KRNL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన AP-AIMS యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఏవో సురేశ్ బాబు రైతులకు సోమవారం సూచించారు. ఈ యాప్ ద్వారా పంట వివరాలు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు వంటి వ్యవసాయ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో తమ రైతు విశిష్ఠ సంఖ్యను నమోదు చేసుకోవాలని తెలిపారు.