గర్భిణీలు ఖర్జూరాలు తినడం వల్ల తల్లి, బిడ్డలకు ఎంతో ఆరోగ్యం. వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తే, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాన్పు సులభం అయ్యే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.