IPL-2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేని అభిమానుల కోసం BCCI దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ‘ఫ్యాన్ పార్క్’లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇక్కడ భారీ స్క్రీన్లపై లైవ్ మ్యాచ్లను వీక్షించడంతో పాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులతో మ్యాచ్లను ఎంజాయ్ చేయవచ్చు.