KDP: పులివెందుల – తొండూరు ప్రధాన రహదారిలోని చెట్ల నీడన తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. డజన్ తాటి ముంజలు రూ.80 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తున్నారు. తాటి ముంజలను తినడంవల్ల శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడి, శరీర బరువును తగ్గిస్తుంది.