అల్లూరి: బీజేపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ డైరెక్టర్ రీమల చంద్రరావు, గిరిజన మోర్చా జిల్లా నేత అరిమెల రాజు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (మన ఊరు మన జెండా) సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలంలోని రత్నంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. దేశసేవ, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీని స్థాపించారన్నారు.