ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. మరో 8 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 20 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేసింది. బుమ్రా, సిరాజ్ వంటి పేసర్ల ఫామ్, ఫిట్నెస్ను పరిశీలించేందుకు సెలక్టర్లు నేరుగా మైదానానికే వెళ్లనున్నారు. హర్షిత్ రాణా గాయంతో దూరం కాగా.. మిగిలిన వారి ప్రదర్శనపై ఫోకస్ పెట్టారు.