ELR: గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చడంలో జలజీవన్ మిషన్ పథకం ఒక గొప్ప వరం లాంటిదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరులో రూ.65.10 లక్షల రూపాయల జల్జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఓవర్ హెడ్ రిజర్వాయర్ సిస్టం పనులకి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ప్రజలకు త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.