తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల భర్తీ కౌన్సిలింగ్ పొడిగించే వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై ఆలోచించి నిర్ణయం చెప్పాలని జాతీయ మెడికల్ కమిషన్ని కోర్టు ఆదేశించింది. కాగా, పీజీ వైద్య కాలేజీల్లో కొన్ని సీట్లు మిగిలిపోయిన విషయం తెలిసిందే.