AP: శ్రీకాకుళంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరిస్తున్నాయి. మత్స్యకారులు.. అర్ధరాత్రి వేటకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడేవారు. వారి కోసమే CSR ద్వారా సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు.