శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో లంక 602 పరుగులు చేయగా.. కివీస్ జట్టు 88 పరుగులకే కుప్పకులింది. 22/2 పరుగులతో 3వ రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్.. లంక బౌలర్ల దాటికి కేవలం మరో 66 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. దీంతో లంకకు తొలి ఇన్నింగ్స్లో 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్ ప్రారంభించిన న్యూజిలాండ్ 121 పరుగులకు 5 వికెట్లు కోల్పోయ...
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడి అంతరాయం కొనసాగుతోంది. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. వర్షం వస్తూ ఆగుతూ ఉండటంతో మైదానం చిత్తడిగానే ఉంది. దీంతో మ్యాచ్ నిర్వహణకు సాధ్యం కాదనే ఉద్దేశంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలిరోజు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్తో ముషీర్ ఆకట్టుకున్నాడు. తండ్రితో పాటు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ప్రమాదంలో గాయాలు కావడంతో వచ్చే ఇరానీ ట్రోఫీలో ఆడటం కష్టమేనంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.
అఖిల భారత టెన్నిస్ సంఘం(ఐటా)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఐటా అధ్యక్షుడు అనిల్ జైన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 8 రాష్ట్రాల టెన్నిస్ సంఘాలు ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాయి. అనిల్ జైన్ తన కుటుంబంతో చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హర్యానా, మహరాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం ...
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అంతరాయం ఏర్పడింది. నిన్న 35 ఓవర్ల పాటు ఆట కొనసాగిన తర్వాత మళ్లీ వర్షం, వెలుతురులేమితో ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఇవాళ కూడా వర్షం పడుతుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 107/3.
ప్రకాశం: బుచ్చిరెడ్డి పాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ క్రీడా జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను పెనుబల్లి గ్రామం సర్పంచ్ పెంచలయ్య, మండల విద్యా శాఖ అధికారులు పి. దిలీప్, పి వి. రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు విద్యతో పాటు ఆటల్లో రాణించాలని తెలిపారు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయపడ్డాడు. వెన్నుకు గాయం కావడంతో ఇంగ్లాండ్తో జరిగే చివరి వన్డేకు అతడు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో గ్రీన్ ఆడతాడా? లేదా? అని సందిగ్ధత నెలకొంది. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్కు జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. 39 ఓవర్లకే కుదించిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు 312 పరుగులు చేశారు. ఆ తరువాత క్రీజ్లోకి దిగిన ఆసీస్ 126 పరుగులకే కుప్పకూలడంతో 186 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
SKLM: సారవకోట మండలంలోని అలుదు ZPH స్కూల్ నుంచి స్కూల్ గేమ్స్కు ఐదుగురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా HM రామారావు తెలిపారు.ఇందులో ప్రధానంగా జి.తేజ్ కుమార్ కబాడి,యోగంధరరావు పరుగు పందెం,వెన్నెల కబాడీ,మేఘన,లక్ష్మి కోకోకు ఎంపికైనట్లుగా పీటీ రమణమూర్తి తెలిపారు.నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలకు 5 విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైయ్యారు.
శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక ఆటగాళ్లలో చందీమల్ (116), కమిందు మెండిస్(182*), కుశల్ మెండిస్(106*) సెంచరీలతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 22 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో వీరవిహారం చేస్తున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సెంచరీ(182*)తో అదరగొట్టాడు. దీంతో టెస్టుల్లో కేవలం 13 ఇన్నింగ్స్లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డాన్ బ్రాడ్మన్ సరసన 3వ స్ధానంలో నిలిచాడు. తొలి రెండు స్ధానాల్లో ఇంగ్లండ్ ఆటగాడు హెర్బర్ట్ సట్క్లిఫ్(12), విండీస్ ఆటగాడు సర్ ఎవర్టన్ వీక్స్(1...
అమెరికాకు చెందిన షానన్ రౌబరీకు 12 ఏళ్ల తర్వాత కాంస్య పతకం వరించనుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో మహిళల 1500 మీటర్ల రన్నింగ్లో ఆరో స్థానంతో ఆమెకు పతకం చేజారింది. అయితే, ఫైనల్లో 13 మంది పాల్గొనగా.. డోపింగ్ పరీక్షల్లో ఐదుగురు ఫైనలిస్టులు పట్టుబడ్డారు. దీంతో పలువురిపై నిషేధం విధించడంతో షానన్.. జాబితాలో మూడో స్థానానికి చేరింది. ఇలా 12 ఏళ్ల తర్వాత షానన్ రౌబరీని కాంస్య పతకం వరించనుంది.
భారత్, బంగ్లాదేశ్ రెండవ టెస్ట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.క్రీజులో మోమీనుల్ హక్ 40, ముష్ఫీకర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బ్యాటర్లలో జకీర్ డక్ అవుట్, షద్మాన్ ఇస్లామ్ 24, షాంటో 31 పరుగులకు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.
యూఏఈలో జరిగిన ఓ టోర్నీలో ఇద్దరు క్రికెట్ ప్లేయర్లు కొట్టుకున్నారు. ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్లు ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. అయితే, రబ్దాన్ రెండో ఇన్నింగ్స్లో నాసిర్ అలీ బౌలింగ్లో కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ.. అతడి వైపు వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఇరువురు ప్లేయర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడ...
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. కుంబ్లే 419 వికెట్లు తీయగా.. అశ్విన్ ఇప్పటివరకు 420 వికెట్లు పడగొట్టాడు.