NGKL: వంగూరు మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కురుస్తున్న సమయంలో తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇడమోని లక్ష్మమ్మ (32) అనే మహిళపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కింద తలదాచుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.