దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పొందింది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన బంతులు సంధించారని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉందన్నాడు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రేవిస్.. బ్యాట్ మీదకు బంతి రాకున్నా వారు పరిస్థితులకు తగ్గట్లు చక్కగా ఆడారని కొనియాడాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో దక్షిణఫ్రికాపై అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, దాన్ని మరిచిపోయారా అని నిలదీశాడు. నిన్న అతడిని ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
జట్టు కూర్పు కోసమే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్ను తీసుకోవాల్సి వచ్చిందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ తెలిపాడు. అయితే వాషింగ్టన్ సుందర్.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 11 రన్స్ నిరాశపరిచాడు. కాగా మొత్తంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్ను ఓడించిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్కప్-2026 సూపర్-8లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచులో వెనుకబడ్డామని, ఆ తర్వాత ఫామ్లోకి రాలేకపోయామని చెప్పాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ మెరుగ్గా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.
సూపర్ 8 ఆరంభంలోనే భారత్ చతికిలపడింది. దీంతో 2024 వన్డే WC ఫైనల్ తర్వాత ICC టోర్నీల్లో తొలి ఓటమి చవిచూడక తప్పలేదు. ఇందుకు పవర్ ప్లేలో టాపార్డర్ వెనుదిరగడం, చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలు లేకపోవడం, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమే ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. గత టోర్నీ తర్వాత 8 సిరీస్ విజయాలతో పొందిన ఆనందం కంటే ఈ ఓటమి ఎక్కువగా నొప్పిస్తోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచులో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఇదే తొలి ఓటమి.
T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. ప్రొటీస్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. తొలి నుంచి బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలో మహారాజ్ వేసిన 15 ఓవర్లో హార్దిక్(18), రింకూ(0), ఆర్ష్దీప్(10) వెంటవెంటనే వెనుదిరిగారు. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి స్కోర్ 88/8 కాగా దూబే(19), వరుణ్(0) క్రీజులో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బంతుల్లోకే డకౌట్గా వెనుదిరిగాడు. మార్క్రమ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రికల్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ తన తొలి బంతికే ఫోర్ బాదాడు. తిలక్ వర్మ కూడా 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో బుమ్రా మూడు వికెట్లతో చెలరేగి అరుదైన రికార్డు సృష్టించాడు. T20 WC చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా (33) అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అశ్విన్ (32) పేరిట ఉండగా, బుమ్రా దానిని అధిగమించాడు. మరోవైపు, ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అర్ష్దీప్ (32) కూడా రెండో స్థానంలో నిలిచాడు.
అహ్మదాబాద్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్తో కలిసి ఆయన T20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పిచాయ్.. ఈ విధంగా క్రికెట్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
టీమిండియాతో మ్యాచ్లో సౌతాఫ్రికా 187/7 పరుగులు చేసింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ SAను బ్రెవిస్(45), మిల్లర్(63) ఆదుకున్నారు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. ఒక దశలో 12 ఓవర్లలో 117/4 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించినా, డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో అడ్డుకున్నారు. బుమ్రా 3, అర్ష్దీప్ 2 వికెట్లు పడగొట్టారు. టార్గెట్: 188
20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా జట్టును బ్రెవిస్, మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న బ్రెవిస్ (45)ను దూబే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం మిల్లర్ (52*)కు తోడుగా స్టబ్స్ (1*) క్రీజులో ఉన్నాడు. SA స్కోరు 13 ఓవర్లలో 128/4.