SKLM: మెలియాపుట్టి మండలానికి ITDA ఏర్పాటు కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ST కమీషన్ ఛైర్మన్ సొళ్ల బొజ్జి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ITDA ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.