదయం ఏడు గంటలకు నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో సైక్లింగ్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని ఆమె సూచించారు.

December 2, 2024 / 08:59 AM IST

నేడు పాఠశాలల్లో ఆటల పోటీలు: డీఈఓ

జనగాం: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని నేడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 8, 9, 10వ తరగతులకు ఈ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో నిర్వహించేలా హెచ్ఎంలు కృషి చేయాలని కోరారు.

December 2, 2024 / 08:55 AM IST

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం విదర్భ, రైల్వేస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు సాయంత్రం 04:30 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు రాత్రి 08:30 తెలిపారు. ఉదయం ఛత్తీస్గఢ్, ఒడిస్సా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వలన రద్దయిన విషయం తెలిసిందే.

December 2, 2024 / 08:05 AM IST

జాతీయ స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థి

ప్రకాశం: మార్కాపురంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తంగిరాల సౌజన్య కరాటే పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఈ శ్రీదేవీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో సౌజన్య హాజరై సత్తా చాటిందన్నారు. దీంతో సౌజన్యను హెచ్‌ఎం, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉమాదేవి అభినందించారు.

December 2, 2024 / 07:51 AM IST

చరిత్ర సృష్టించిన విండీస్ క్రికెటర్

వెస్టిండీస్ క్రికెటర్ క్రెగ్ బ్రాత్ వైట్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 86 టెస్టులు ఆడిన విండీస్ ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. ఈ క్రమంలో 52 ఏళ్ల క్రితం నమోదైన గార్ఫీల్డ్ సోబర్స్(85) రికార్డును బ్రాత్ వైట్ అధిగమించారు. 2014 నుంచి 2024 వరకు ఆయన ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్ కాలేదు. కాగా, 32 ఏళ్ల బ్రాత్ వైట్ తన పదేళ్ల కెరీర్‌లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.

December 2, 2024 / 07:30 AM IST

ఆర్సీబీ కెప్టెన్ ఎవరనే దానిపై అశ్విన్ ఏమన్నారంటే?

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్‌‌లో ఆర్సీబీ కెప్టెన్‌ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది. ఈ అంశంపై భారత్ స్పిన్ బౌలర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడాడు. కోహ్లీయే ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపారు. కెప్టెన్‌గా విరాట్‌ను మించిన వారు ప్రస్తుతం ఆర్సీబీలో కనిపించడం లేదని చెప్పారు. ఈ సారి వేలంలో ఆర్సీబీ బ్యాలెన్సింగ్‌గా ప్లేయర్లను కొనుగోలు ...

December 2, 2024 / 04:59 AM IST

హాకీ జూనియర్ ఆసియా కప్‌లో సెమీస్‌కు భారత్

ఒమన్‌లో జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో యువ భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. సౌత్ కొరియాపై 1-8 తేడాతో విజయం సాధించింది. అర్ష్‌దీప్ మూడు, అరైజీత్ రెండు గోల్స్‌తో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. గుర్జోత్, రోసన్, రోహిత్ చెరో గోల్ చేశారు. ఈ నెల 3న జరిగే సెమీస్‌లో మలేసియాతో యువ భారత...

December 2, 2024 / 02:15 AM IST

‘అతను వేలంలోకి వస్తే రూ.520 కోట్లు కూడా సరిపోవు’

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఒకవేళ వేలంలోకి వచ్చి ఉంటే రూ.520 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదని అన్నాడు. ఆల్‌టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవని పేర్కొన్నాడు. అతడి కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడవని చెప్పుకొచ్చాడు. కాగా, బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

December 1, 2024 / 11:07 PM IST

Badminton: టైటిల్ నెగ్గిన ట్రీసా-గాయత్రి జోడీ

సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ అదరగొట్టింది. ఫైనల్‌లో 21-18, 21-11 తేడాతో చైనాపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. గాయత్రి-ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం.

December 1, 2024 / 05:10 PM IST