జనగాం: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని నేడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 8, 9, 10వ తరగతులకు ఈ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో నిర్వహించేలా హెచ్ఎంలు కృషి చేయాలని కోరారు.
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం విదర్భ, రైల్వేస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు సాయంత్రం 04:30 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు రాత్రి 08:30 తెలిపారు. ఉదయం ఛత్తీస్గఢ్, ఒడిస్సా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వలన రద్దయిన విషయం తెలిసిందే.
ప్రకాశం: మార్కాపురంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తంగిరాల సౌజన్య కరాటే పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఈ శ్రీదేవీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో సౌజన్య హాజరై సత్తా చాటిందన్నారు. దీంతో సౌజన్యను హెచ్ఎం, ఫిజికల్ డైరెక్టర్ ఉమాదేవి అభినందించారు.
వెస్టిండీస్ క్రికెటర్ క్రెగ్ బ్రాత్ వైట్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 86 టెస్టులు ఆడిన విండీస్ ప్లేయర్గా ఆయన ఘనత సాధించారు. ఈ క్రమంలో 52 ఏళ్ల క్రితం నమోదైన గార్ఫీల్డ్ సోబర్స్(85) రికార్డును బ్రాత్ వైట్ అధిగమించారు. 2014 నుంచి 2024 వరకు ఆయన ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్ కాలేదు. కాగా, 32 ఏళ్ల బ్రాత్ వైట్ తన పదేళ్ల కెరీర్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది. ఈ అంశంపై భారత్ స్పిన్ బౌలర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడాడు. కోహ్లీయే ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపారు. కెప్టెన్గా విరాట్ను మించిన వారు ప్రస్తుతం ఆర్సీబీలో కనిపించడం లేదని చెప్పారు. ఈ సారి వేలంలో ఆర్సీబీ బ్యాలెన్సింగ్గా ప్లేయర్లను కొనుగోలు ...
ఒమన్లో జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్లో యువ భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. సౌత్ కొరియాపై 1-8 తేడాతో విజయం సాధించింది. అర్ష్దీప్ మూడు, అరైజీత్ రెండు గోల్స్తో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. గుర్జోత్, రోసన్, రోహిత్ చెరో గోల్ చేశారు. ఈ నెల 3న జరిగే సెమీస్లో మలేసియాతో యువ భారత...
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఒకవేళ వేలంలోకి వచ్చి ఉంటే రూ.520 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదని అన్నాడు. ఆల్టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవని పేర్కొన్నాడు. అతడి కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడవని చెప్పుకొచ్చాడు. కాగా, బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ అదరగొట్టింది. ఫైనల్లో 21-18, 21-11 తేడాతో చైనాపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో టైటిల్ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. గాయత్రి-ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం.
ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవెన్ 240 పరుగులకు ఆలౌటైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్ 45, గిల్ 50, నితీశ్ రెడ్డి 42 పరుగులతో రాణించారు.
ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్, భారత్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవన్ 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సామ్ కాన్స్టస్ (107) సెంచరీ చేశాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశాడు. ఇక టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
ఇటీవల ముగిసిన IPL మెగా వేలంలో దీపక్ చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి దక్కించుకుంటుందని CSK అభిమానులు భావించారు. అయితే రూ.9.25 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ మాట్లాడుతూ.. ‘ప్రారంభం నుంచి ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. అందుకే సీఎస్కేలోకి వెళ్లాలనుకున్నా. ఈ సారి నా పేరు వేలంలోకి వచ్చేసరికి చెన్నై వద్ద రూ.13 కోట్లే ఉన్నాయి. అయినా, నా కోసం రూ.9 కోట్ల వర...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్జే ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె హిట్మ్యాన్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇన్స్టా వేదికగా వారి కుమారుడి పేరును షేర్ చేసింది. నాలుగు క్రిస్మస్ బొమ్మలపై తమ పేర్లతో పాటు చిన్నారి పేరు కూడా రాసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. తమ రెండో బిడ్డకు ‘అహాన్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రితికా పో...
ఐసీసీ ఛైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. అంతేకాకుండా అతిపిన్న వయస్కుడిగా జైషా(35) చరిత్ర సృష్టించారు. అయితే ఇంతకముందు జైషా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.
ఇండియా, ఆస్ట్రేలియాకు ఈ నెల 6న జరగనున్న పింక్ బాల్ టెస్ట్ గురించి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో మూడు మార్పులు ఉంటాయన్నారు. రోహిత్, గిల్ తుది జట్టులోకి వస్తారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి. పడిక్కల్, జురెల్ ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి బయటకు వెళ్తారు. రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. వాషింగ్టన్ ప్లేస్లో జడేజా జట్టులోకి వస్తాడు అని అభిప్రాయపడ్డాడు.
ఇండియా, ఆస్ట్రేలియాకు ఈ నెల 6న జరగనున్న పింక్ బాల్ టెస్ట్ గురించి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో మూడు మార్పులు ఉంటాయన్నారు. ‘రోహిత్, గిల్ తుది జట్టులోకి వస్తారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి. పడిక్కల్, జురెల్ ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి బయటకు వెళ్తారు. రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. వాషింగ్టన్ ప్లేస్లో జడేజా జట్టులోకి వస్తాడు’ అని అ...