JN: కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 207 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.