TG: ఎక్సైజ్ ఆదాయంపై హరీష్ రావు వర్సెస్ మంత్రి జూపల్లి మధ్య వాగ్వాదం నడిచింది. ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరుగుతుందని బడ్జెట్లో పెట్టారని.. దీంతో ప్రజలతో ఎక్కువ తాగించాలని అనుకుంటున్నారా? అని హరీష్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జూపల్లి.. రాష్ట్రం వచ్చినప్పుడు ఎక్సైజ్ ఆదాయం ఎంత? పదేళ్ల తర్వాత ఎంత పెరిగిందని అడిగారు. అంటే BRS ప్రజలను తాగుబోతులను చేసిందా? అని నిలదీశారు.