KMR: కాంగ్రెస్ ప్రభుత్వం గారడి బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 100% రుణమాఫీ చేసినట్లు రుజువు చేస్తే తాను నేలకు ముక్కు రాస్తానని అన్నారు. పేదలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదన్నారు.