భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 22న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె వివాహం ఖాయమైంది. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
CTR: కుప్పం మండలం టి. సదుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 4న త్రోబాల్ అండర్-17 క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు పద్మనాభరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పాఠశాలల నుంచి బాలుర, బాలికలు ఈ పోటీలకు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ని లక్నో రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, పంత్ను లక్నో సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో పంత్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ అనే నలుగురు లీడర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పంత్ వచ్చే 10-12 ఏళ్లు ఉంటాడని ఆశిస...
అండర్-19 ఆసియా కప్లో భారత్ బోణీ కొట్టింది. జపాన్పై యువ భారత్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128కి పరిమితమైంది. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, కార్తికేయ, చేతన్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. యుధజిత్ ఒక వికెట్ తీశాడు.
సెహ్వాగ్ తర్వాత భారత్ తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్గా కరుణ్ నాయర్ నిలిచిన విషయం తెలిసిందే. సచిన్, రాహుల్ వంటి దిగ్గజాలకు సైతం ఆ ఫీట్ సాధ్యం కాలేదు. 2013-14లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్లో 328 పరుగులు చేశాడు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కరుణ్కు అన్యాయం జరిగిందంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అతడికి అవకాశాల...
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోహిత్, గిల్ తిరిగి జట్టులోకి రానుండటంతో జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్పై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆడిలైడ్ టెస్టులో ఇప్పుడున్న ఓపెనింగ్ జోడీని మార్చవద్దని కోరాడు. రోహిత్ శర్మ నంబర్ 6వ స్థానంలో బ్యాటింగ్కు...
IPL 2025 మెగా వేలం ముగిసిన తర్వాత కొత్త కెప్టెన్ల కోసం ఫ్రాంఛైజీలు అన్వేషణ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో గత సీజన్లో KKRను విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఆ జట్టు వదులుకోవడంతో ఇప్పడు కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించింది. వేలంలో భారీ ధరకు తిరిగి దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్కు కెప్టెన్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, సీనియర్ ఆటగాడు రహానేకు కెప్టెన్ బాధ్యతలు అ...
అండర్-19 ఆసియా కప్లో భాగంగా గ్రూప్ ఎలో భారత్, జపాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (122) సెంచరీ చేశాడు. ఆయుష్ మాత్రే 54, వైభవ్ సూర్యవంశీ 23, సిద్ధార్థ్ 35, కార్తికేయ 57, హార్దిక్ రాజ్ 25 పరుగులతో రాణించారు. ఇక జపాన్ బౌలర్లలో హ్యూగో కెల్లీ 2, […]
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం పెర్త్లో ఉన్నారు, వారి తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో జంట సాధారణంగా ఉన్నప్పటికీ, వారి హ్యాండ్సమ్, కూల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో అనుష్క నీలిరంగు డెనిమ్, టీ-షర్ట్ ధరించారు. విరాట్.. లేత రంగు టీ-షర్ట్తో నీలిరంగు డెనిమ్లో కనిపించారు. వాళ్ల కుమార్తె కనిపించకుండా ఫొటో షేర్ చేశారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టాప్-2లో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సహా శ్రీలంక పోటీపడుతున్నాయి. ఇటీవల పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్.. పెర్త్ టెస్టులో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ 5-0, 4-1, 4-0తో ముగిస్తే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ బెర్తును ఖర...
పాకిస్థాన్లో నిర్వహించనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాలో నిర్వహించే ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదనను మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యతిరేకించాడు. భవిష్యత్లో భారత్కు పాకిస్థాన్ వెళ్లాలని.. వారిని సొంతగడ్డపైనే ఒడించి రావాలని సూచించాడు.
ఇషాన్ కిషన్ను ముంబై జట్టు కోల్పోవడంపై తాజాగా హార్దిక్ పాండ్య స్పందించాడు. ‘ఇషాన్ ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్ను ఉత్సాహంగా ఉంచుతాడని.. అందరినీ నవ్విస్తాడు. ముంబై అతడిని కచ్చితంగా మిస్ అవుతుంది’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భావోద్వేగ పోస్టుతో వీడ్కోలు పలికాడు.
క్రికెట్లో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. సచిన్ రికార్డుల తరహాలో మరో భారత క్రికెటర్ కూడా ఎవరూ అందుకోలేని రికార్డు నమోదు చేశాడు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ వేశాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ రికార్డును అందుకోలేదు. కాగా ఆ మ్యాచ్లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం...
NZB: ఎస్జీఎఫ్ అండర్ -17 బాల బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈనెల 3న ఉదయం ఏడు గంటలకు నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో సైక్లింగ్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరుకావాలని ఆమె సూచించారు.