• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IND vs SL: టాస్ ఓడిన భారత్

శ్రీలంకతో జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్సీ తొలి సెమీస్‌లో భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ అనుష్క సంజీవని ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గత టోర్నీ(2023)లో ఇదే జట్ల మధ్య తొలి సెమీస్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. గ్రూప్ దశలో రన్‌రేట్ ఆధారంగా భారత్ నాటి టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

February 20, 2026 / 07:40 AM IST

కోహ్లీ లిస్ట్ అగ్రస్థానంలో సికందర్ రజా

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో జట్టును T20 WCలో సూపర్-8కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధికంగా 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ సూర్య(17), అంతకుముందు విరాట్ కోహ్లీ(16) పేరిట ఉండేది.

February 20, 2026 / 07:09 AM IST

నేడు సెమీస్‌లో లంకతో భారత్ ఢీ

ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్‌లో భారత్, శ్రీలంక ఢీకొననున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కు బ్యాంకాక్ టెర్థాయ్ గ్రౌండ్ వేదిక కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇదే మైదానంలో బంగ్లా-A, పాక్-A మధ్య రెండో సెమీస్ జరగనుంది.

February 20, 2026 / 06:47 AM IST

సూపర్-8లో మార్పు ఉండొచ్చు: గవాస్కర్

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి.. అతడి స్థానంలో అక్షర్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే, సుందర్‌ను కొనసాగించే ఛాన్స్ ఉందన్నాడు.

February 20, 2026 / 03:46 AM IST

వరుస డకౌట్స్.. అభిషేక్ చెత్త రికార్డులు

నెదర్లాండ్స్‌పై డకౌట్‌తో అభిషేక్ శర్మ చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. T20 WCలో విండీస్ ప్లేయర్ ఆండ్రీ ఫ్లెచర్(2009) తర్వాత వరుసగా 3 సార్లు డకౌట్ అయిన 2వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే క్రిస్ శ్రీకాంత్(1996 వన్డే WC) తర్వాత ఒకే ICC టోర్నీలో అత్యధికంగా 3 సార్లు డకౌట్ అయిన భారత్ 2వ ప్లేయర్‌గానూ అవతరించాడు. కాగా ఈ టోర్నీలో అభి ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు.

February 18, 2026 / 07:53 PM IST

నమీబియాపై తడబడుతున్న భారత బ్యాటర్లు

నమీబియాతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో టీమిండియా 69 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. తొలుత అభిషేక్(0) డకౌట్ కాగా.. ఆ తర్వాత ఇషాన్(18), తిలక్(31) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ స్కోర్ 74/3 కాగా.. క్రీజులో సూర్య(22), దూబే(2) ఉన్నారు. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ 2 వికెట్లు పడగొట్టాడు.

February 18, 2026 / 07:53 PM IST