టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఆసీస్తో రెండో టెస్టు కోసం అడిలైడ్లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వందలాది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్లను ఎగతాళి చేశారు. దీంతో ఈ టూర్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించొద్దని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించింది.
HYD: JNTU యూనివర్సిటీలో బుధవారం సౌత్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. సెక్రెటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ దిలీప్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేరళలో ఈ సౌత్ ఇంటర్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయని వారు తెలిపారు.
ఇటీవల ఐసీసీ ఛైర్మన్గా జై షా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. తదుపరి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరవుతారని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనిల్ పటేల్(గుజరాత్), ప్రస్తుత బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, రోహన్ జైట్లీ(ఢిల్లీ) ఈ పదవి రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను తాజాగా విడుదల చేసింది. ఏ జాబితాలో టీమిండియా ఓపెనర్ జైస్వాల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్పై 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. ఈ జాబితాలో రిషబ్ పంత్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
అండర్-19 ఆసియా కప్ మ్యాచ్లో టీమిండియా సెమీస్కు చేరింది. UAEతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన UAE 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో ఛేదించింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (76*; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) ఈసారి మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు.
డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, రోహిత్ శర్మ అందుబాటులోకి రావటంతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ ఓపెనర్గా వస్తాడా? లేదా మిడిలార్డర్లో దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో KL రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. జట్టును గెలిపించేందుకు తన వంతు కృ...
అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆసీస్, భారత్ మధ్య రెండో (పింక్ బాల్) టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో పిచ్పై ఆరు మిల్లీమీటర్ల గడ్డిని ఉపయోగిస్తామని పిచ్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ పేర్కొన్నాడు. కొత్త బంతితో ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని డామియన్ హగ్ వెల్లడించాడు.
యువ క్రికెటర్ పృథ్వీ షా వరుస వైఫల్యాలతో తన కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఫిట్నెస్లేమితో ముంబయి రంజీ జట్టులో చోటు కోల్పోగా.. IPL మెగా వేలంలోనూ అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. షా ఆటతీరు ఇలానే ఉంటే మరో సచిన్ ఏమో గానీ మరో కాంబ్లీగా మిగిలిపోతాడని మాజీ క్రికెటర్లు హెచ్...
వచ్చే ఏడు పాకిస్థాన్లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అనేక సంకోచాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. కానీ ఎక్కువ రెవెన్యూను తమకే ఇవ్వాలని కండీషన్ పెట్టింది. ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ అంశంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చర్చించేందుకు డిసెంబర్ 5 వర్చువల్ బోర్డ్ మీటింగ్కు పిలుపుని...
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన పెళ్లిచూపుల్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంది. ‘క్రికెట్లో రానిస్తున్నప్పుడు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. వాటిలో కొన్ని పెళ్లిచూపులకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. అప్పుడు అబ్బాయిలు పెళ్లి తరువాత పరిస్థితుల గురించి మాట్లాడేవారు. ఎంత మంది పిల్లలు కావాలని అడిగితే ఇబ్బంది పడ్డాను. కొందరు కెప్టెన్గా ఉన్న నన్ను క్రికెట్ మానేసి పిల్లల్ని చూసుకోమన్నారు&rs...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో మందకోడిగా బౌలింగ్ వేసినందుకు జరిమానాగా ఆ జట్టుకు ఐసీసీ మూడు పాయింట్ల కోత విధించింది. దీంతో కివీస్ జట్టు డబ్ల్యూటీసీ ర్యాంకింగ్ టేబుల్లో ఐదో స్థానానికి పడిపోయింది. కాగా 61.11 శాతం పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాటల్లేవని.. తామిద్దరం స్నేహితులం కాదని తెలిపాడు. అతడితో మాట్లాడి పదేళ్లు దాటుతోందని చెప్పాడు. IPLలో 2018-20 మధ్య CSK తరపున ఆడినప్పుడు కూడా మైదానంలోనే అది కూడా పరిమితంగానే మాట్లాడుకున్నట్లు వెల్లడించాడు.
తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లోనూ విఫలమవడంతో ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం భారత ఆటగాళ్లు నెట్ సెషన్స్లో పాల్గొనగా.. మిగతా వారి కంటే రోహిత్ శర్మ, పంత్ గంట ముందే ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా భారత్- ఆసీస్ మధ్య రెండో టెస్టు ఈ నెల 6న ప్రారంభం కాన...
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ క్రికెటర్ పృథ్వీషాకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్సోల్డ్గా మిగిలిన పృథ్వీకి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించాడు. పృథ్వీషా విజయవంతం కావాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటే అతన్ని సోషల్ మీడియాకు దూరం ఉండమని చెప్పాలన్నాడు.
ప్రకాశం: జిల్లా సంతనూతలపాడులో వర్షాల ప్రభావంతో స్థానిక జడ్పీ హెచ్ఎస్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తేదీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 8 వరకు స్థానిక జడ్పీహెచ్ఎస్లో నిర్వహించాల్సి ఉండగా, తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 7 నుంచి 10 తేదీ వరకు మార్పులు చేసినట్లు తెలిపారు.