ఐర్లాండ్తో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడనున్నట్లు BCCI ప్రకటించింది. బెల్ఫాస్ట్ మైదానంలో జూన్ 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు భారత్ 2018, 2022, 2023 సంవత్సరాల్లో ఐర్లాండ్ టూర్కు వెళ్లింది. కానీ, బెల్ఫాస్ట్లో 2007 తర్వాత ఆడటం ఇదే మొదటిసారి అవుతుందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.