ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు(1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతనికంటే ముందు ఆ రికార్డు 1625 పరుగులతో సచిన్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘనత 60 ఇన్నింగ్స్లో అందుకోగా జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు.
NZB: ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలకు బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు హాసిని, సంజీవని, సింధు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు వరంగల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా , భారత్కు జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్కు వారం రోజుల సమయం ఉంది. ఇంతకంటే ముందు ప్రైమ్మినిస్టర్స్ IXతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగుతోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం ఏర్పడింది. తొలి రోజు వర్షార్పణం కాగా రెండో రోజు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ప్రైమ్మినిస్టర్స్IX 5.3 ఓవర్లు మాత్రమే ఆడగా మరో సారి వ...
CTR: సదుంలోని పోలీస్ గ్రౌండ్లో ఈనెల 2వ తేదీన ఉమ్మడి చిత్తూరు సీనియర్ మహిళా, పురుషుల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మమత తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 5 నుంచి 8వ తేదీవరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
NZB: డిచ్పల్లి మండలంలోని సుద్ధపల్లి గ్రామంలోని టీజీ డబ్ల్యూఆర్ఎస్ కళాశాలకు చెందిన విద్యార్థిని సంకీర్తన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నళిని తెలిపారు. ఈ హ్యాండ్ బాల్ పోటీలు త్వరలో ఆర్మూర్ మీని స్టేడియంలో జరగనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, కోచ్ మౌనిక, తదితరులు అభినందించారు.
KMR: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఏడుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కామారెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి జిల్లా 14 సంవత్సరంలోపు బాల, బాలికల హాకీ ఎంపికలో జడ్పీహెచ్ఎస్ గర్గుల్ బాలుర విద్యార్థులు సతీష్, స్టీవెన్, వర్షిత్, కృష్ణ, లక్ష్మణ్ బాలికలు వీణ, నక్షత్ర ఎంపికైనట్లు చెప్పారు.
SKLM: జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి పలాసలో నిర్వహిస్తున్నట్లు స్థానిక గోపిచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ కోచ్ బి. చంద్రవతి తెలిపారు. ఈ పోటీలుకు 4-16 ఏళ్లు లోపు వయస్సు గలవారు అర్హులన్నారు. ఈ పోటీల్లో విజేతలు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర పోటీలకు అర్హులు అని తెలిపారు.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టైటాన్స్ విజయాలకు మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్ల్లో 9 గెలువగా, 6 ఓడిపోయింది.
2025 ఐపీఎల్ వేలం కోసం ప్రతి జట్టు రిటైన్ ఆటగాళ్ల జాబితాను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే కూడా ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్గా జట్టులో ఉంచారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను రూ.18 కోట్లకు, జడేజాను రూ.18 కోట్లకు, మదీషా పతిరానను రూ.13 కోట్లకు, దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నారు.
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ రికార్డుపై కన్నేశాడు. కివీస్తో శుక్రవారం ప్రారంభంకానున్న మూడో టెస్టులో అశ్విన్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే, అశ్విన్ చెరో 37సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు.
2005లో శ్రీలంకపై ధోనీ ఆడిన 183 పరుగుల భారీ ఇన్నింగ్స్ నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీలంక ఇచ్చిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీ అద్భుత బ్యాటింగ్తో చెలరేగాడు. 145 బంతుల్లోనే 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183* పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్తో ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్గా రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పటికీ ఈరికార్...