AP: ఆంధ్రా మత్స్యకారుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారుల దాడులను దీటుగా తిప్పికొడతామని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.